Friday, 21 October 2011

బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ


బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించిందని, దీనిని జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కర్నూలు జాయింట్ కలెక్టర్ జ్యోతిబుద్ధప్రకాష్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో పొగాకు నిషేధిత కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ 2008 అక్టోబర్ నుంచి బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడాన్ని నిషేధిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని, అయితే అమలుకు నోచుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను అమలు చేసేందుకు రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాస్థాయి కమిటీకి తాను చైర్మన్‌గా వ్యవహరిస్తానని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే రూ.200 నుంచి రూ.1000 వరకు జరిమాన, జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాల్లో పొగ తాగరాదంటూ బోర్డులు పెట్టాలని సూచించారు. పొగ తాగే వారికంటే వదిలిన పొగ పీల్చేవారికే అపాయం ఎక్కువగా ఉంటుందన్నారు. పొగాకు వల్ల కలిగే దుష్ఫలితాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు.

No comments:

Post a Comment