Thursday, 13 October 2011

భారత్, ఇంగ్లండ్ వన్డేకు భారీ భద్రత

బందోబస్తు ఏర్పాట్లపై ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, క్రైమ్, ఆర్మ్‌డ్ రిజర్వు, సెక్యూరిటీ విభాగం అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అల్వాల్ డీసీపీ కె.వెంకటేశ్వరరావుతో కలిసి కమిషనర్ ఉప్పల్ స్టేడియంను పరిశీలించారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తీసుకోవాల్సిన మరిన్ని జాగ్రత్తలను కమిషనర్, డీసీపీకి వివరించారు. అన్ని కోణాలలో పటిష్టమైన బందోబస్తు చర్యలు తీసుకున్నట్లు తిరుమలరావు పేర్కొన్నారు.

బందోబస్తులో...

ముగ్గురు డీసీపీలు
10 మంది అదనపు డీసీపీలు
30 మంది ఏసీపీలు
100 మంది ఇన్‌స్పెక్టర్లు
300 మంది ఎస్‌ఐలు
1500 మంది కానిస్టేబుళ్లు, హెడ్‌కానిస్టేబుళ్లు
500 మంది హోంగార్డులు, స్పెషల్ అధికారులు
4 కంపెనీల ఆర్మ్‌డ్ రిజర్వు బలగాలు
3000 మంది పోలీసుల పహారా
50 సీసీ కెమెరాల ఏర్పాటు
టికెట్‌పైనే సీట్ నెంబర్‌తోపాటు వాహన పార్కింగ్ ప్రదేశం సూచిక

నవంబర్ 3వ తేదీ నగ్రేటర్ రాయలసీమ లక్ష్య సాధన కోసం

                                              


గ్రేటర్ రాయలసీమ లక్ష్య సాధన కోసం నవంబర్ 3వ తేదీన అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు రాయలసీమ రాష్ట్ర సమితి అధ్యక్షులు కుంచెం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. బుధవారం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో రాయలసీమ రాష్ట్ర సమితి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల నుంచి ఇప్పటి వరకు ఆరుగురు ముఖ్యమంత్రులు, రాష్ట్ర గవర్నర్లు ఎన్నికైనా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అన్ని జిల్లాలను అధ్యయనం చేసిన శ్రీకృష్ణ కమిటీ కూడా రాయలసీమ వెనుకబాటును గుర్తు చేసిందన్నారు. ప్రత్యేక తెలంగాణ ఇస్తే అంతకన్నా ముందుగా ప్రత్యేక రాయలసీమ ప్రకటించాలన్నారు.
కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం, రాయచూరు, బళ్లారి, కోలార్, క్రిష్ణగిరి, వేలూరులతో కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు

కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు సీపీఐ

      
                              


ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 21న మండల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్ ఎదుట సామూహిక నిరాహారదీక్షలు చేపట్టనున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి పులి కృష్ణమూర్తి తెలిపారు. బుధవారం ఆ పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యవర్గ విస్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ అధిక ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తి గా విఫలమైందని విమర్శించారు. రైతులు కరవు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతుంటే ప్రభుత్వం పైశాచిక ఆనందాన్ని పొందుతోందని దుయ్యబట్టారు.

ఈ నెల 17, 18 తేదీల్లో కరువు పరిశీలనకు సీపీఐ రాష్ట్ర బృం దం కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు వస్తోందన్నారు

రచయితల సమ్మేళనం తిరుపతిలోని

ఈనెల 15, 16 తేదీలలో ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనం తిరుపతిలోని ఎస్వీయూనివ ర్సిటీ సెనేట్ హాలులో జరగనుంది. సాహిత్య అకాడమీ, విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పలువురు రచయితలు, కవులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభసమావేశానికి ప్రముఖ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీ నందన్ బోరా, సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరేకృష్ణ శత్పథి, సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె. శ్రీనివాసరావు హాజరవుతారు. తొలిరోజు జరిగే కవితాపఠనంలో కొండేపూడి నిర్మల, కె.ఎస్ రమణ, కె.పి.మృత్యుంజయ్(కన్నడ),రోజ్ మేరీ(మలయాళం), త.ఇబోపిషక్ సింగ్(మణిపురి), రోజ్‌మేరీ జూచు(తెనిడి) పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో అస్సామీ నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆదివారం ఉదయం జరిగే కథాపఠనంలో ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, ఏ.ఎన్. జగన్నాథ శర్మ, చంద్రలత, జ్యోతిర్మయి ప్రధాని(రాజ్‌బోంత్షి), సుబ్రభారతి మణియన్(తమిళం) పాల్గొంటారు. ఆరోజు మధ్యాహ్నం జరిగే కవితాపఠనంలో ఎస్.మునిసుందరం, పెరుగు రామకృష్ణ, టెంసులా ఓ(ఇంగ్లీషు), అరబిందో ఉజిర్(బోడో), జయశ్రీ కంబార్(కన్నడ), హరిదాస్ బాలకృష్ణన్(మలయాళం), రఘు లైశాంతెమ్(మణిపురి),మార్గరెట్ పాచౌ(మిజో) పాల్గొంటారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో మణిపురి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, మృదంగ నృత్యం ఉంటుంది

కడప జిల్లాకు చేరిన గ్రూప్-2 మెటీరియల్

 ఏపీపీఎస్‌సీ గ్రూప్-2 పరీక్షకు సంబంధించిన ప్రశ్నా పత్రాలు, ఇతర మెటీరియల్ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నాయి. కలెక్టరేట్ పరిపాలనాధికారి సి.గుణభూషణ్‌రెడ్డి మెటీరియల్‌ను స్వాధీన పరచుకుని జిల్లా ట్రెజరీలో భద్రపరిచారు. ఈ నెల 15, 16వ తేదీలలో గ్రూప్-2 పరీక్షలు జరగనున్నాయి

రాయలసీమను విడగొడితే ఒప్పుకునే ప్రసక్తే లేదు

కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని తెలంగాణవాదులు పేర్కొనడం విడ్డూరంగా వుందని, రాయలసీమను విడగొడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎస్వీ.మోహన్‌రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఇస్తే మొదటగా గ్రేటర్ రాలయసీమను ఇచ్చి ప్రత్యేక నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ధర్మవరం సుబ్బారెడ్డి స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్వీ.మోహన్‌రెడ్డి మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయలతెలంగాణ ఇవ్వాలని ఒకరు, చిత్తూరు, కడపలను కోస్తాంధ్రలో కలిపి మరోక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరికొంతమంది ప్రతిపాదనలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాయలసీమ వాసులు ఎవ్వరి కాళ్ల పంచన చేరాల్సిన ఖర్మ పట్టలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తమకు గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ ఇవ్వకుండా రాయలసీమను ఇతర ప్రాంతాల్లో కలిపితే ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. సకల జనుల సమ్మెతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల కిందట భాష సంయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను ఆంధ్రలో కలిపి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. 50 ఏళ్ల కిందట కలిసిన తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరితే 350 ఏళ్ల కిందటనే సీమ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయులు పాలించారని, ముందుగా గ్రేటర్ రాయలసీమను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, బళ్లారి జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమను ఏర్పాటుచేయాలని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని కోరుకుంటున్నామని, విభజిస్తే తమకు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని, లేకపోతే నేతల ఇళ్లపై దాడులు చేస్తామని ఎస్వీ హెచ్చరించారు

మూతబడుతున్న ఆయిల్ మిల్లులు దిక్కుతోచని స్థితిలో రైతన్న

కొనబోతే శొంఠి ధర .. అమ్మబోతే అల్లం ధర .. అన్న చందంగా తయారైంది జిల్లాలో వేరుశెనగ సాగు చేసిన అన్నదాత పరిస్థితి. పంట సాగుచేసేటప్పుడు అధిక ధరకు విత్తనం కొని పంట చేతికి వచ్చిన సమయంలో అమ్మడానికి వెళ్తే కొన్న ధర కన్నా తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. అసలే అరకొర పంట .. పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందే పరిస్థితి లేదు. ఆర్థిక శాస్త్రం సిద్ధాంతం ప్రకారం.. ఉత్పత్తి పడిపోతే డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే అధిక ధర దక్కుతుంది. కానీ జిల్లాలో అన్నదాత పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. కొనేప్పుడు అధిక ధర పెట్టి కొనాలి .. అరకొరగా పంట చేతికి వచ్చి డిమాండ్ పెరిగినా తక్కువ ధరకే అమ్ముకోవాలి. ఇదీ జిల్లాలో వేరుశనగ రైతు దైన్యస్థితి. 2011 ఖరీఫ్‌లో వేరుశెనగ విత్తనం బహిరంగ మార్కెట్‌లో 40 కిలోల బస్తా ధర రూ.1700 లకు పైగా పలికింది. ఆనాటి ధర ప్రకారం అప్పట్లో క్వింటాళు వేరుశెనగ విత్తనకాయల ధర రూ.4250 వరకూ ఉండేది. ప్రభుత్వం సబ్సిడీతో పంపిణీ చేసిన వేరుశనగ విత్తనకాయలు క్వింటాలు ధర రూ. 3600. ఖరీఫ్‌లో ఆ ధర ప్రకారం కొన్న రైతు ప్రకృతి ప్రకోపానికి తలొగ్గి ఆరుగాలం కష్టపడిన తరువాత చేతికొచ్చిన పంటను అమ్మబోతే సబ్సిడీ ధర కంటే తక్కువ పలుకుతోంది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో 40 కిలోల బస్తా రూ. 1300 ధర పలుకుతోంది. క్వింటాళు వేరుశెనగ విత్తనకాయల ధర ప్రస్తుతం రూ. 3250. దీని ప్రకారం చూస్తే ప్రభుత్వమిచ్చిన సబ్సిడీ ధర కంటే రూ. 350 తక్కువ. అంతే తక్కువ ధరకే రైతులు వేరుశెనగను అమ్ముకోవాల్సిన పరిస్థితి. సబ్సిడీ కాయలు కాకుండా బహిరంగ మార్కెట్‌లో రూ. 4250తో కొనుగోలు చేసిన రైతు క్వింటాలు వేరుశనగపై రూ. 1000 వరకూ నష్టపోతున్నాడు. రాబోయే రోజుల్లో ఇది మరింత తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని వేరుశనగ వ్యాపారులు అంటున్నారు. రాబోయే రోజుల్లో దీని ధర రూ. 1000 నుంచి రూ. 1200లు అయినా ఆశ్చర్యం లేదని వారంటున్నారు. అరకొరగా పంట చేతికి వచ్చిన సమయంలో రోజు రోజుకూ వేరుశెనగ ధర పడిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. అధిక వడ్డీలకు అప్పులు చేసి ఆరుగాలం కష్టపడినా ప్రకృతి కరుణించకపోవడంతోపంట పూర్తిగా చేతికి అందలేదు. జిల్లాలో సెప్టెంబరు నెలలో నెలకొన్న వర్షాభావంతో ఆశించిన దిగుబడి రాకుండాపోయింది. చెట్టుకు ఒకటి రెండు కాయలు మాత్రమే కాశాయి. అరకొరగా దక్కిన పంటనే ఏదో ఒక విధంగా పొలం నుంచి తెచ్చుకుని అమ్ముకుందామని ప్రయత్నిస్తున్న రైతుకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. వేరుశెనగ వ్యాపారుల రంగ ప్రవేశంతో ఈ పరిస్థితి నెలకొందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీకి అప్పులు చేయడంతో ప్రస్తుతం ధర ఎంత పలికినా అమ్ముకోవాల్సిందే. పంట చేతికి వచ్చిందంటే అప్పులు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవుతుంది. దీంతో ఏదో అయిన కాడికి అమ్ముకోవాల్సిన పరిస్థితి. అన్నదాత అవసరాన్ని గుర్తించిన దళారీలు, వ్యాపారులు వారిని నిలువునా ముంచేందుకు సిద్దమయ్యారు. నిన్న మొన్నటి వరకూ బస్తా రూ. 1700 పలికిన వేరుశెనగ ధర ఏకంగా రూ. 1300లకు పడిపోయింది. అరకొర పంటతో అల్లాడుతున్న అన్నదాతకు మార్కెట్‌లో ధర పడిపోవడం ఆశనిపాతమే. ఖరీఫ్‌లో ఎకరాకు రూ.పదివేల పెట్టుబడి పెట్టి సాగు చేశారు. ఎకరానికి 400 కిలోల దిగుబడి రావాల్సిన చోట వంద కిలోల లోపే వచ్చింది. అరకొరగా వచ్చిన పంటను అమ్ముకుందామంటే గిట్టుబాటు ధర లభించడం లేదు

శ్రీశైలం ఆలయానికి మరింత భద్రత

భ్రమరాంబమల్లికార్జునస్వామివార్ల ఆలయ భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదనపు భద్రతా బలగాలను ఎంపిక చేసి, పదవీవిరమణ పొందిన డీఎస్పీ స్థాయి అధికారిని ముఖ్యఅధికారిగా నియమించారు. గతంలో 40మంది ప్రైవేట్ భద్రతా సిబ్బంది విధులు నిర్వహించేవారు. మరో 30మందిని నియమించేందుకు చర్యలు తీసుకున్నారు. సీఎస్‌ఓ (చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్) బాధ్యతలు స్వీకరించాక ఆయనతోపాటు మరో నలుగురి అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. భద్రతా సిబ్బంది ఎంపిక నిర్వహణ బాధ్యతలను వీరు స్వీకరించారు.

రాణా మ్యాన్‌పవర్ అండ్‌ప్లేస్‌మెంట్ ప్రైవేట్‌లిమిటెడ్ ద్వారా సుమారు 120మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 50మందిని ఎంపిక చేశారు. వీరందరికీ ఆరోగ్యపరీక్షలు, శరీరదారుఢ్య, సమర్థత పరీక్షలను నిర్వహించి అందులో 23మందితో పాటు ఏడుగురు మహిళలను భద్రతా సిబ్బందిగా నియమించారు. దీంతో 72మంది ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, 40మంది హోంగార్డులను ఆలయ భద్రత కోసం ఏర్పాటు చేసినట్లయింది. వీరంతా మూడుషిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు.

పోలీసు తరహాలో శిక్షణ నిచ్చాం: కరుణానిధి , సీఎస్‌వో
ప్రైవేట్ సెక్యూరిటీగా ఎంపికైన వారికి పోలీస్ తరహాలో శిక్షణ ఇచ్చాం. భక్తులతో ఎలా మెలగాలో నేర్పించాం. భద్రత విభాగానికి సంబంధించి అధునాతన పరికరాలను సమకూరుస్తామని ఈవో వెంకటేశ్వర్లు హామీ
ఇచ్చారు

కర్నూలు విద్యార్థులకు పోటీలు

జిల్లా స్థాయిలో పాఠశాల విద్యార్థులకు ఈ నెల 15న వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ డీఈఓ శైలజ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటలకు స్థానిక పాత కంట్రోల్ రూం వద్ద ఉన్న ప్రభుత్వ ఉర్దూ హైస్కూల్‌లో ఈ పోటీలు జరుగుతాయన్నారు. కర్నూలు, డోన్, నంద్యాల, ఆదోని డివిజన్ స్థాయిలో ఎంపికైన విద్యార్థులు ఈ పోటీకి అర్హులన్నారు. మత సామరస్యం-జాతీయ సమైక్యత అనే అంశంపై పోటీ ఉంటుందని తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహక బహుమతులు ఉంటాయన్నారు

ఎస్వీయూనివర్సిటీలో సౌతిండియా రచయితల సమ్మేళనం

ఈనెల 15, 16 తేదీలలో ఈశాన్య, దక్షిణ భారతీయ రచయితల సమ్మేళనం తిరుపతిలోని ఎస్వీయూనివ ర్సిటీ సెనేట్ హాలులో జరగనుంది. సాహిత్య అకాడమీ, విశ్వవిద్యాలయ ఆంగ్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో దేశంలోని అనేక ప్రాంతాల నుంచి పలువురు రచయితలు, కవులు పాల్గొననున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు జరిగే ప్రారంభసమావేశానికి ప్రముఖ కథా రచయిత ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి, ప్రముఖ అస్సామీ రచయిత లక్ష్మీ నందన్ బోరా, సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి హరేకృష్ణ శత్పథి, సాహిత్య అకాడమీ ఉపకార్యదర్శి కె. శ్రీనివాసరావు హాజరవుతారు. తొలిరోజు జరిగే కవితాపఠనంలో కొండేపూడి నిర్మల, కె.ఎస్ రమణ, కె.పి.మృత్యుంజయ్(కన్నడ),రోజ్ మేరీ(మలయాళం), త.ఇబోపిషక్ సింగ్(మణిపురి), రోజ్‌మేరీ జూచు(తెనిడి) పాల్గొంటారు.

అదే రోజు సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో అస్సామీ నృత్య ప్రదర్శన ఉంటుంది. ఆదివారం ఉదయం జరిగే కథాపఠనంలో ఆర్.ఎం. ఉమామహేశ్వర రావు, ఏ.ఎన్. జగన్నాథ శర్మ, చంద్రలత, జ్యోతిర్మయి ప్రధాని(రాజ్‌బోంత్షి), సుబ్రభారతి మణియన్(తమిళం) పాల్గొంటారు. ఆరోజు మధ్యాహ్నం జరిగే కవితాపఠనంలో ఎస్.మునిసుందరం, పెరుగు రామకృష్ణ, టెంసులా ఓ(ఇంగ్లీషు), అరబిందో ఉజిర్(బోడో), జయశ్రీ కంబార్(కన్నడ), హరిదాస్ బాలకృష్ణన్(మలయాళం), రఘు లైశాంతెమ్(మణిపురి),మార్గరెట్ పాచౌ(మిజో) పాల్గొంటారు. సాయంత్రం శ్రీనివాస ఆడిటోరియంలో మణిపురి మార్షల్ ఆర్ట్స్ ప్రదర్శన, మృదంగ నృత్యం ఉంటుంది.

అనంతపురానికి 500 మినీ డైరీలు

రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై) కింద 25 శాతం సబ్సీడీతో ఇస్తున్న మినీ డెయిరీలను పాడి రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పశుసంవర్ధకశాఖ ఇన్‌చార్జి జేడీ డాక్టర్ జయకుమార్ కోరారు. 2011-12 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు 500 మినీ డెయిరీలు మంజూరయ్యాయని.. వాటికి సంబంధించి దరఖాస్తులు, ఇతరత్రా వివరాలు సమీపంలోని పశువైద్యశాలలు అందుబాటులో ఉన్నాయని తెలియజేశారు.

500 మినీ డెయిరీలతో పాటు 630 పొట్టేళ్లపిల్లల పెంపకం యూనిట్ల కోసం సబ్సిడీ కల్పిస్తున్నామన్నారు. మండలాల వారీగా, బ్యాంకుల వారీగా లక్ష్యాలు కేటాయించినట్లు తెలిపారు. ఉపాధిహామీ పథకం కింద పశుగ్రాసం పెంపకానికి రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.  ప్రతి బుధవారం సాయంత్రం వేళ 08554-275161 నంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో జేడీతో పాటు ఏడీ డాక్టర్ సుధాకర్, పశువైద్యులు డాక్టర్ పెద్దన్న, డాక్టర్ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 



source: sakshi