Wednesday, 15 February 2012

అన్ని అంశాలపై చర్చకు సిద్ధం ...సిఎం

శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, నిరసనలు, ఆందోళనలు, వాయిదాలతో సభ సమయాన్ని వృధా చేసి, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం సరికాదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఇలా అయితే మాట్లాడడానికి ఏమీ లేదు కాబట్టే ప్రతిపక్షాలు సభా కార్యక్రమాలను స్తంభింపజేస్తున్నాయని అనుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు.ప్రతిపక్షాలు ప్రభుత్వానికి తగిన సూచనలు చేయకుండా, ఏమీ మాట్లాడకపోతే తమ ప్రభుత్వం బాగా పనిచేస్తున్నట్లు నిర్ధారించుకోవాల్సి వస్తుందని కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాలు 31 రోజుల పాటు జరుగుతాయని, కావాలంటే సభను ఎక్కువ సమయం పెంచుకుంటూ, సభను నడుపుకుందామని, ప్రతీ ప్రశ్నకు తాము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి మరోమారు స్పష్టం చేశారు.

రాజ్యసభకు అవకాశం ఇవ్వండి...వైఎస్ వివేకానందరెడ్డి

దీంతో ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ, వైఎస్ అభిమానుల్లోనూ ఆనందానికి రాజకీయంగా తాను ఎదిగేందుకు రాజ్యసభకు అవకాశం కల్పించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ఢిల్లీలోని ముఖ్యనేతలను కలిసి మంగళవారం విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. ఈమేరకు పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె రాజకీయ సలహాదారుడు అహ్మద్ పటేల్, కేంద్ర మంత్రి జయపాల్‌రెడ్డి తదితర ప్రముఖులతో ఆయన సంప్రదించి తెలిసింది. ముఖ్యంగా పొలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని, రాయలసీమలో నిర్మాణంలో ఉన్న గాలేరు, హంద్రీ నీవా సృజల స్రవంతి ప్రాజెక్టుల పనులు సత్వర పూర్తి చేయడానికి కావాల్సిన నిధులు విడుదల చేయాలని కోరారు. అలాగే రాయలసీమ జిల్లాలు ఎంతో వెనుకబడి ఉన్నాయని, సీమ అభివృద్ధికి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని హైకమాండ్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే పులివెందులలో ప్రస్తుతం గ్యాస్ సమస్య తీవ్రంగా ఉందని, ఆ సమస్య పరిష్కారానికి వెంటనే అదనపు గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాలని కోరారు. ఇక పోతే దివంగత నేత డాక్టర్ వై ఎస్. రాజశేఖర్‌రెడ్డి వేలాది కోట్ల రూపాయలు వివిధ ప్రాజెక్టులు, భారీ అభివృద్ధి పనులకు ఖర్చు చేశారని వాటిలో చాలా వరకు చివరి దశలోనూ, అర్ధాంతరంగా ఉన్నాయని వాటన్నింటినీ పూర్తి చేసినట్లు అయితే ప్రజల్లో మంచిపేరు వస్తుందని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ముఖ్యంగా పులివెందుల నియోజక వర్గంతో పాటు రాయలసీమ వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించడంతో పాటు జిల్లా నుంచి తనను రాజ్యసభకు పంపినట్లయితే పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఈ ప్రాంత సమస్యలను పరిష్కరించేందుకు వీలుగా ఉంటుందని విజ్ఞప్తి చేశారు. ఇందుకు హైకమాండ్ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

జూ ఎన్టీఆర్‌ కి ఎంఎల్.ఏ స్క్రిప్టు ఖరారు

గత మూడేళ్లుగా ఎన్టీఆర్ ..'ఎంఎల్.ఏ'అవుతాడంటూ ఊరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ స్క్రిప్టుకి ఇన్నాళ్లకు మోక్షం వచ్చిందంటున్నారు. జూలై లో ఈ చిత్రం అఫీషియల్ గా లాంచ్ అవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ చిత్రం డైరక్ట్ చేస్తున్న హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయనున్నారు. గతంలో ఎన్టీఆర్ తో ఆది వంటి సూపర్ హిట్ ఇచ్చిన నల్లమలుపు బుజ్జి 'షాక్' డైరక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్లాన్ చేయబోతున్న చిత్రం ఇది. ఎం ఎల్ ఎ టైటిల్ అర్దం మంచి (ఎం)లక్షణాలు (ఎల్)ఎ(అబ్బాయి) అని వారి భావమట. టైటిల్ ఒకటే ఇలా రాజకీయాల్ని గుర్తు చేస్తుందా లేక సినిమా కూడా రాజకీయాలచుట్టూ తిర్గుతుందా అనేది ఇంకా తెలియరాలేదు. అయితే మాత్రం సినిమాలో పొలిటికల్ సెటైర్స్ మాత్రం ఉంటాయిని అంటున్నారు. ఇక ఈ సినిమాలో మరో విశేషముంది. పెద్ద ఎన్టీఆర్ ని గాడ్ ఫాదర్ గా చెప్పే రాజేంద్రప్రసాద్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కి తండ్రిగా చేయబోతున్నారని న్యూస్.జూ ఎన్టీఆర్-శ్రీను వైట్ల కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈచిత్రానికి ‘యాక్షన్’ అనే టైటిల్ నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ...‘బాద్ షా’ అనే మరో టైటిల్ పై కూడా దర్శక నిర్మాతలు దృష్టి పెట్టారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ‘బాద్ షా’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

వైయస్ విజయమ్మ రాజ్యసభకు పోటీ?

త్వరలో జరిగే రాజ్యసభ ఎన్నికల విషయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ బరిలోకి తన తల్లి, శాసనసభ్యురాలు వైయస్ విజయమ్మను దింపే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసు పార్టీని ఇరకాటంలోకి నెట్టే ప్రయత్నం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెలాఖరున రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుంది. వచ్చే నెల మూడో వారంలో ఎన్నికలు జరుగుతాయి. తమపై సాధ్యమైనంత త్వరగా వేటు వేసేలా స్పీకర్‌పై మరింత ఒత్తిడి పెంచడమే వారి వ్యూహంగా కనిపిస్తోంది. తెలంగాణలోని ఆరు స్థానాలకు, కోవూరు స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించినప్పుడు తమకు చెందిన 17 స్థానాలకు ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుతూ వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఎన్నికల కమిషన్‌కు లేఖ కూడా రాశారు. ఏడు స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తమపై అనర్హత వేటు వేసేలా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యూహాన్ని రచించారని విమర్శిస్తున్న వారు స్పీకర్‌పై ఒత్తిడి పెంచుతున్నారు. రాష్ట్రంలోని 24 స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు వచ్చేలా చూడాలనేది వారి వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే మరింత దూకుడుగా వారు వ్యవహరించేందుకు నిర్ణయించుకున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి 17 మంది శాసనసభ్యుల మద్దతు ఉంది. అనర్హత వేటులో స్పీకర్ జాప్యం చేస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికలపై వైయస్ జగన్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. పది మంది శాసనసభ్యులు రాజ్యసభ అభ్యర్థిని ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఆ 17 మంది మద్దతుతో పాటు అవసరమైతే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు కూడా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. తెలంగాణపై కాంగ్రెసు మోసం చేస్తోంది కాబట్టే కాంగ్రెసును ఓడించడమే లక్ష్యంగా తెరాస మద్దతు ఇచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అలాగే, వైయస్ రాజశేఖర రెడ్డిపై అభిమానం ఉన్న మరి కొంత మంది కాంగ్రెసు శాసనసభ్యుల మద్దతు కూడా కూడగట్టుకోవచ్చుననేది ఆలోచనగా చెబుతున్నారు

హీరో గోపీచంద్ పెళ్లి రద్దు

గత కొన్ని రోజుల క్రితమే ఎంగేజ్ మెంట్ కూడా పూర్తయింది. ఫిబ్రవరి 24న పెళ్లి జరుగాల్సి ఉంది. ఇప్పటికే పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమం కూడా పూర్తయిది. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ వివాహం రద్దయినట్లు తెలుస్తోంది.హీరో గోపీచంద్ వివాహం కూడా వివాహానికి సిద్దమైనట్లు సమాచారం. గోపిచంద్ వివాహం చాలా రోజులుగా వార్తల్లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా గోపీచంద్ ..హారిత అనే అమ్మాయిని ఎరేంజెడ్ మ్యారేజ్ చేసుకోనున్నాడంటూ ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఆ మధ్య న జగపతి బాబు కూతురుని వివాహం అంటూ వార్తలు వచ్చిన తర్వాత మరోసారి అతని వివాహం అంతటా చర్చ అయ్యింది. హైదరాబాద్ కు చెందిన బిజినెస్ టైకూన్ కూతురు హారిక అని, ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి, ఆస్ట్రేలియాలో ఎమ్.బి.ఎ చేస్తోందంటూ చెప్తున్నారు. గోపీచంద్ ఈ మధ్యనే ఈ సంభందంని పెళ్లిచూపులు సంప్రదాయబద్దంగా చూసాడని, ఆమె బాగా నచ్చటంతో ఓకే చేసాడని చెప్తున్నారు.తెలుగు హీరో గోపీచంద్ వివాహం హరిత అనే అమ్మాయితో ఖరారైన విషయం తెలిసిందే.  అసలు కారణాలు తెలియరాలేదు కానీ....పర్సనల్ ప్రాబ్లమ్సే కారణమనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అఫీషియల్ స్టేట్ మెంట్ వెలువడాల్సి ఉంది. సినీ హీరో అయిన గోపీచంద్ కు...ఆస్ట్రేలియా యూనివర్శిటీ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన హరితతో వివాహం ఫిక్స్ కావడంతో సంతోషంగా ఉన్న గోపీచంద్ అభిమానులు, శ్రేయోభిలాషులు ఈ విషయంతో షాక్ అయ్యారు. గోపీచంద్ కు ఓ ప్రముఖ హీరోయిన్ తో ఎఫైర్ ఉందని గతంలో వార్తలు వినిపించాయి. ఈ వ్యవహారం కూడా కారణం అయి ఉండవచ్చనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఫిల్మ్ నగర్లో.

యువరాజ్ కి ఆర్మ్‌స్ట్రాంగ్ సందేశం


క్యాన్సర్‌తో బాధపడుతున్న డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ వ్యాధి నుంచి త్వరగా కోలుకోవాలని సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ సందేశం పంపాడు. ప్రస్తుతం కీమోథెరపీ చికిత్స కోసం యువీ అమెరికాలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సందేశాన్ని యువరాజ్ తన ట్విట్టర్ పేజీలో ఆర్మ్‌స్ట్రాంగ్ ఫొటోతో సహా పెట్టాడు. ‘నీ కోసం మా ‘లివ్‌స్ట్రాంగ్’ టీమ్ మొత్తం ఉందనే విషయం నీకు తెలియాలని కోరుకుంటున్నాం. విజ్ఞానం శక్తివంతమైంది, ఐకమత్యమే మహా బలం, మన దృక్పథం అన్నింటికన్నా కీలకం అని మేం తరచూ చెబుతుంటాం.. నమ్ముతాం కూడా’ అని యువీకి ఆర్మ్‌స్ట్రాంగ్ మెసేజ్ చేశాడు. ఆర్మ్‌స్టాంగ్ కూడా గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్నాడు. తన లివ్‌స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇలాంటి బాధితులకు సహాయకారిగా ఉంటోంది. మరోవైపు లాన్స్ సందేశంపై యువీ కృతజ్ఞతలు తెలిపాడు. ‘లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్‌నుంచి వచ్చిన సందేశం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ లాన్స్.. త్వరలోనే మనం కలుసుకోవాలని కోరుకుంటున్నా’ అని యువీ ట్వీట్ చేశాడు.