Monday, 19 December 2011

సచిన్ టెండూల్కర్ భారతరత్న వద్దు..మాజీ కెప్టెన్ అజరుద్దీన్

భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై తనకు గల వ్యతిరేకతను మరోసారి బయటపెట్టారు పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహ్మద్ అజరుద్దీన్. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వడానికి అనువుగా నిబంధనలను సవరించిన నేపథ్యంలో ఆయన ఓ ప్రకటన చేశారు. హాకీ లెజెండ్ ధ్యాన్‌చంద్‌కు ఇవ్వకుండా సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న ఇవ్వకూడదని ఆయన శనివారం అన్నారు. సచిన్ టెండూల్కర్ కన్నా ముందు ధ్యాన్‌చంద్‌కు భారతరత్న రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. సచిన్ టెండూల్కర్, ధ్యాన్‌చంద్‌లను భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు అర్హులను చేస్తూ నిబంధలను సవరించారు. వారిద్దరికి ఆ అవార్డు లభించడానికి వీలు కల్పించే ఆ సవరణలను దేశం యావత్తూ స్వాగతించింది. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న రావాలని దేశం మొత్తం ఆశిస్తోంది. ఈ సమయంలో అజరుద్దీన్ అందుకు విరుద్ధంగా ప్రతిస్పందించారు

హంతకులు దొరికితే అక్కడే కాల్చేయండి...కర్నూలు జిల్లా ఎస్పీ

కర్నూలు జిల్లాలో గత కొద్ది రోజులుగా పెద్ద యెత్తున హత్యలు జరుగుతున్నాయి. నెలకు పది నుంచి 15 హత్యలు జరుగుతున్నట్లు సమాచారం. సోమవారం కూడా ఓ హత్య జరిగింది. పోలీసులంటే భయం లేకుండా పోయిందని ఎస్పీ అభిప్రాయపడుతున్నారు. గత 15 రోజుల వ్యవధిలో ఆరు హత్యలు జరిగినట్లు తెలుస్తోంది. రౌడీ షీటర్లు, పాతకక్షలు పెట్టుకున్నవారు ఇష్టారాజ్యంగా హత్యలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. కర్నూలు జిల్లాలో హత్యలు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లా పోలీసు సూపరింటిండెంట్ (ఎస్పీ) సోమవారం పోలీసులకు సంచలన ఆదేశాలు జారీ చేశారు. హత్యా స్థలంలో నిందితులు కనిపిస్తే కాల్చేయాలని ఆయన పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులు వాహనంలో పారిపోతుంటే వాహనం టైర్లను పేల్చేయాలని ఆయన ఆదేశించారు. హత్య కేసుల్లో అలా చేస్తే విచారణ ఉండదని ఆయన చెప్పారు. నిందితులకు నేరుగా శిక్ష వేయాలని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి పోలీసూ ఆయుధాన్ని దగ్గర ఉంచుకోవాలని, సాధారణ పౌరులకు ఇబ్బంది కలగకూడదని ఆయన అన్నారు.

అలీ, బ్రహ్మానందంలకు నో చెప్పిన పూరీ జగన్నాధ్?

పూరీ జగన్నాధ్ ప్రతీ చిత్రంలోనూ బ్రహ్మానందం, అలీలకు ప్రత్యేకమైన కామిడీ ట్రాక్ ఉంటుంది. అయితే ఈసారి మహేష్ తో చేస్తున్నది బిజినెస్ మ్యాన్ చిత్రంలో వారిద్దరికీ నో చెప్పాడని తెలుస్తోంది. కేవలం ధర్మవరపు సుబ్రమణ్యం మీద కామిడీ ఉండేలా ప్లాన్ చేసాడని, మిగతా కామిడి విభాగాన్ని మహేష్ చేతే మోయించాడని అని వినపడుతోంది. దూకుడు సూపర్ హిట్ తో మహేష్ కామిడీ మీద విపరీతమైన నమ్మకం కలిగిన పూరీ జగన్నాధ్ ఇలా ప్లాన్ చేసాడని చెప్పుకుంటున్నారు. అయితే చిత్రంలో మంచి కామిడీ ఉందని,యాక్షన్ తో పాటు ఆ సీన్స్ కు కూడా ప్రాముఖ్యత ఉందని సమాచారం.

పాతికేళ్ల తర్వాత సత్యసాయి ప్రశాంతి నిలయంలో విద్యుత్ కోత

ప్రశాంతి నిలయంలో పాతికేళ్ళుగా అమలుకాని విద్యుత్ కోతను ఆదివారం పట్టణ ప్రజలు చవిచూశారు. సత్యసాయి భౌతికంగా వున్న రోజుల్లో ప్రశాంతి ని లయంలో విద్యుత్ అంతరాయం, కోత అనే రెండు పదాలు చవిచూసిన దా ఖలాలు లేవు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యు త్ కోత అమలుచేసినప్పటికీ ప్రశాంతి నిలయం ఫీడర్‌కు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా అయ్యేది. అయితే సత్యసాయి శివైక్యానంతరం పరిస్థితులు మారిపోయాయి. ప్రప్రథమంగా 8 గంటల పాటు పాతికేళ్ళ విరామానంతరం విద్యుత్ కోతను విధించడం పట్టణ ప్రజలను, వ్యాపార వర్గాలను ఇబ్బందులకు గురిచేసింది. ఆదివారం నుండి అమలులోకి వచ్చిన విద్యుత్ కోతల మేరకు ఉదయం 6 నుండి 10 దాకా, తిరిగి మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 4 గంటల దాకా విద్యుత్ కోత అమలులో వుంటుంది. పగటివేళ రోజు మొత్తం కలిపి 4 గంటలు మా త్రమే విద్యుత్ సరఫరా అవుతుంది. దీంతో పుట్టపర్తిని సందర్శించే పర్యాటకులు విద్యుత్ కోత మూలంగా వసతి గృహాల్లో వేడి నీరు దొరకని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. బహుళ అంతస్థుల్లో నివసిస్తున్న వయసు పైబడిన భక్తులు విద్యుత్ కోతతో లిఫ్ట్‌లు పనిచేయకపోవడంతో సమాధి దర్శనానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు. ఇదిలా వుండగా పట్టణంలో వ్యా పార సముదాయాలు విద్యుత్ కోతతో స్తంభించాయి. ఇదిలా వుండగా ట్రాన్స్ కో అధికారులు సైతం వరి పంటను సాగు చేయవద్దని కేవలం ఆరుతడి పంటలు మాత్రమే సాగు చేయాలని కోరడం చూస్తే రానున్న రోజుల్లో విద్యుత్ కోత ప్రభావం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. శీతాకాలంలోనే పరిస్థితి ఈ విధంగా వుంటే వేసవికాలంలో విద్యుత్ సరఫరా వుంటుం దా లేదా అనే ప్రశ్నలు వినిపిస్తున్నా యి. ఏది ఏమైనా పుట్టపర్తిలో అంతర్జాతీయ పర్యాటకుల తాకిడితోపాటు సూపర్ స్పెషాలిటి హాస్పిటల్‌లో వైద్య సేవలు కొనసాగుతున్న దృష్ట్యా రోగులకు అసౌకర్యం కలిగే పరిస్థితి నెలకొంటుంది. కావున ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు పుట్టపర్తిని దృష్టిలో వుంచుకొని విద్యుత్ కోతను అమలుచేయకుండా ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని స్థానికులు కోరుతున్నారు.

ఎన్టీఆర్, చిరులపై విమర్శలున్న బుక్ రూ. 10 వేలు

ప్రముఖ సినీ నిర్మాత, రచయిత ఎంఎస్.రెడ్డి(మల్లెమాల) ‘ఇది నా కథ’ పేరుతో తన ఆత్మకథ రాసి పుస్తక రూపంలో ఆ మధ్య విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పుస్తకంలో తన సినీ జీవితంతో పాటు పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, గుణశేఖర్ లాంటి వారిపై విమర్శలు చేస్తూ...సాధారణ జనాలకు వారి మనస్తత్వం గురించి తెలియని విషయాలను బట్టబయలు చేశారు. ఒక రకంగా చెప్పాలంటే తెలుగు సినీ పరిశ్రమలో చీకటి కోణాల్ని కూడా తన పుస్తకంలో ఆవిష్కరించారు మల్లెమాల. ఈ పుస్తకంపై పరిశ్రమలో రగడ రేగిన నేపథ్యంలో ఎంఎస్.రెడ్డి తనయుడు శ్యాంప్రసాద్ రెడ్డి వెంటనే ఆ పుస్తకాలన్నింటినీ...మార్కెట్ నుంచి వెనక్కి తెప్పించారు. ఇటీవల ఎంఎస్.రెడ్డి మరణించిన నేపథ్యంలో....ఈ పుస్తకం మళ్లీ హాట్ టాపిక్ అయింది. ఆ పుస్తకాన్ని దక్కించుకోడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నా...ఎక్కడా దొరకడం లేదు. ఇదే అదునుగా తొలుత ఆ పుస్తకాన్ని దక్కించుకున్న కొందరు వ్యక్తలు, ఆపుస్తకాన్ని మరిన్ని కాపీలు తయారు చేయించి రూ. 10వేల చొప్పున గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్‌లో అమ్ముతున్నట్లు ఫిల్మ్ నగర్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం.

పరిటాల అనుచరుడు చమన్‌పై హత్య కేసు కొట్టివేత

హైదరాబాదులోని అమీర్‌పేటలో జరిగిన హత్య కేసును మాజీ మంత్రి పరిటాల రవి అనుచరుడు చమన్‌పై నాంపల్లి కోర్టు సోమవారం కొట్టేసింది. అమీర్‌పేటలో 2005లో జరిగిన బిల్డర్ హత్యపై ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషనులో కేసు నమోదైంది. ఆస్తి వివాదం వల్ల ప్రత్యర్థులు పరిటాల రవి అనుచరులతో అతన్ని హత్య చేయించినట్లు పోలీసులు నాంపల్లి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ఇందుకు సంబంధించి తెలుగుదేశం నాయకుడు వల్లభనేని వంశీ, పరిటాల మరో అనుచరుడు పోతుల సురేష్ తదితరులపై గతంలోనే కోర్టు కేసును కొట్టేసింది. చమన్ ఇటీవలే పోలీసులకు లొంగిపోయారు. బిల్డర్ హత్య కేసులో చమన్ పాత్రపై కోర్టు విచారణ జరిపింది. తగిన సాక్ష్యాధారాలు లేనందున అభియోగాలను కొట్టేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. పరిటాల రవి హత్యానంతరం చమన్ అజ్ఞాతంలోకి వెళ్లారు. పరిటాల రవి ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్న మద్దెలచెర్వు సూర్యనారాయణ రెడ్డి అలియాస్ మద్దెలచెర్వు సూరి హత్య తర్వాత ఆయన పోలీసులకు లొంగిపోయారు. చమన్‌పై పలు పోలీసు కేసులున్నాయి.

ఆస్ట్రేలియాలో చలికాలం పోయి వేసవి...మహేంద్ర సింగ్ ధోనీ

టీమిండియా సారథి మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్ కూల్‌గానే కాదు, చ మత్కారాలతో నవ్వులు పూయించడంలోనూ దిట్టే! ఇక్కడి భారత హైకమిషన్... టీమిండియా గౌరవార్థం శనివారం ఇచ్చిన విందులో ధోనీ తన చలోక్తులతో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మార్చాడు. భారత్-ఆసీస్ సిరీస్ అంటే వాణిజ్య ప్రకటనలూ పదునుదేలుతాయంటూ, 'ఓ వాణిజ్య ప్రకటన చూశా. అందులో, తాజా సిరీస్ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో చలికాలం పోయి వేసవి వచ్చేసింది. ఇక వేడి తీవ్రత మరింత పెరగనున్నదని చెప్పారు. ఈ విషయాన్ని నేను చాలా సీరియస్‌గా నమ్మాను, అందుకే, ఒక్క లెదర్ జాకెట్ కూడా వెంట తెచ్చుకోలేదు. మరిక్కడేమో చల్లగా ఉందాయె' అనడంతో పార్టీకొచ్చిన భారత ప్రవాసులందరూ ఒక్కపెట్టున నవ్వుల్లో మునిగిపోయారు. ఇక మంకీగేట్ వివాదంలో భాగస్వాములు హర్భజన్, సైమండ్స్‌లు ఈసారి జట్లలో లేకపోవడంతో కుర్రాళ్లు ఆ బాధ్యత తీసుకుంటారని ధోనీ చెప్పుకొచ్చాడు. 'సిరీస్‌కు ముందు అందరూ కంగారూలను స్లెడ్జింగ్‌కు భారత్ అడ్డుకట్ట వేయలేదన్నారు. కానీ, మేమూ మాటకుమాట జవాబివ్వగలం. భజ్జీ, సైమో లేకపోతేనేం కుర్రాళ్లు ఆ లోటును భర్తీ చేస్తార్లే' అంటూ వ్యాఖ్యానించాడు.