Friday, 28 October 2011

టీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి

AAటీడీపీ-కాంగ్రెస్‌ వర్గాల మధ్య నెలకొన్న పాత కక్షలుభగ్గుమన్నాయి.
దీంతో..ఇరువర్గాలు దాడికి దిగాయి. ఈ దాడిలో 10మంది గాయపడ్డారు.చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామపంచాయితీలోని వడ్డె పల్లిలో ఈ ఘటన జరిగింది.గాయపడిన వారిలో మహిళలు కూడా ఉన్నారు.క్షతగాత్రులను పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు ప్రత్యేక పూజలు చేపట్టారు

తిరుపతిలో వరలక్ష్మి నోములను మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు దేవాలయాల్లో ముత్తయిదువలు ప్రత్యేక పూజలు చేపట్టారు. దీంతో అమ్మవారి ఆలయాలు కిటకిటలాడాయి. పూలు, పండ్లు పూజకు ప్రధానం కావడంతో వీటి ధరలకు రెక్కలొచ్చాయి. ఇక అరిసెలు సమర్పించడం ఇక్కడి పూజలో ప్రత్యేకం. దీంతో ఇక్కడి అరిసెలు తయారు చేసే వారు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. దీపావళి సందర్భంగా ముత్తయిదవలు మంగళగౌరీ వ్రతం నిర్వహించడం పరిపాటి. తమ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ వారు ఈ వ్రతాన్ని చేపట్టారు. పూజానంతరం నోము దారాలను కట్టుకోవడం సంప్రదాయంగా వస్తోంది. .

తమ కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తుంటారు.గౌరీ నోముల్లో పూలు, పండ్లతో పాటు అరిసెలు సమర్పించడం తప్పనిసరిగా భావిస్తారు. అరిసెల తయారీ శ్రమ, ఖర్చుతో కూడుకున్నది కావడంతో ఇప్పుడు తిరుపతిలో కొన్ని కుటుంబాలు ప్రత్యేకంగా అరిసెల తయారీని చేపట్టారు. దీంతో ఇళ్లల్లో అరిసెల తయారీ బాధ తప్పింది. విజయవాడకు చెందిన కొన్ని కుటుంబాల వారు ఇప్పుడు అరిసెల తయారీ చేపట్టి తిరుపతిలో అమ్ముతున్నారు. అంగళ్లు ఏర్పాటు చేసుకున్న వారికి కూడా ఉపాధి లభిస్తోంది

గంభీర్‌ పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు

ఇన్ని రోజులు టీమిండియా  మైదానంలో ఆటతో అభిమానులను అలరిస్తే ఈరోజు మాత్రం గుర్గావ్‌లో పెళ్లికొడుకు అవతారంలో అభిమానులను అలరించనున్నాడు. బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్పి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె నటాషా జైన్‌తో గంభీర్‌ గుర్గావ్‌ ఫామ్‌ హౌస్‌లో పెళ్లి చేసుకొనున్నాడు. ఈ ప్రయివేట్‌ కార్యక్రమానికి గంభీర్‌ సన్నిహిత స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఈ వివాహానికి ప్రముఖ సింగర్‌ రహత్‌ ఫతేష్‌ ఖాన్‌ ప్రత్యేక ఆహ్వానితునిగా విచ్చేయనున్నాడు. 
Natasha Jain-Gautam Gambhir
, నటాషా జైన్‌లకు సంవత్సరం క్రితం పరిచయం ఏర్పడింది. ఆరు నెలల కిందే వీరి వివాహాం జరగాల్సింది. కానీ భారత్‌-ఇంగ్లండ్‌ వన్డే సిరీస్‌ నేపథ్యంలో వాయిదా పడింది. కొత్త దంపతులకు వెడ్డింగ్‌ డ్రెస్‌ను ప్రముఖ డిజైనర్‌ శాంతాను నిఖిల్‌ రూపొందించారు. శనివారం ఇంగ్లండ్‌తో జరగనున్న ఏకైక టి20 మ్యాచ్‌కు గంభీర్‌ అందుబాటులో ఉండడు. ఇక గంభీర్ పెళ్లికి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ మొదలగున వారు హాజరవనున్నట్లు తెలిసింది

అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది

శ్రీ సత్యసాయి సన్నిధానానికి ప్రాచుర్యమైన అనంపుతరం జిల్లాలో బంగారు నానో తన మెరుపులతో చూపరులను ఆకట్టుకుంటుంది. దేశంలో స్వర్ణాభరణాల తయారీ మొదలై 5,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణకారుల జ్ఞాపకార్థం టాటా మోటార్స్ ఈ గోల్డ్ నానో కారును రూపొందించి. భారతదేశంలో ఒక్కోప్రాంతాని సంబంధించిన ఒక్కొక్క డిజైన్‌ను ఈ గోల్డ్ నానోపై చూడవచ్చు.

                           గత నెలలో టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఈ బంగారు నానో (గోల్డెన్ నానో) ఆవిష్కరించారు. టాటా గ్రూపులోని స్వర్ణాభరణాల విభాగం అయిన 'టాటా గోల్డ్ ప్లస్' కంపెనీ ప్రచారంలో భాగంగా ఈ బంగారు నానో కారును దేశవ్యాప్తంగా ఉన్న అన్ని గోల్డ్ ప్లస్ అవుట్‌లెట్లలో ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నారు. ఇందులో భాగంగానే కంపెనీ తమ బంగారు నానో కారును అనంతపురం జిల్లాలో కూడా ప్రదర్శనకు ఉంచింది.

గోల్డ్ నానో తయారీ కోసం 80 కేజీల స్వచ్ఛమైన బంగారాన్ని, 15 కేజీల వెండిని మరియు 10,000 రత్నాలను ఉపయోగించారు. ఈ బంగారు నానో కారు తయారీకి కంపెనీ సుమారు రూ.22 కోట్లకు పైగా ఖర్చు చేసింది