Saturday, 11 February 2012

చంద్రబాబు పై సెటైర్లు... ఎమ్మెల్యే చిరంజీవి

బైక్‌రైస్ చేసినంత మాత్రాన యువత వారి వెంట వెళ్లరని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఎమ్మెల్యే చిరంజీవి పరోక్ష విమర్శలు చేశారు.చంద్రబాబు బైక్ ర్యాలీలపై ఆయన విసుర్లు విసిరారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ పేర్లు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలు చేశారు. బైక్ ర్యాలీలు చేసినంత మాత్రాన యువకులు విశ్వసించబోరని, వారికి ఏమైనా చేస్తేనే వారు విశ్వసిస్తారని ఆయన అన్నారు.  గుంటూరులో 2009లో యువగర్జన సదస్సు నిర్వహించారని, యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని హామీ ఇచ్చారని, అలా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇప్పుడు 40 శాతం సీట్లు యవతకు ఇస్తామంటున్నారని, అంత మాత్రాన యువత నమ్మబోదని ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. రాష్ట్రంలో కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తనతో పాటు తన అభిమానులందరూ కాంగ్రెసు పార్టీలోకి రావడం సంతోషకరంగా ఉందని ఆయన అన్నారు.శనివారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ కొందరి మాటలు నమ్మే స్థితిలో యువత లేదని ఆయన అన్నారు. తన తో అనుబంధం ఉన్న అభిమానులందరూ నేడు కాంగ్రెస్ వైపు రావడం సంతోషకరంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు.

1994 నుంచి భూకేటాయింపులపై విచారణ చేపట్టాలి...విజయమ్మ

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ హయాంలోని భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని కొంత మంది శాసనసభ్యులు డిమాండ్ చేస్తున్నారని, అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అందుకు సిద్ధంగా లేరని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని కాగ్, లోకాయుక్త కూడా తప్పు పట్లలేదని ఆమె గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందుకే వైయస్ ప్రభుత్వ హయాంలోని భూకేటాయింపులపై మాత్రమే సభా సంఘం వేశారని విజయమ్మ విమర్శించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కృష్ణపట్నం, గంగవరం ఓడరేవులు, రహేజా, ఓడ చెరువు, ఎమ్మార్, శంషాబాద్ విమానాశ్రయం, ఆరు పవర్ ప్రాజెక్టులు, కాకినాడ సీపోర్టు, విశాఖ ప్రాజెక్టు, ఎంఐజి భారత్ వంటి పలు ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయని ఆమె శనివారం నాదెండ్ల మనోహర్‌కు రాసిన లేఖలో తెలిపారు. వివిధ కేసుల్లో సిబిఐ ఐఎఎస్ అధికారులను మాత్రమే విచారించడం సరి కాదని, మిగతావారిని కూడా విచారించాలని ఆమె అన్నారు.భూ కేటాయింపుల సభా సంఘానికి సంబంధించి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల శాసనసభ్యురాలు విజయమ్మ ఈరోజు ఒక లేఖ రాశారు. 1994 నుంచి అన్ని భూ కేటాయింపులపై సభా సంఘం విచారణ చేపట్టాలని ఆమె కోరారు. అప్పుడే వాస్తవాలు వెలుగు చూస్తాయని తెలిపారు. సభా సంఘం ఏర్పాటు తనను దిగ్ర్భాంతి కలిగించిందని పేర్కొన్నారు. కాగ్, లోకాయుక్తలే మహానేత డాక్టర్ వైఎస్ ని వేలెత్తి చూపలేదని గుర్తు చేశారు. నిర్ణయం తీసుకున్న 11 నెలలకు ఇప్పుడు కమిటీ ఏర్పాటు చేయడం ఏమిటని ఆమె ప్రశ్నించారు. కమిటీ విధివిధానాలలో ఇప్పటీకి స్పష్టతలేదన్నారు. టిడిపి హయాంలో జరిగిన భూకేటాయింపులపై కూడా విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు. కొందరు ఎమ్మెల్యేల డిమాండ్ కూడా ఇదేనని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం దీనికి సిద్ధంగా లేరని పేర్కొన్నారు.

పుత్తూరులో ధర్నా చేపట్టిన రోజా

చిత్తూరు జిల్లా పుత్తూరులో రోడ్డు నిర్వాసితుల పోరుబాటకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ మద్ధతు పలికింది. నివాస ప్రాంతాలను బలవంతంగా ఖాళీ చేయించిన ప్రభుత్వం, వారికి పరిహారం చెల్లించడంలో జాప్యం చేస్తోందంటూ ఆందోళన చేపట్టింది.  ఈ ఆందోళన కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడారు.రైతులను పట్టించుకోనందుకు గతంలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఇప్పుడు కాంగ్రెసుకు బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రైతులను పట్టించుకోకుంటే టిడిపికి పట్టిన గతే కాంగ్రెసుకు పడుతుందన్నారు. అధికార పార్టీని రైతులు తరిమి తరమి కొడతారని హెచ్చరించారు. దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి తర్వాత రాష్ట్రంలో రైతులను పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చి జగన్ రైతాంగ సమస్యలను పరిష్కరిస్తారని అన్నారు. పక్క రాష్ట్రంలో రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ కూడా ఇస్తున్నారని కానీ రాష్ట్రంలో మాత్రం మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు రోజా బాధితులతో కలిసి శనివారం పుత్తూరు వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో చెన్నై, రేణిగుంట జాతీయ రహదారిలో దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర వాహన రాకపోకలు స్తంభించాయి. బాధితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందని రోజా అన్నారు.

తిరుపతి ఆస్పత్రిలో సీఎం ఆకస్మిక తనిఖీలు

తమ సమస్యల పరిష్కారం కోసం జూనియర్ వైద్యలు అత్యవసర సేవలు నిలిపివేసిన నేపథ్యంలో తిరుపతిలోని ప్రసూతి ఆస్పత్రిలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శనివారం ఉదయం ఆకస్మి తనిఖీలు నిర్వహించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నాయో రోగులను అడిగి తెలుసుకున్నారు.150 పడకలతో ఉన్న ఆస్పత్రిని 350 పడకల ఆస్పత్రిగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఓపీ బ్లాక్ ఏర్పాటు చేస్తామని, అనెస్తీషియా, డాక్టర్ల యూనిట్లు పెంచాతామన్నారు.ఈ ఏడాది డిసెంబర్ వరకు మహిళలకు పావలా వడ్డీ కోసం కొత్త కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి కిరణకుమార్‌రెడ్డి తెలిపారు. ప్రతి మండలాల్లోనూ స్త్రీలకోసం రూ. 25 లక్షతో శ్రీశక్తి భవన్‌ను నిర్మించనున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. దేశంలోనే 54 శాతంపైన ఉన్న 25 సంవత్సరాలోపు యువకులను అనేక ప్రయోజనాలు కల్పిస్తున్నామని తెలిపారు. 2012 డిసెంబర్ నెలాఖరులోనూ లక్షా పదహారు వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ప్రకటించారు. జిల్లాలో ఒక్కరోజు పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి శనివారం శ్రీకాళహిస్తిలోని టూరిజం హోటల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అబద్దాలు చప్పడం మానలేదని, ప్రపంచ బ్యాంకుకు జీతగాడిగా పనిచేసిన చంద్రబాబును ప్రజలు నమ్మరని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. బాబు హయాంలో జిల్లాకు ఒక్క పరిశ్రమా రాలేదని, స్వలాభం కోసం మదర్ డెయిరీని మూయించారని సీఎం ఆరోపించారు. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తానని పేర్కొన్న జగన్, మాతృసంస్థను మోసం చేశారని కిరణ్‌కుమార్‌రెడ్డి దుయ్యబట్టారు. అధికార దాహంతో జగన్ పార్టీని వీడారని ధ్వజమెత్తారు. జగన్ వర్గం ఎమ్మెల్యేల విషయమై స్పీకర్ నాదెండ్ల మనోహర్ త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని అన్నారు. అలాగే కడప జిల్లాకు చెందిన రాయచోటి, రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాలనేతలతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. టీటీడీ ఆధ్వర్యంలో రోగులకు మూడు పూటలా ఉచిత భోజనం అందజేస్తామని సీఎం ప్రకటించారు. సీఎంతో మంత్రులు గల్లా అరుణకుమారి, రఘువీరా, ఎమ్మెల్యే చిరంజీవి, ఎంపీ చింతామోహన్ తదితరులు ఉన్నారు.