తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి వివిధ పథకాలకు ఓ భక్తురాలు రూ. 12 లక్షల
విరాళం సమర్పించారు.ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల విభాగానికి చేరుకుని ఈ విరాళానికి
సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ. పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి,
నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష చొప్పున వినియోగించాలని
అధికారులను కోరారు. శ్రీనివాసమంగాపురంలోని
కల్యాణ వెంకటేశ్వరస్వామివారికి హైదరాబాదుకు చెందిన మహాలక్ష్మి అనే
భక్తురాలు రూ.165 లక్షలు విలువచేసే ఆభరణాలను బుధవారం బహూకరించారు. కల్యాణ
వెంకన్న ఉత్సవమూర్తికి ఉపయోగించేలా రాగి , నికిల్ , బంగారం తాపడంతో
చేయించిన కాళంగి మర్ధనమ్ , వీణ , విల్లు , వేణువు , చర్నాకోలు , గద ,
ఖడ్గం తదితర 10 రకాల వస్తువులను ఆలయ డెప్యూటీ ఈవో గోపాలకృష్ణకు అందజేశారు. ఈ
సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి ఆశీస్సులతో తాము ఈ వస్తువులను
కానుకగా సమర్పించామన్నారు. ఈ సందర్భంగా ఆమె సాయంత్రం దాతల
విభాగానికి చేరుకుని ఈ విరాళానికి సంబంధించిన డీడీలు అందజేశారు. అందులో రూ.
పది లక్షలను బర్డ్ ఆస్పత్రికి, నిత్యాన్నదానానికి, బాలమందిరానికి రూ. లక్ష
చొప్పున వినియోగించాలని అధికారులను కోరారు.
Thursday, 16 February 2012
తొలి దశ చికిత్స విజయవంతం ట్విట్టర్లో సందేశం... యువరాజ్
ప్రాణాంతకమైన ఊపిరితిత్తుల కణితిని తన శరీరం నుంచి తొలగించారని భారత
క్రికెటర్ యువరాజ్ సింగ్ వెల్లడించారు. ఊపిరితిత్తుల క్యాన్సర్తో
బాధపడుతున్న యువరాజ్కు ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్
క్యాన్సర్ రిసెర్చ్ సెంటర్లో కెమోథెరఫీ చికిత్స జరుగుతోంది. తొలి దశ
చికిత్సలోనే కణితిని శరీరం నుంచి వేరు చేసినట్టు డాక్టర్ లారెన్స్ శుభవార్త
తెలిపారని ట్విట్టర్లో వెల్లడించారు. చికిత్సలో రెండవ దశ
ప్రారంభమైందన్నారు. తొలి దశ చికిత్సలోనే కణితిని శరీరం నుండి వేరు చేసినట్లు డాక్టర్ లారెన్స్
తనకు శుభవార్తను తెలిపారని ట్వీట్ చేశాడు. ఇక్కడ నుండి కెమోథెరపీలో రెండవ
చికిత్సను ప్రారంభిస్తారని అన్నాడు. ఇది ఇలా ఉంటే ఊపిరితిత్తుల బీణ కణ
క్యాన్సర్తో బాధపడుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ యువరాజ్
సింగ్ వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని సైక్లింగ్ దిగ్గజం లాన్స్ ఆర్మ్
స్ట్రాంగ్ సందేశం పంపాడు. ప్రస్తుతం యువీ అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్
ఇనిస్టిట్యూట్లో చికిత్స చేయించుకుంటున్న విషయం తెలిసిందే. లాన్స్ ఆర్మ్
స్ట్రాంగ్ పంపిన సందేశాన్ని యువరాజ్ తన ట్విట్టర్ పేజిలో లాన్స్ ఆర్మ్
స్ట్రాంగ్ ఫోటోతో సహా అభిమానులకు తెలిసేలా పెట్టాడు.లాన్స్ ఆర్మ్
స్ట్రాంగ్ యువీకి పంపిన సందేశం ఏమిటంటే 'నీ కోసం మా 'లివ్స్టాంగ్' టీమ్
మొత్తం ఉందనే విషయం నీకు తెలియాలని కోరుకుంటున్నాం. విజ్ఞానం శక్తి
వంతమైనది, ఐకమత్యమే మహాబలం, మన దృక్పధం అన్నింటికన్నా కీలకం అని నేను తరచూ
చెబుతుంటాను.. నమ్ముతాను కూడా' అని సందేశాన్ని పంపాడు. సైక్లింగ్ దిగ్గజం
లాన్స్ ఆర్మ్ స్ట్రాంగ్ గతంలో క్యాన్సర్ బారిన పడి కోలుకున్న విషయం
తెలిసిందే. ఆ తర్వాత క్యాన్సర్ బారిన పడిన వారి కోసం ప్రత్యేకంగా
లివ్స్టాంగ్ ఫౌండేషన్ని స్ధాపించి తగిన సహాయాన్ని అందిస్తున్నాడు. ఇది
ఇలా ఉంటే మరోవైపు లాన్స్ సందేశంపై యువీ కృతజ్ఞతలు తెలిపాడు. లాన్స్ ఆర్మ్
స్ట్రాంగ్ నుండి వచ్చిన సందేశం నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. థ్యాంక్యూ
లాన్స్.. త్వరలోనే మనం కలుసుకోవాలని కోరుకుంటున్నా.. అని యువరాజ్ ట్వీట్
చేశాడు.జగన్ రాజకీయ శత్రువే...కిరణ్ కుమార్ రెడ్డి
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షడు వైయస్ జగన్ తమకు శత్రువేనని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్ఫష్టం చేశారు. టిడిపి ఎంతటి శత్రువో,
జగన్ కూడా అంతటి శత్రువేనని, ఇందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన
అన్నారు. కాంగ్రెసు లెజిస్లేచర్ పార్టీ (సిఎల్పీ) సమావేశంలో ఆయన పార్టీ
శాసనభ్యులకు గురువారం సాయంత్రం మార్గనిర్దేశం చేశారు. వైయస్ జగన్పై ఎందుకు
మెతగ్గా వ్యవహరిస్తున్నారని కొంత మంది శాసనసభ్యులు కిరణ కుమార్ రెడ్డిని,
పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను నిలదీశారు. పార్టీని వదిలి వెళ్లిన
తర్వాత జగన్ను రాజకీయ శత్రువుగానే చూడాలని, ఇందులో ఎవరికీ ఏ విధమైన
సందేహాలు అవసరం లేదని ఆయన అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమకు రాజకీయ
ప్రత్యర్థేనని ఆయన అన్నారు. పార్టీని బలహీనపరిచేందుకు కొంత మంది
ప్రయత్నిస్తున్నారని, దీనిపై మూడు నాలుగు రోజుల్లో చర్యలు తీసుకుంటామని ఆయన
చెప్పారు. తమకు మద్దతు పలికే మీడియా లేదని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వచ్చే
వ్యతిరేక వార్తలను ఖండించడానికి నలుగురు మంత్రులతో ఓ కమిటీ వేస్తామని ఆయన
చెప్పారు. శాసనసభ్యులు విధిగా సభకు హాజరు కావాలని ఆయన సూచించారు.
సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవాలని, మంత్రులను అడిగి విషయాలు తెలుసుకోవాలని
ఆయన సూచించారు.
కడప - బెంగళూరు రైల్వే లైను
ఎంతో కాలంగా రైల్వే ప్రయాణికులు ఎదురు చూస్తున్న కడప - రైల్వే లైన్కు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సారి రైల్వే బడ్జెట్లో 200 కోట్ల రూపాయలు
కేటాయించాలని రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎ. సాయిప్రతాప్ కోరారు. బుధవారం
హైదరాబాద్లో రైల్వే మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో
జరిగిన రైల్వే బడ్జెట్ ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశం
అనంతరం ఫోన్లో ఆయన మాట్లాడారు. కడప - బెంగళూరు రైల్వేలైన్ పనులు వెంటనే
చేపట్టేందుకు రాష్ట్రం 100 కోట్లు, కేంద్రం 100 కోట్లు ఇవ్వాలని కోరినట్లు
తెలిపారు. నందలూరులోని లోకో షెడ్ 200 ఎకరాల భూమి, 150 గృహాలున్నాయని,
ఒకప్పుడు రైల్వేకు నందలూరు కీలక కేంద్రంగా ఉండేదని ఇప్పుడు నిరాధరణకు
గురైందన్నారు. నందలూరు లోకో షెడ్పై ప్రత్యేక దృష్టితో రైల్వే బడ్జెట్లో
ప్రత్యేక నిధులు ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలపారు. ప్రస్తుతం కడప మీదుగా
వారంలో రెండు రోజులు రాకపోకలు సాగించే సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ను
ప్రతి రోజు రాకపోకలు ఉండేలా క్రమబద్ధం చేసి రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని
కోరినట్లు తెలిపారు. అలాగే కడప ఎర్రముక్కపల్లె రైల్వే రోడ్డు ఓవర్ 6
బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే బడ్జెట్లో 15 కోట్లు ఇవ్వాలని కోరారుశ్రీవారి గరుడసేవ ప్రత్యేక ఏర్పాట్లు
శ్రీనివాసమంగా పురంలోని కల్యాణ వెం కన్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా
గురువారం రాత్రి స్వామి వారికి గరుడ వాహన సేవ జరగనున్నది. ఈ నేపథ్యంలో
టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపడుతున్నారు. కల్యాణ వెంక న్న ఆలయ పరిసరాల్లో
బ్యారికేడ్లు ఏర్పా టు చేస్తున్నారు. గరుడ వాహన సేవకు వచ్చే భక్తులకు
అన్నప్రసాదాలు, ఉచిత లడ్డూల పంపిణీకి చర్యలు తీసుకున్నారు.గరుడ వాహనానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేస్తున్నారు. అలాగే శ్రీవారి ఆలయంతో
పాటు పరిసరాల్లో రకరకాల పూలతో తయారు చేసిన దేవదేవుని ప్రతిరూపాలను ఏర్పాటు
చేయించి, ముస్తాబు చేస్తున్నారు. వాహన సేవానంతరం భక్తులు స్వామివారి
మూలమూర్తిని దర్శించుకునేందుకు వీలుగా ప్రత్యేక క్యూలు ఏర్పాటు
చేస్తున్నారు. శ్రీవారి గరుడవాహన సేవను పురస్కరించుకుని గతంలో కంటే ఈ
ఏడాది అయిదు రెట్లు ఎక్కువగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. అధికారుల
లెక్కల ప్రకారం సుమారు 10 వేల మందికి తక్కువ లేకుండా జనం స్వామి వారి
గరుడవాహనంలో పాల్గొం టారని అంచనా వేస్తున్నారు. టీటీడీ జేఈవో
వెంకటరామిరెడ్డి గరుడవాహన ఏర్పాట్లుపై బుధవారం మరోసారి అధికారులతో
సమావేశమయ్యారు.ట్రాఫిక్ మళ్లింపు ఇలా...గరుడ వాహన సేవను
పురస్కరించుకుని సాయంత్రం 7 నుంచి 12గంటల వరకు తిరుపతి-పీలేరు మార్గంలో
నడిచే అన్ని వాహనాలను చంద్రగిరి, ఐతేపల్లి మీదుగా మళ్లించనున్నట్లు
పోలీసులు వెల్లడించారు. పీలేరు నుంచి వచ్చే వాహనాలు
రంగంపేట-ఐతేపల్లి-చంద్రగిరి మీదుగా మళ్లించనున్నారు. తిరుపతి నుంచి వచ్చే
వాహనాలు చంద్రగిరి-మిట్టపాళెం మీదుగా పంపనున్నట్లు తిరుపతి వెస్ట్ డీఎస్పీ
మాల్యాద్రి తెలిపారు. ఈ మేరకు వాహనదారులు సహకరించాలని వారు కోరారు.
రాలయసీమ జిల్లాలో ఎక్సైజ్ శాఖలో సిబ్బంది కొరత
ప్రభుత్వ ఖజానాకు కోట్లాది రూపాయల ఆదాయం తెచ్చిపెట్టే
ఎక్సైజ్ శాఖలో
సిబ్బంది కొరత ఆ శాఖ పరువు తీస్తోంది. నకిలీ మద్యం ఏరులై పారుతున్నా చోద్యం
చూడటం మినహా ఏమీచేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.
దశాబ్దాలుగా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఉన్న కొద్ది మందిపైనే పనిభారం
అధికమైంది. ప్రస్తుతం ఈ శాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లలో దాదాపు అందరూ
ఏఆర్ విభాగం నుంచి డెప్యుటేషన్పై పనిచేస్తున్నవారే. ఎక్సైజ్ శాఖకు చెందిన
కానిస్టేబుళ్లు జిల్లాకు ఐదారుగురికి మించి లేరు. ఏ స్టేషన్లోనూ మహిళా
కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు.అనంతపురం
జిల్లాలో 15 సీఐ పోస్టులు, 20 ఎస్ఐ, 200 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా
ఉన్నాయి. కర్నూలు జిల్లాలో 14 సీఐ, 4 ఎస్ఐ , 87 కానిస్టేబుళ్ల పోస్టులు
ఖాళీగా ఉన్నాయి. కడప జిల్లాలో 3 సీఐ పోస్టులు, 62 కానిస్టేబుళ్ల
పోస్టులు, చిత్తూరు జిల్లాలో 175 కానిస్టేబుళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
11మంది కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించాల్సిన అనంతపురం జిల్లా
కంబదూరుఎక్సైజ్ స్టేషన్లో కేవలం ఒక కానిస్టేబుల్ మాత్రమే ఉండడం పరిస్థితి
తీవ్రతను తెలియజేస్తోంది.
10 ఎక్సైజ్ సర్కిళ్లను, రెండు ప్రధాన చెక్పోస్టులను పర్యవేక్షించాల్సిన
పెనుకొండ ఎక్సైజ్ సూపరింటెండెంట్(ఇఎస్) పోస్టును ఏడాదిగా భర్తీ చేయలేదు.
అక్రమ మద్యం నివారణ కోసం జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఎక్సైజ్
చెక్పోస్టుల్లో రద్దీని బట్టి ఇద్దరు లేదా ముగ్గురు సీఐలు విధులు
నిర్వహించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం రాయలసీమలోని ఏ చెక్పోస్టులో కూడా
సీఐలు విధులు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. అనంతపురం జిల్లాలోని 6
చెక్పోస్టుల్లో 13మంది సీఐలు విధులు నిర్వహించాల్సి ఉండగా ఏ
చెక్పోస్టులోనూ సీఐ లేరు. కర్నూలు జిల్లాలో 6 చెక్పోస్టులు ఉండగా అన్ని
చెక్పోస్టుల్లోనూ 10 మంది సీఐ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ప్రతి
జిల్లాలో ఒక డిప్యూటి కమిషనర్, ఒక అసిస్టెంట్ కమిషనర్, ఇద్దరు చొప్పున
ఎక్సైజ్ సూపరింటెండెంట్లు ఆయా ఎక్సైజ్ స్టేషన్లు, చెక్పోస్టులను
పర్యవేక్షించాల్సి ఉంది. జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లోని సీఐలతోపాటు నకిలీ
మద్యం, అక్రమ సారా నివారణకు ఎక్సైజ్ స్టేషన్ల వద్ద ఒక్కొక్క ఇన్స్పెక్టర్
చొప్పున ఇద్దరు ఎన్ఫోర్స్మెంటు సీఐలు, గుంతకల్లు లాంటి చోట ట్రైన్
చెకింగ్ పార్టీలు, సరిహద్దుల్లో రెండు మూడు బార్డర్ పెట్రోలింగ్ పార్టీలు
ఆకస్మిక తనిఖీలు నిర్వహించాల్సి ఉంటుంది.
Subscribe to:
Posts (Atom)
