Wednesday, 23 November 2011
సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
శ్రీరామ రాజ్యం సినిమాలో బాలకృష్ణకే ఈ క్రెడిట్ మొత్తం:నయనతార
తాను రక్తం అమ్ముకునే రకం కాదని:మెగాస్టార్ చిరంజీవి
తాను రక్తం అమ్ముకునే రకం కాదని కాంగ్రెసు శానససభ్యుడు, మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మెగా రక్త దాన శిబిరాన్ని ఆనయ బుధవారం ప్రారంభించారు. తన బ్లడ్ బ్యాంకుపై గతంలో వచ్చిన ఆరోపణలపై ఆయన ఈ సందర్భంగా తీవ్రంగా స్పందించారు. తన బ్లడ్ బ్యాంకులో అక్రమాలు జరగలేదని ప్రభుత్వం నియమించిన కమిటీ తేల్చేసిందని, తాను రక్తం అమ్ముకోవడం లేదని ఈ రోజు తేలిపోయిందని ఆయన అన్నారు. తన సొంత డబ్బులతో చిరంజీవి రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్లడ్ బ్యాంక్ నిర్వహణకు తాను ఎవరి నుంచి కూడా విరాళాలు వసూలు చేయలేదని అన్నారు. ఇతర బ్లడ్ బ్యాంకుల కన్నా తక్కువ ధరకే తమ బ్లడ్ బ్యాంక్ రక్తాన్ని ఇస్తోందని, అందుకు తనకు గర్వంగా ఉందని ఆయన అన్నారు. తాను బ్ల్డడ్ బ్యాంక్ నిర్వహణకు ఇతరుల నుంచి నయాపైసా తీసుకోలేదని చెప్పారు. తనకు నటన కన్నా బ్లడ్ బ్యాంక్ నిర్వహణ ముఖ్యమని ఆయన అన్నారు
పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని:అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబంతో విడిపోయారు అని రెండు మూడు రోజులుగా మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తలను అల్లు అర్జన్ ఖండించారు. వాటిలో నిజం లేదని...తామంతా పవన్ కళ్యాణ్ తో కలిసే ఉన్నామని, ఆయన ఒంటరి కాదని మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేశారు. పంజా ఆడియో సమయంలో చిరంజీవి ఢిల్లీలో ఉన్నారని, రామ్ చరణ్ చైనాలో ఉన్నారని, తాను షూటింగు నుంచి తిరి వచ్చేసరికి లేటైందని...అందుకే ఆ ఫంక్షన్ కు హారు కాలేక పోయామని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. అన్ని ఫంక్షన్ లకు అందరూ రావడం వీలు కాదని, ఒక ఫంక్షన్ కు రానంత మాత్రాన అలా రాసేస్తారా? అంటూ మీడియా తీరుపై అర్జున్ అసహనం వ్యక్తం చేశారు. మీడియా కథనాలు తనను చాలా బాధించాయని చెప్పకొచ్చారు. ఇటీవల జరిగిన పంజా ఆడియో వేడుకకు మెగా కుటుంబం నుంచి ఎవరూ హాజరు కాక పోవడానికి తోడు, తనకు అన్నయ్య వారసత్వం అవసరం లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో.....మెగా కుటుంబంతో పవన్ విడిపోయారనే ఊహాగానాలకు కారణమైంది. అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ స్పందించక పోవడం గమనార్హం
108 సర్వీసుల్ని నడుపలేం: జీవీకే సంస్థ లేఖ
టీటీడీకి పెద్ద షాక్:రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం
తిరుమలలో ఏర్పడిన నీటి ఇబ్బందులను అధిగమించడానికి టీటీడీ కసరత్తు చేస్తోంది. తిరుపతి కార్పొరేషన్ సహాయంతో రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని కొండకు తరలించే ఆలోచన చేసిన టీటీడీకి అక్కడి నుంచి పెద్ద షాక్ తగిలింది. రూ.20 కోట్లిస్తే నీళ్లిస్తాం అనే షరతు ఎదురు కావడంతో దేవస్థానం అధికారులు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నారు.తిరుమలకు వచ్చే యాత్రికులు, సిబ్బంది, స్థానికుల అవసరాల కోసం రోజుకు 28 నుంచి 30 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. తిరుమలలోని కుమారధార-పసుపుధార, పాపవినాశనం, గోగర్భం జలాశయాలతో పాటు శ్రీవారి మెట్టు సమీపంలోని కల్యాణి డ్యాంలో నీటి నిల్వలు పుష్కలంగా ఉన్న సమయంలో యాత్రికుల అవసరం మేరకు టీటీడీ నీటిని అందిస్తోంది. కొంత కాలంగా వర్షాలు ముఖం చాటేయడంతో తిరుమల, కల్యాణి జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొండ మీద నీటి తిప్పలు తప్పవనే అంచనాతో టీటీడీ అధికారులు నీటి పొదుపునకు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుతం అన్ని మార్గాల్లో రోజుకు 16 నుంచి 17 లక్షల గ్యాలన్ల నీటిని మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా కైలాసగిరి రిజర్వాయర్, తిరుపతి కార్పొరేషన్ నుంచి రోజుకు 10 లక్షల గ్యాలన్ల నీటిని తిరుమలకు తీసుకెళ్లేందుకు టీటీడీ ఆలోచించింది. అలిపిరి మార్గంలో ఉన్న పైప్లైన్ల ద్వారా తమ సంప్లకు నీటిని అందిస్తే రివర్స్ పంపింగ్తో తాము తిరుమలకు తీసుకెళతామని ప్రతిపాదించింది.మంచి తరుణం మించిన దొరకదనుకున్న కార్పొరేషన్ అధికారులు కైలాసగిరి రిజర్వాయర్ నుంచి రోజూ అదనంగా 10 లక్షల గ్యాలన్ల నీటిని పంపింగ్ చేసి అందించడానికి అవరమైన మరమ్మతులు, పైప్లైన్ పనుల కోసం రూ.20 కోట్లు అందచేయాలని టీటీడీకి టెండర్ పెట్టారని తెలిసింది. తాము తిరుమలకు నీరివ్వాలని అడిగితే తిరుపతి నీటి ఎద్దడి మొత్తం తీర్చేందుకు అవసరమయ్యే సొమ్ము కార్పొరేషన్ అధికారులు అడుగుతున్నారంటూ దేవస్థానం ఉన్నతాధికారులు ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను విరమించుకున్నట్టు సమాచారం. అయితే తిరుపతి వాసుల దాహార్తి తీర్చాల్సిన బాధ్యత టీటీడీ మీద కూడా ఉందంటూ కార్పొరేషన్ అధికారులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా ఈ సొమ్ము రాబట్టుకునే యోచనలో ఉన్నారు. సీఎం సమక్షంలో ఇటీవల జరుపతలపెట్టిన తిరుపతి టాస్క్ఫోర్స్ సమావేశంలో ఈ కోరికను వెల్లడించాలని భావించారు. ఈ సమావేశం రద్దు కావడంతో ఇతర మార్గాల్లో ప్రభుత్వానికి తమ విన్నపాన్ని వినిపించాలనే ఆలోచన చేస్తున్నారు. కొండకు నీళ్లడిగితే కార్పొరేషన్కు కోట్ల రూపాయలు ఎదురివ్వాల్సి వస్తుందనే భయంతో టీటీడీ అధికారులు తిరుమలలో నీటి పొదుపునకు శ్రీకారం చుట్టారు
(ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీక్
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. దీంతో బుధవారం నుంచి జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. మంగళవారం ఇంగ్లీషు పరీక్ష రాశారు. ఎస్కేయూ దూరవిద్య కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు పంపిన ప్రశ్నపత్రాల్లో ప్రకాశం జిల్లాలో ఓ కాలేజీ వద్ద బుధవారం జరగాల్సిన తెలుగు పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో కూడా ప్రశ్నపత్రం బయటపడడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, దూరవిద్య కేంద్రం డెరైక్టర్లు అవాక్కయ్యారు. ఎక్కడ పరీక్ష పేపర్ లీక్ అయిందో తెలియకపోవడంతో వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శికి విషయాన్ని వివరించారు. వారి ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఎస్కేయూకి చేరుకుని దూరవిద్య కేంద్రం డెరైక్టర్తో పాటు రిజిస్ట్రార్, ఇతర దూరవిద్య కేంద్రం అధికారులతో రాత్రి 9.30 వరకు సమావేశమయ్యారు. తెలుగు పేపర్ ఒక్కటే లీక్ అయిందా లేక అన్ని పేపర్లూ లీక్ అయ్యాయా అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనల మేరకు బుధవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పీజీ పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లీకైన ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.
మూడు రోజుల్లోనే తత్కాల్ పాస్పోర్ట్
Subscribe to:
Posts (Atom)