Saturday, 21 January 2012

నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె!


 నాగచైతన్య, రాధామోహన్ దర్శకత్వంలో త్వరలో ‘గౌరవం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. వరలక్ష్మి ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయి నటన, అందం విషయంలో మంచి మార్కులే కొట్టేసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు, తమిళం రెండు భాషల్లోనే నాగచైతన్య గౌరవం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు.

పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా...జూ ఎన్టీఆర్

యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ తన తాజా సినిమా ‘దమ్ము’చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అంటే అవును అనే వార్తలు వినిపిస్తున్నాయి. దమ్ము చిత్రం యూనిట్ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని...ఒక పాత్రలో పవర్ ఫుల్ ఫ్యాక్షన్ లీడర్‌గా, మరొక పాత్రలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు అని తెలుస్తోంది. అయితే ఇందులో ఫ్యాక్షనిస్టు పాత్రలో ఫాదర్ గా, పోలీస్ ఆఫీసర్ పాత్రలో కుమారుడిగా దర్శనం ఇవ్వబోతున్నాడని సమాచారం. హీరోయిన్ కార్తీక ఇందులోని ఎన్టీఆర్ ఫాదర్ పాత్రకు జోడీగా నటిస్తుండగా...పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఉండే ఎన్టీఆర్‌తో త్రిష రొమాన్స్ చేయనుందని అంటున్నారు. చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను ఇప్పటికే యాక్షన్ సన్ని వేశాలను ఫర్ ఫెక్ట్ గా తెరకెక్కించారని, ప్రస్తుతం టాకీ పార్టు చిత్రీకరణ జరుగుతోందని తెలిసింది. ప్రస్తుతం దమ్ము చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవు...డిఎల్

తిరుపతి శానససభ్యుడు చిరంజీవితో ఏ విధమైన విభేదాలు లేవని రాష్ట్ర ఆరోగ్య మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి స్పష్టం చేశారు. విలీనం తర్వాత ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెసులో భాగమని ఆయన అన్నారు. సి. రామచంద్రయ్య విషయంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని ఆయన చెప్పారు. రామచంద్రయ్య తనకు మంచి మిత్రుడని ఆయన చెప్పారు. కడప జిల్లా కాంగ్రెసులో కూడా విభేదాలు లేవని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. కాంగ్రెసు పార్టీలో ఆధిపత్య పోరు సాగుతోందనే మాటలో నిజం లేదని ఆయన అన్నారు. ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం సాధించడానికి మాత్రమే కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయత్నిస్తారని ఆయన చెప్పారు. రామచంద్రయ్య విషయంలో శాసనసభ్యుడు వీరశివా రెడ్డి ఢిల్లీలో చెప్పినప్పుడు తాను హైదరాబాదు వస్తున్నానను, కూర్చోబెట్టి మాట్లాడిస్తానని ఆజాద్ చెప్పారని, తనకు ఏ విధమైన అభ్యంతరాలు లేవు కాబట్టి తనను కూర్చోబెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. రామచంద్రయ్యకు అన్ని వర్గాలతో మంచి సంబంధాలున్నాయని, అన్ని వర్గాల గురించి రామచంద్రయ్య ఆలోచిస్తారని ఆయన అన్నారు.

తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో టాప్‌ టెన్‌లో ఇండియన్స్‌ ఇద్దరే



అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసిసి) విడుదల చేసిన తాజా టెస్ట్‌ ర్యాంకింగ్‌లలో బ్యాటింగ్‌ జాబితాలో సచిన్‌ టెండూల్కర్‌ తొమ్మిదవ స్థానంలో కొనసాగుతుండగా బౌల ర్లలో జహీర్‌ ఖాన్‌ ఒక స్థానం పతనమై తొమ్మిదవ స్థానంలో నిలి చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ జాబితాలలో టాప్‌ టెస్‌లో ఉన్న భారతీయులు వారిద్దరే. నంబర్‌ వన్‌ ఇంగ్లండ్‌పై మొదటి టెస్ట్‌ లో పాకిస్తాన్‌కు పది వికెట్లతో విజయాన్ని దక్కించిన తరు వాత ఆఫ్‌ స్పిన్నర్‌ సరుూద్‌ అజ్మల్‌ ప్రపంచంలో అత్యున్నత ర్యాంకులో ఉన్న స్పిన్నర్‌ అయ్యాడు. ఈ టెస్ట్‌ దుబాయిలో మూడు రోజులలో ముగిసింది. 34 ఏళ్ల ఫైసలాబాద్‌ వాసి అజ్మల్‌ 55 పరుగులకు 7 వికెట్లు, 42 పరుగులకు 3 వికెట్ల తో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును గెలుచుకోవడమే కాకుం డా నంబర్‌ 3 ర్యాంకును కూడా సాధించాడు. పాకిస్తాన్‌ తరఫున తన 18వ టెస్ట్‌లో రెండవ సారి పది వికెట్లు తీసుకు న్న సరుూద్‌ అజ్మల్‌ ఏకంగా తొమ్మిది స్థానాలు పురోగమించా డని, అతను ఇంగ్లండ్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌ను మూడు నుంచి నాలుగవ స్థానానికి నెట్టాడని ఐసిసి ఒక ప్రకటనలో తెలియజేసింది. దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టీన్‌ మొదటి స్థానంలో కొనసాగుతుండగా ఇంగ్లండ్‌ పేసర్‌ జేమ్స్‌ ఆండర్స న్‌ రెండవ స్థానంలో ఉన్నాడు. దుబాయిలో ఇంగ్లండ్‌తో మొదటి టెస్ట్‌లో 89 పరుగులకు నాలుగు వికెట్లు తీసుకున్న మరొక పాక్‌ స్పిన్నర్‌ అబ్దుర్‌ రెహ్మాన్‌ ఐదు స్థానాలు పురోగ మించి 14వ స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ల ర్యాం కింగ్‌లలో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లకు శుభవార్త ఏమీ లేదు. ఇంతకు ముందు వరుసగా 3,4 స్థానాలలో ఉన్న అలస్టెయిర్‌ కుక్‌, ఇయాన్‌ బెల్‌ వరుసగా రెండు, మూడు స్థానాలు పతన మయ్యారు. కెవిన్‌ పీటర్సన్‌ టాప్‌ 10లో స్థానం కోల్పోయాడు. అతను ఆరు స్థానాలు పతనమై 16వ స్థానంలో నిలిచాడు. ఇక ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ కూడా ఆరు స్థానాలు పతనమై 34వ స్థానంలో నిలిచాడు. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లలో వికెట్‌కీపర్‌ మాట్‌ ప్రయర్‌, స్వాన్‌ మాత్రమే పురోగమించారు. ప్రయర్‌ ఒక స్థానం ముందుకు జరిగి 18వ స్థానంలోను, స్వాన్‌ 11 స్థానాలు పురోగమించి 64వ స్థానంలోను నిలిచారు. పాక్‌ బ్యాట్స్‌మ న్‌లలో యూనిస్‌ ఖాన్‌ నాలుగవ స్థానానికి, కెప్టెన్‌ మిస్బా ఉల్‌ హక్‌ 14వ స్థానానికి, మహమ్మద్‌ హఫీజ 30వ స్థానానికి పురోగ మించారు. బ్యాట్స్‌మన్‌ల జాబితాలో శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార్‌ సంగక్కార మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జాక్విస్‌ కలిస్‌ రెండవ స్థానంలోను, ఎబి డివిలీర్స్‌ మూడవ స్థానంలోను ఉన్నారు.

ఎల్లప్పుడు మా కుటుంబం కార్యకర్తల కోసం..భూమా

కార్యకర్తల కోసం మా కుటుంబం ఎల్లప్పుడు పాటు పడుతుంటూనే ఉంటుందని భూమా దంపతులు అన్నారు.  పట్టణంలోని భూమా స్వగృహంలో శిరివెళ్ళ మండలం నుండి భారీ సంఖ్యలో ముస్లిం సోదరులు భూమా దంపతులకు మద్దతు తెలిపేందుకు ఆళ్లగడ్డ పట్టణానికి వచ్చి వారిని కలిశారు. ఈ సందర్భంగా భూమా దంపతులు మాట్లాడుతూ ఈ రోజు మామీద అభిమానంతో ఇంత మంది ఎంతో సంతోషంగా ఉందన్నారు. మీరు చూపించే ఆదరాభిమానాలు చాలా గొప్పవని అన్నారు. నా పుట్టిన రోజు సందర్భంగా శిరివెళ్ళలో మీరు చూపించిన ప్రేమ నేను మరచి పోనని భూమా అన్నారు. పార్టీ అభివృద్ధిపై మీరు బాధ్యత తీసుకోవాలన్నారు. పదవి ఉన్న, లేకపోయిన ప్రజలకు అండగా ఉంటామని వారు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి మీద అభిమానంతో వైఎస్సార్ పార్టీకి సంఘీభావంగా ఇక్కడికి రావడం ఆనందంగా ఉందన్నారు. అందుకు మీకు అండగా ఉంటామని ముస్లిం సోదరులకు భూమా దంపతులు హామీనిచ్చారు. ఓట్లు మఖ్యం కాదని ప్రజల ఆదరాభిమానాలు ముఖ్యమని వారి అండే మాకు కొండంత అండని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో శిరివెళ్ళ మండలానికి చెందిన ఖాజాహుస్సేన్, అబ్దులుఖదుర్సు, చాంద్‌భీ, సలాం, నబీరసూల్‌తో పాటు మరో 200 మంది ఉన్నారు. ఈ కార్యక్రమంలో వై ఎస్సార్సీ నాయకులు బివి.రామిరెడ్డి, భూమా వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 విగ్రహాలపై చెయ్యేస్తే రాజకీయ సమాధి
 మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాల మీద చేయి పెడితే రాష్ట్ర ప్రజలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు రాజకీయ సమాధి కడతారని వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమన కరుణాకరరెడ్డి హెచ్చరించారు. ఈ రోజు ఇక్కడ జరిగిన వార్డుబాట కార్యక్రమంలో పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు మామను వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారని ఆరోపించారు. ఎన్‌టీఆర్ చనిపోయి 16 సంవత్సరాలు కావస్తున్నా తన సొంత ఊరు నారావారిపల్లెలో ఆయన విగ్రహం పెట్టించాలనే ఆలోచన కూడా చంద్రబాబుకు రాలేదన్నారు. అన్న తీరు నచ్చక ఆయన తమ్ముడు రామ్మూర్తినాయుడు ఎన్‌టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయించారన్నారు. ప్రజల గుండెల్లో దేవుడిలా కొలువైన వైఎస్ రాజశేఖరరెడ్డిని వారి గుండెల నుంచి చెరిపేసేందుకు చంద్రబాబు నానా రకాల పాట్లు పడుతున్నారని విమర్శించారు.

జెసి బ్రదర్స్ రాజకీయడ్రామా

రాయదుర్గం నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిగా గుణపాటి దీపక్‌రెడ్డిని ఆ పార్టీ అధిష్టానం నియమించడంతో జిల్లా లో జెసి బ్రదర్స్ ఆడుతున్న రాజకీయడ్రామా బహిర్గతమయ్యిందని డిసిసి అధ్యక్షులు పాటిల్ వేణుగోపాలరెడ్డి అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో  ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో పాటిల్ వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ జిల్లా లో గత సంవత్సరం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో తాను ఓడిపోడానికి ము ఖ్యంగా జెసిబ్రదర్స్ కీలకపాత్ర పోషించారని ఆరోపించారు. ఎన్నికలకు మూడురోజుల ముందు టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడుతో జెసి బ్రదర్స్ కుదుర్చుకున్న ఒప్పందం మేరకే జెసి ప్రభాకరరెడ్డి అల్లుడు దీపక్‌రెడ్డిని ఈరోజు నియోజకవర్గం ఇన్‌చార్జిగా నియమిస్తూ ప్రాధాన్యతను ఇచ్చారని వివరించారు. తనను ఓడించాలన్న ధ్యే యంతోనే ఇలాంటి రాజకీయకుట్రను నాటకీయంగా నడిపిన జెసి బ్రదర్స్‌పై ఎన్నికల సమయంలోనే వదంతులు వచ్చాయని ఆ వదంతులు నేడు నిజం అయ్యాయని తెలిపారు. ఈ నియోజకవర్గంలో దీపక్‌రెడ్డితో రాజకీయ అరంగేట్రమ్ చేయించాలన్న కుట్రపూరిత రాజకీయ పన్నాగమే నేడు బహిర్గతమయ్యిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోవుంటూ అనేక పదవులను అనుభవించిన జెసి దివాకరరెడ్డి పార్టీకి ద్రోహంచేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగావున్న తనను ఓడించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి రాజకీయ డ్రామాలు ఆడుతున్న జెసి దివాకరరెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పనిచేయడంపై తాను తీవ్రంగా మనస్థాపం చెందానని ఇలాంటివి భవిష్యత్తులో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థులకు జరుగరాదని అన్నారు. ఈ విషయంలో అప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందని కాని అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సివుందని పాటిల్ వేణుగోపాలరెడ్డి ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

తిరుమలలో రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు


ఈనెల 30న తిరుమలలో నిర్వహించే రథసప్తమి వేడుకలకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తున్నది. ఆ రోజున భక్తులందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యాన్న ప్రసాదం అందజేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. ఇప్పటికే మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూరగాయలు అందించడానికి దాతలు ముందుకొచ్చారు. నిత్యాన్న ప్రసాద సముదాయంతో పాటు తిరుమలలోని యాత్రిక వసతి సముదాయాల్లోనూ భక్తులకు అన్నప్రసాదాలు పంచి పెట్టాలని నిర్ణయించారు. తిరు వీధుల్లో ఉదయం నుంచి రాత్రి వాహన సేవ ముగిసేంత వరకు తాగునీరు, మజ్జిగ తదితరాలను అందించనున్నారు.సూర్యజయంతిగా పిలిచే రథసప్తమి రోజున స్వామివారు ఏడు వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. దీనికోసం ఆ వాహనాలను టీటీడీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సుకు ఆలయానికి అనుసంధానంగా ఉన్న కదిలే వంతెనలో లోపాలు సరి చేయాలని ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.