
నాగచైతన్య, రాధామోహన్ దర్శకత్వంలో త్వరలో ‘గౌరవం’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మి హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయం ఖరారు కావాల్సి ఉంది. వరలక్ష్మి ఇప్పటికే తమిళంలో హీరోయిన్ గా పరిచయం అయి నటన, అందం విషయంలో మంచి మార్కులే కొట్టేసింది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారని ఫిల్మ్ నగర్ టాక్. తెలుగు, తమిళం రెండు భాషల్లోనే నాగచైతన్య గౌరవం చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య దేవా కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆటో నగర్ సూర్య’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాధా మోహన్ దర్శకత్వంలో ‘గౌరవం’ అనే చిత్రంలో నటించనున్నారు. గౌరవం చిత్రంలో నాగార్జన తొలి సారిగా నాగచైతన్యతో కలిసి నటించబోతున్నాడు.






