Sunday, 18 December 2011
మద్యం సిండికేట్పై వదలొద్దు...నేతలతో చంద్రబాబు
వేటు వేయమని కోరే నైతిక హక్కు చిరంజీవికి లేదని ...శోభా నాగి రెడ్డి
తనపై అనర్హత వేటు వేయమని కోరే నైతిక హక్కు తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి
లేదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్
రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి ఆదివారం అన్నారు.
ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తామని ఎప్పుడో ప్రకటించారని
అలాంటప్పుడు తనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరే హక్కు చిరంజీవికి
గానీ, వంగా గీతకు గానీ లేదన్నారు. చిరు మద్దతుతో ప్రభుత్వాన్ని
నిలబెట్టుకోవాల్సి రావడం కాంగ్రెసుకు సిగ్గు చేటు అన్నారు. తనపై వేటు
వేయాలని నిర్ణయం తీసుకుంటే న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానన్నారు.
మహేష్ సినిమాలో పవన్ గెస్ట్ రోల్!
'శ్రీరామరాజ్యం' పుస్తక రూపంలో
తిరుమలలో వివాహ రిజిస్ట్రేషన్ కార్యాలయం
రాష్ట్రంలోనే ప్రప్రథమంగా తిరుమలలో కొత్తగా ఏర్పాటు చేసిన వివాహ
రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖా
మంత్రి తోట నరసింహం ఆదివారం ప్రారంభించారు. ప్రతి ఏటా వేల వివాహాలు
తిరుమలలో జరుగుతున్నాయని, ఈనేపథ్యంలో కార్యాలయం ఏర్పాటు ఆవశ్యకతను
గుర్తించామని, విదేశాల్లో స్థిరపడిన వారికి కూడా వివాహ రిజిస్ట్రేషన్
ఉపయోగపడుతుందన్నారు.
జనవరి 1న తిరుమలలో శ్రీవెంకటేశ్వరుని విఐపి దర్శనాలను రద్దు
ఇంటర్నేషనల్ వెబ్ సైట్స్ సర్వేలో కాజల్ టాప్
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం
ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో జనవరి 1వతేది నుండి ప్రారంభం కానున్న నూతన
బ్యాచ్లో వివిధ రకాల కంప్యూటర్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు
ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కంప్యూటర్
ఫండమెంటల్స్, ఎంఎస్ ఆఫీస్, డిసిఏ, పిజిడిసిఏ, డిటిపి, సి, సిప్లెస్,
ప్లెస్, విబి అండ్ ఓరాకిల్, జావ, జావ2 ఇఇ, హార్డ్వేర్, నెట్వర్కింగ్,
మోబైల్ టెక్నాలజి, మల్టీమీడియా, పిజి డిప్లమా ఇన్ అడ్వాన్మ్ మల్టీమీడియా,
యానిమేషన్, ఆటోకార్డు, టాలీ తదితర కోర్సులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అభ్యర్థులు 10వ తరగతి పాస్ అయిన నిరుద్యోగులు, విద్యార్థులు, గృహిణులు,
ఉద్యోగులు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు.
తిరుపతిని వరల్డ్క్లాస్ రైల్వేస్టేషన్గా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి !
నేడు అనంతపురం లో మెగా జాబ్మేళా
నగర, పట్టణ యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆదివారం
అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో మెగా జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు
నగర పాలక సంస్థ కమిషనర్ నీలకంఠారెడ్డి తెలిపారు. ఈ మేళాకు ఇరవై కంపెనీలు
హాజరవుతున్నాయన్నారు. ఇందులో తొమ్మిది ప్రముఖ కంపెనీలు ఉన్నాయని
వెల్లడించారు. శనివారం ఆయన తన ఛాంబర్లో విలేకరులతో మాట్లాడారు. రాజీవ్
యువకిరణాలు పథకంలో భాగంగా అనంత నగర పాలక సంస్థ, జిల్లాలోని మున్సిపాలిటీలు,
అర్బన్ ఐకేపీ సంయుక్తంగా ఈ జాబ్మేళా నిర్వహిస్తున్నాయన్నారు. తొమ్మిది
ప్రముఖ కంపెనీలు 533 మందికి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. మరో 11
సంస్థలు కూడా పలువురిని నియమించుకుంటాయని తెలిపారు. కేప్ కాఫీ డే సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 115, ఫ్యూచర్ రిటైల్స్ సంస్థ టీమ్
మెంబర్ పోస్టులు 60, బాటా బిర్లా సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు
18, జోయలుక్కాస్ సంస్థ కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 100, పీటీవీపీ
లిమిటెడ్ సంస్థ టోల్ ప్లాజా సపోర్ట్ టీమ్ పోస్టులు 50, పాన్టాలూన్ సంస్థ
కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ పోస్టులు 30, ఆదిత్యా బిర్లా సంస్థ టీమ్ మెంబర్
పోస్టులు 50, అపోలో ఫార్మసీ సంస్థ టీమ్మెంబర్ పోస్టులు 50, షాపర్ స్టాప్
సంస్థ టీమ్ మెంబర్ పోస్టులు 60 భర్తీ చేస్తాయన్నారు. 18 -35 ఏళ్ల లోపు వారు
విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరు
కావాలన్నారు. ఎంపికైన వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ వెంటనే ఇస్తారన్నారు.
Subscribe to:
Posts (Atom)