కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు
పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు
.jpg)

