ప్రజల్లో హెచ్ఐవి, ఎయిడ్స్పై అవగాహన కల్పించేందుకు జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ఆధ్వర్యంలో పాపులేషన్ సర్వీసెస్ ఇంటర్నేషనల్ స్వచ్చంద సంస్థ స్థానిక నాలుగుకాళ్ల మండపం వద్ద బుధవారం వీధినాటకాన్ని ప్రదర్శించారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకే ఇలాంటి వీధి నాటకాలు నిర్వహిస్తున్నట్లు కో- ఆర్డినేటర్ శ్రీనివాసరావు తెలిపారు. ఈసందర్భంగా జిల్లా ఎయిడ్స్ నియంత్రణా సంస్ధ డిపిఎం లలిత మాట్లాడుతూ హెచ్ఐవి, ఎయిడ్స్కు దూరంగా వుండాలంటే ప్రతి ఒక్కరు విధిగా కండోమ్స్ను వాడాలన్నారు. కండోమ్స్లను వాడటం ద్వారా సుఖవ్యాధులు నివారించవచ్చునన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాలోని 14 పట్టణాలలో 19 మేజర్ గ్రామ పంచాయతీలలో నిర్వహించనున్నామన్నారు. వచ్చే ఏడాది జూన్ వరకూ ఈ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు
No comments:
Post a Comment