Tuesday, 29 November 2011
తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు పోటెత్తారు
హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లేనా?
త్వరలో బాలీవుడ్ తెరపై మహేంద్ర సింగ్ ధోని?
జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు
జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. ఉదయం విఆర్ ఓ, మధ్యాహ్నం విఆర్ ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు ఖరీదు 200 రూపాయలు. ఎస్ సి, ఎస్టీలకు వంద రూపాయలు. ఈ పరీక్షల ద్వారా 1172 విఆర్ ఓ పోస్టులు, 6063 విఆర్ఏ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వయోపరిమితి సడలింపుపై రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రి చెప్పారు.
|
పెరిగిన గ్రూప్-1 పోస్టుల సంఖ్య
గ్రూప్-1 పోస్టులను మరో 41 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంటూ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 సంబంధించి 263 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 39 ఎంపీడీవోలు, 2 డిఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 304కు పెరిగింది. గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) సోమవారం నోటిఫికేషన్ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఉద్రిక్తత
జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ అలజడి మొదలైంది. కప్పట్రాళ్లలో వెంకటప్పనాయుడు ఇంటిపై మద్దిలేటి వర్గీయులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కప్పట్రాళ్లలో ఉద్రికత నెలకొంది దేవనకొండ మండలపరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లగ్రామాన్ని కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి అన్న కుమారుడు పరప్ప నాయుడుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినందున వారి స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని డిఎస్పీ సందర్శించి అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వెంకటప్పనాయుడు, పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరు హత్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరూ పొలం పనులకు వెళ్లడం వలన గ్రామ వీధులన్ని నిర్మాణుషంగా మారాయని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. ఐదుమంది ఎపిఎస్పి పోలీసులు, నల్గురు సివిల్ పోలీసులను గ్రామంలో బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ తెలియజేశారు.
చరణ్ తేజ్-ఉపాసన డిసెంబర్ 1న నిశ్చితార్థం
Subscribe to:
Posts (Atom)