Friday, 21 October 2011

కర్నూలు జిల్లా ల్లో సీబీఐ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది

వెల్దుర్తి, బేతంచెర్ల, ఓర్వకల్లు మండలాల్లోని ఆయా ప్రాంతా ల్లో ఇనుప ఖనిజం నిక్షేపాలు విస్తృత్తంగా ఉన్నాయి. మొత్తం 28మందికి ఇనుప ఖనిజం లీజులున్నాయి. గత ఆరేళ్లుగా మార్కెట్లో ఐరన్ఓర్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఇదే అవకాశంగా చేసుకొని లీజుదారులు, అక్ర మ మైనింగ్‌దారులు రూ.కోట్లు గడించారు. అక్రమంగా తవ్వకాలు జరిపిన ఖనిజాన్ని లీజుదారులు తమ యార్డులకు తరలించారు.
                                   
చివరకు ప్రభుత్వ భూములు, దేవాయదాయశాఖ భూ ములను వదిలి పెట్టలేదు. వాటికి తో డు లీజుమైనింగ్ ప్రాంతాల్లో ఖనిజం తవ్వకున్నా.. భారీ ఎత్తున రాయల్టీలు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. అవే రాయల్టీలను ఓఎంసీకి తరలించినట్టు తెలుస్తోంది. భూగర్భ గనుల శాఖ అధికారుల అండదండలతోనే ఈ తంతు నిరాటకంగా సాగిన ట్లు విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో గాలిజనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత.. జిల్లా ఇనుప ఖనిజం తవ్వకాల్లో చోటు చేసుకున్న అవినీతిపై సీబీఐ నిఘా పెట్టినట్లు తెలుస్తోంది

No comments:

Post a Comment