Tuesday, 6 December 2011
అనంతపురంలో డర్టీ సినిమా నిలిపివేత
శ్రీవారి సేవలో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ
కేసులు.. విచారణలతో నిత్యం బిజీగా ఉండే సీబీఐ జాయింట్ డైరెక్టర్
లక్ష్మీనారాయణ మంగళవారం శ్రీవారి దర్శనార్థం కుటుంబ సమేతంగా తిరుమల
వచ్చారు. ఉదయం తిరుమల చేరుకున్న ఆయన కాసేపు విశ్రాంతి పొందారు. అనంతరం
శ్రీవారి పాదాలు, శిలాతోరణం, పాపవినాశనం, జాపాలి, వేణుగోపాలస్వామి ఆలయం
తదితర సందర్శక ప్రాంతాలలో పర్యటించారు. రాత్రి విరామ సమయంలో ఆయన కుటుంబ
సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. తన కుమారుడికి త్వరలో పరీక్షలు
జరగనుండటంతో శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చినట్లు సమాచారం.
త్వరలో చిరంజీవి 150వ సినిమా మురుగదాస్ ద్శకత్వం?
పంజా సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర జైదేవ్
సచిన్ టెండూల్కర్ ఒపస్ అభిమానుల నుండి భారీ స్పందన
శ్రీశైలం మల్లన్న గాలిగోపురానికి బీటలు
పాలకుల పర్యవేక్షణలోపం... అధికారుల నిర్లక్ష్యం వెరసి శ్రీశైలం మల్లన
గాలిగోపురం పాలిటశాపంలా తయారైంది. పురాతన కాలంనాటి ఆయలగోపురశిఖరాలపై అధికార
యంత్రాంగం నిర్లక్ష్యపు దోరణితో వ్యవహరిస్తోందనే విమర్శలు
వెల్లువెత్తున్నాయి. శ్రీశైలం మల్లన్న గాలిగోపురం పిచ్చిమొక్కలతో
కళావిహీనంగా తయారైంది.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
గాలి గోపురాన్ని పునరుద్ధరించే విషయంలో పాలకమండలి, అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శులు వెల్లువెత్తున్నాయి. నిత్యం రద్ధీగా ఉండే శ్రీశైల క్షేత్రంలో గాలిగోపురాలు సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. గోపురాలపై ఉన్న శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారు శ్రద్ధ చూపడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఉత్తర ద్వారంగాఉన్న శివాజీ గోపురం శిధిలావస్థకు చేరుకుందని రెండేళ్లక్రితం నిపుణుల కమిటీ నిర్థారించింది. గోపురాన్ని పునరుద్ధరించాలనే సూచనను పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తోంది. గోపురం బీటలు వారుతున్న పట్టించుకునే నాథుడే కరవయ్యాడని భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు. గోపురాలపై శిల్పాలు విరిగిపోవడంతోపాటు పిచ్చిమొక్కలతో కళావిహీనంగా ఉన్నాయి. పురాతన కాలంనాటి శిల్ప సంపదను కాపాడే విషయంలో అధికారులు చొరవతీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
నిమ్స్ సెగలు కడప రిమ్స్ను కూడా తాకాయి
హైదరాబాద్ నిమ్స్ సెగలు కడప రిమ్స్ను కూడా తాకాయి. నిమ్స్లో ఖైదీలకు
వైద్యంపై జరిగిన కుంభకోణం లాంటిదే కడప రిమ్స్లోనూ చోటుచేసుకుంది. దీంతో
విచారణ జరిపిన సర్కార్, రిమ్స్ ఆర్ఎంఓ, సూపర్నెంట్లను సస్పెండ్ చేసింది. ఈ
వ్యవహారం కడపలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విచారణలో ఉన్న ఖైదీలకు
ఎలాంటి అనారోగ్యం లేకున్నా వైద్యం కోసం కడప రిమ్స్లో చేర్చుకున్నారు. అలాగే వారిని హైదరాబాద్ నిమ్స్కు రెఫర్ చేశారు. చాపాడు మండలం
శెట్టిపల్లికి చెందిన జయరాం రెడ్డితో పాటు, మరో ఇద్దరు ఓ మర్డర్ కేసులో
నిందితులు. విచారణ ఖైదీలుగా ఉన్న వీరిని కడప రిమ్స్లో చేర్చుకోవడమే
గాకుండా మరింత వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు రిఫర్ చేశారు. ఈ ఘటనలో
నిమ్స్ వైద్యులు సస్పెండ్ కాగా, కడపలో కూడా విచారణ ఎదుర్కొంటున్న ఆర్ఎంఓ,
సూపర్నెంట్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనిల్ కుమార్ ఉత్తర్వులు జారీ
చేశారు. రిమ్స్ వైద్యుల సస్పెన్షన్తో డాక్టర్ల చిత్తశుద్ధిపై అనుమానాలు వ్యక్తం
అవుతున్నాయి. అవసరం ఉన్నా లేకున్నా ప్రలోభాలకు లోబడి చికిత్సలకు రిఫర్
చేయడంపై ప్రజలు మండిపడుతున్నారు.
శ్రీవారికి బంగారు కత్తిని బహుకరణ
తిరుమల శ్రీవేంకటేశ్వరునికి రెండు వేల సంవత్సరాల తర్వాత ఓ బంగారు కత్తిని
బహుకరించారు. పీఠాధిపతి త్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ శ్రీవారికి
యజ్ఞాయాగాదులు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన కానుకలతో
స్వామివారికి సూర్య ఖఠారిని బహుకరించారు. తిరుమల శ్రీవారికి బీమవరం
మఠాధిపతి శ్రీత్రిదండి రామానుజ రామచంద్ర జీయర్ స్వామి 75 లక్షలు విలువ చేసే
బంగారు కత్తిని బహుకరించారు. గత సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష్మీ కటాక్షయజ్ఞం నిర్వహించగా
వచ్చిన కానుకలతో శ్రీవేంకటేశ్వరునికి బంగారు కత్తిని తయారు చేయించి
ఇచ్చారు. నిన్న రాత్రి ఆలయంలో తోమలసేవ కార్యక్రమంలో స్వామి వారి పాదాల
ముందు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి బహుకరించిన కత్తికి
ప్రత్యేక పూజలు చేసారు. అటు తర్వాత భక్తులు, టీటీడీ చైర్మెన్ బాపిరాజు,
పూజారులు పూజలందుకున్నారు. స్వామి వారికి బహుకరించిన కత్తిని చూసేందుకు
భక్తులు పోటీ పడ్డారు. వచ్చే శుక్రవారం జరిగే అభిషేకం అనంతరం శ్రీవారికి అలంకరించాలని టీటీడీ
అధికారులను పీఠాధిపతి కోరారు. ఆయన వినతిని టీటీడీ అధికారులు అంగీకరించారు.
వాయిస్. రెండు వేల సంవత్సరాల క్రితం తిరుమల వెంకన్నకు మొదటి సారిగా అప్పటి
రాజులు బహుకరించారు. తిరిగి స్వామి వారికి సూర్య కఠారిని బహుకరించడంతో
ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై చర్యలు...చిరంజీవి
అంతా మా ఇష్టం..!
అధికారం ఉండగానే అందినంత దండుకోవాలన్నది వారి లక్ష్యం..! అంది వచ్చిన
అవకాశాలను అందిపుచ్చుకుంటూ అక్రమార్జనలో చెలరేగుతున్నారు.. వారి దెబ్బకు
అధికారులు హడలెత్తిపోతున్నారు. ఒత్తిళ్లకు తాళలేక.. మాటలు పడలేక మనస్థాపం
చెందిన అధికారులు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోతున్నారు. తాజాగా రోడ్లు,
భవనాల శాఖ ఎస్ఈ పి.వెంకటరమణారెడ్డి మూడు నెలల దీర్ఘకాలిక సెలవుపై
వెళ్లారు. ఇదే శాఖకు చెందిన మరో ఇద్దరు డీఈలు కూడా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడానికి సమాయత్తమవుతున్నారు.
‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో ఆదర్శరైతులకు ఉచితంగా సిమ్కార్డులు
ప్రముఖ ఎరువుల కంపెనీ ‘ఇఫ్కో’ ఆధ్వర్యంలో జిల్లాలోని ఆదర్శరైతులకు ఉచితంగా
సిమ్కార్డులు అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మధ్యాహ్నం స్థానిక
వ్యవసాయ శాఖ కార్యాలయంలో జేడీఏ కె.సాంబశివరావు కొంతమంది ఆదర్శరైతులకు
గ్రీన్కార్డు పేరిట ఎయిర్టెల్ సిమ్కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇవ్వడానికి గ్రీన్కార్డు
ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకుని రైతులకు మెరుగైన
సేవలు అందించాలన్నారు. ఇఫ్కో జిల్లా ప్రతినిధి చంద్రశేఖరరెడ్డి
మాట్లాడుతూ మొదటివిడత మండలానికి ఐదుగురు ఆదర్శరైతుల చొప్పున 273 మందికి
గ్రీన్కార్డులు అందజేస్తున్నామన్నారు. దశల వారీగా అందరికీ పంపిణీ
చేస్తామన్నారు. వ్యవసాయం, 16 అనుబంధ రంగాలకు సంబంధించి రోజూ ఐదు వాయిస్
మెసేజ్లు ఉచితంగా అందజేస్తామన్నారు. మరింత సమాచారం కోసం 534351 అనే
హెల్ప్లైన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ రవి, ఇఫ్కో
ప్రతినిధులు సతీష్కుమార్, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
అనర్హత వేటు వేయండి...ఉప ఎన్నికలకు సిద్ధం ...వైఎస్ జగన్
జగన్ బలం ఎంతో తేలిపోయింది... మంత్రి శైలజానాథ్
అవిశ్వాసంలో ఓడిపోయామన్న బాధలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇష్టం
వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారని మంత్రి శైలజానాథ్ వ్యాఖ్యానించారు.
మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కిరణ్కుమార్తో భేటీ అనంతరం ఆయన మీడియాతో
మాట్లాడుతూ జగన్ బలం ఎంతో నిన్నటి అవిశ్వాసంలో తేలిపోయిందన్నారు.
ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి
శైలజానాథ్ తెలిపారు.
Subscribe to:
Posts (Atom)