Friday, 10 February 2012

పేద విద్యార్థుల ఉజ్వల భవితకే ఉపకార వేతనాలు

పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యను అందించి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకే ఉపకార వేతనాలు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవిన్యూశాఖ, జిల్లా ఇన్‌చార్జి మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. సాయంత్రం చిత్తూరు కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వివిధ జూనియర్, డిగ్రీ, ఎంబిఎ, యూనివర్శిటీ ప్రిన్స్‌పాల్స్, కరస్పాండెంట్‌లతో మంత్రి అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకునేందుకు, ఆర్థికంగా చేయూతను అందించేందుకే పీజు రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తున్నదని తెలిపారు. దేశ భవిష్యత్తుకు అవసరమైన యువతకు విద్యను అందించి దేశానికి ఉపయోగపడే విధంగా వారిని ప్రయోజకులుగా చేసే మంచి ఆశయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్స్ సమన్వయంతో కలసి పనిచేయాలని కోరారు. స్కాలర్‌షిప్‌లను, రీయింబర్స్‌మెంట్‌ను శాశ్వతంగా కొనసాగించేందుకు కళాశాల ప్రిన్స్‌పాల్ వారి సలహాలను, సూచనలను అందించాలన్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి యాజమాన్యాలు ఎటువంటి అవకతవలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, సాంఘిక సంక్షేమశాఖ రేమాండ్ పీటర్ మాట్లాడుతూ విద్యార్థుల దరఖాస్తు లు వెంటనే పరిశీలించి ఆన్‌లైన్‌లో ఉంచాలన్నారు. ఈసంవత్సరం 1,259కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, విచారణ ప్రక్రియ కళాశాల యాజమాన్యాల వారు మరింత వేగవంతం చేయాలన్నారు. కళాశాల యాజమాన్యాల వారు కళాశాలకు ఏప్రాంతంలో అనుమతి తీసుకుని వుంటే ఆప్రాంతంలోనే కళాశాలను నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో వుంచుకొని అమలుచేస్తున్న కార్యక్రమానికి కళాశాలల ప్రిన్స్‌పాల్స్ సహకారం అందించాలన్నారు.

జర్నలిస్టు పాత్రలో...పవన్ కళ్యాణ్

గతంలో బంగారం సినిమాలోనూ పవన్ కళ్యాణ్ మీడియా జర్నలిస్టు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాన్ సరసన కాజల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. మేలో షూటింగ్ ప్రారంభం అయి, దసరా నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.పవన్ కళ్యాణ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజుల క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన చేశాడు దర్శకుడు. తాజాగా శుక్రవారం తన ట్విట్టర్ ద్వారా ఈ సినిమా టైటిల్ ప్రకటించారు పూరి జగన్నాథ్. ఈ చిత్రానికి ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ అనే టైటిల్ ఖారారు చేసినట్లు వెల్లడించారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా కనిపించబోతున్నాడు. మే నెలలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.


గుండుతో ఉన్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్

అమెరికాలోని బోస్టన్ క్యాన్సర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌లో కీమో థెరపీ చికిత్స పోందుతున్న టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ యువరాజ్ సింగ్ తన తాజా చిత్రాన్ని మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. సాధారణంగా కీమో థెరపీ చికిత్స పొందే ఎవరికైనా జుట్టు రాలిపోవడం సహాజం. యువరాజ్ గుండుతో ఉన్న చిత్రాన్ని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేసి.. దాని క్రింద 'మొత్తానికి జుట్టు రాలిపోయింది.... కానీ యువీ స్ట్రాంగ్' గా ఉన్నాడంటూ కామెంట్ రాశాడు. ట్రీట్‌మెంట్ మొదట్లో, నేను కోపంతో పాటు కొంత గందరగోళ పరిస్దితిలో ఉన్నాను. నేను నా జీవితంలో విభిన్నంగా కొన్ని పనులు చేసి ఉన్నానని ఆలోచిస్తూ ఉండిపోయాను. నేను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్లు తెలియగానే.. ఆ షాక్ నుండి తేరుకోవడానికి నాకు కౌన్సిలర్ చేసిన సహాయం మరువలేదని అన్నారు. ప్రస్తుతం నేను ఓ ఫైటర్‌ని. గతంలో మాదిరి కాకుండా నేను ఇంకా బలవంతుడి మాదిరి తిరిగి వస్తానని యువరాజ్ తెలిపాడు.అంతక ముందు యువరాజ్ తన బీజ కణ క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స చేసుకుంటున్న యువరాజ్ మొదటి సారి ఓ ప్రముఖ ఛానల్‌తో ఫోన్‌లో ఛాట్ చేస్తూ "నాకే ఎందుకు ఇంత ఇబ్బంది కోలవేరి డి?" అని అన్నారు. అమెరికాలో ఉన్న బోస్టన్ క్యాన్సర్ హాస్పిటల్‌లో డాక్టర్లు నా ఆరోగ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారని అన్నాడు. డాక్టర్లు ఇచ్చే మెడిషన్‌కు బాగానే రెస్పాండ్ అవుతున్నానని అంటున్నారు. దేవుడి దయవల్ల నేను తొందరలోనే మీ ముందుకి వస్తానని తెలిపాడు.


బాలకృష్ణ హీరోగా ‘శ్రీమన్నారాయణ’

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రవి చావలి దర్శకత్వంలో ఓ సినిమాకు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ సినిమాకు ‘శ్రీమన్నారాయణ’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని రమేష్ పుప్పాల నిర్మిస్తున్నారు. ఇప్పటికే పార్వతి మెల్టన్, ఇషా చావ్లాలను మీరోయిన్లుగా ఎంపిక చేశారు. మాస్ మసాలా ఎలిమెంట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో బాలయ్య ‘సింహా’ సినిమాలో మాదిరిగా లెక్చరర్ పాత్ర పోషిస్తున్నారని, అభిమానులు మెచ్చే పూర్తి వినోదాత్మక యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు హీరోయిన్లుతో గ్లామర్ డోస్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుందట. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నన్ను ఓ తండ్రిలా ప్రోత్సహించారు అంటున్నారు దర్శకులు పరుచూరి మురళి. ఆయన తాజా చిత్రం 'అధినాయకుడు'టైటిల్ ప్రకటన సందర్భంగా ఆయన ఇలా స్పందించారు. అలాగే ..కథ వినగానే బాలకృష్ణ ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారు.ఈ సినిమాలోని మూడు క్యారెక్టర్స్‌ని ఎంతో కష్టపడి డీల్ చేశాం. బాలయ్య చాలా అద్భుతంగా నటించారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా నిర్మాణానికి సహాయం అందించారు అన్నారు. బాలకృష్ణ, లక్ష్మీరాయ్ జంటగా శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్.పద్మకుమార్ చౌదరి నిర్మిస్తున్న 'అధినాయకుడు' చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంతో జరుగుతోంది.

యువతరం రాజకీయాల్లోకి రావాలి...చంద్రబాబు

యువతరం రాజకీయాల్లోకి రావాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. యువ తరంగం సదస్సులో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ రాష్ట్రంలో మాఫియా పాలన రాజ్యమేలుతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రి అవినీతికి పాల్పడ్డారని, ఆమంత్రిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.తిరుపతి లోని పార్టీలో గ్రూపులున్నా.. సదస్సును విజయవంతం చేసేదిశగా యువతను సమీకరించడంలో తలమునకలయ్యా రు. టీడీపీ అధినేత చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తామ న్న ప్రకటనతో విశ్వవిద్యాలయాల విద్యార్థుల్లోనూ కదలిక వచ్చిందని పార్టీ శ్రేణులు సంబర పడుతున్నాయి. ఈ సదస్సు తో అటు పార్టీకి,ఇటు యువతలో రాజకీయ చైతన్యానికి నాంది పలకటం ఖాయమని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.