పంజా’ ట్రైలర్స్ చూసినప్పుడు.. ఆ కథ గురించి చూచాయిగా తెలుసుకున్నపుడు… ఇదేంటి.. బాలు సినిమా లాగే అనిపిస్తోంది.. కొంపదీసి ఆ సినిమానే కొంచెం మార్చి మళ్లీ తీయలేదు కదా అన్న అనుమానం.. కానీ విష్ణువర్ధన్ గురించి తెలిసి, అతనలా చేయడులే.. తనదంటూ ఓ ముద్ర వేస్తాడులే అన్న ధీమా! కానీ సినిమా చూశాక అనుమానం నిజమైంది.. భయపడిందే జరిగింది.. బాలును జైగా మార్చి.. విష్ణు పవర్ లేని “పంజా” విసిరాడు. సింపుల్ గా చెప్పాలంటే పంజా.. బాలు సినిమాకి మోడర్న్ వెర్షన్. బాలు సినిమాని ఇంకాస్త స్టైలిష్ గా, ఇంకాస్త మోడర్న్ గా, ఇంకాస్త రిచ్ గా తీస్తే పంజా అయింది. అంతే.. మరే ప్రత్యేకతా లేదీ సినిమాలో!
ముందుగా కథ గురించి చెప్పకుందాం..
కోల్ కత నేపథ్యంగా సాగే మాఫియా కథ ఇది. బాలులో లాగే ఇందులోనూ హీరో ఓ మాఫియా డాన్ కు కుడిభుజం. అతని పేరు జై (పవన్ కళ్యాణ్). డాన్ పేరు భగవాన్ (జాకీష్రాఫ్). తన చిన్నతనంలో భగవాన్ చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా అతనికి అన్ని పనులూ చేసిపెడుతుంటాడు. ఐతే భగవాన్ కొడుకు మున్నా (అడివి శేష్) విదేశాల నుంచి రావడంతో ఓ సమస్య తలెత్తుతుంది. మున్నా ఓ శాడిస్టు. అతనికి జాహ్నవి (అంజలి లావనియా) అంటే పిచ్చి. కానీ జాహ్నవికి జై అంటే ఇష్టం. ఇదిలా ఉండగా భగవాన్ దగ్గర పనిచేసే సభా (పరుచూరి వెంకటేశ్వరరావు)ను మున్నా అవమానించడంతో అతను ప్రత్యర్థి గ్యాంగ్ లోకి వెళ్లిపోతాడు. సభాను తీసుకొచ్చేందుకు వెళ్లూ జై.. ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన కుర్రాడిని తీసుకొచ్చి తన గ్యాంగ్ లో వదిలేసి వెళ్తాడు. అతణ్ని మున్నా ఆవేశంలో చంపేస్తాడు. అంతటితో ఊరుకోకుండా జాహ్నవి.. జైని ప్రేమిస్తోందని తెలిసి, ఆమెనూ చంపేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన జై.. మున్నా ప్రాణాలు తీస్తాడు. కొడుకంటే ప్రాణమైన భగవాన్.. జైపై పగ పెంచుకుంటాడు. అప్పటికే సంధ్య (సారాజేన్ డయాస్)ను ప్రేమించిన జై.. ఆమె కోసం కోల్ కత వదిలి వచ్చేస్తాడు. ఆ తర్వాత జై కోసం భగవాన్ వేట ఎలా సాగింది. చివరికి జై ఏం చేశాడు.. అన్నది మిగిలిన కథ.
ముందుగా కథ గురించి చెప్పకుందాం..
కోల్ కత నేపథ్యంగా సాగే మాఫియా కథ ఇది. బాలులో లాగే ఇందులోనూ హీరో ఓ మాఫియా డాన్ కు కుడిభుజం. అతని పేరు జై (పవన్ కళ్యాణ్). డాన్ పేరు భగవాన్ (జాకీష్రాఫ్). తన చిన్నతనంలో భగవాన్ చేసిన సహాయాన్ని కృతజ్ఞతగా అతనికి అన్ని పనులూ చేసిపెడుతుంటాడు. ఐతే భగవాన్ కొడుకు మున్నా (అడివి శేష్) విదేశాల నుంచి రావడంతో ఓ సమస్య తలెత్తుతుంది. మున్నా ఓ శాడిస్టు. అతనికి జాహ్నవి (అంజలి లావనియా) అంటే పిచ్చి. కానీ జాహ్నవికి జై అంటే ఇష్టం. ఇదిలా ఉండగా భగవాన్ దగ్గర పనిచేసే సభా (పరుచూరి వెంకటేశ్వరరావు)ను మున్నా అవమానించడంతో అతను ప్రత్యర్థి గ్యాంగ్ లోకి వెళ్లిపోతాడు. సభాను తీసుకొచ్చేందుకు వెళ్లూ జై.. ప్రత్యర్థి గ్యాంగ్ కు చెందిన కుర్రాడిని తీసుకొచ్చి తన గ్యాంగ్ లో వదిలేసి వెళ్తాడు. అతణ్ని మున్నా ఆవేశంలో చంపేస్తాడు. అంతటితో ఊరుకోకుండా జాహ్నవి.. జైని ప్రేమిస్తోందని తెలిసి, ఆమెనూ చంపేస్తాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన జై.. మున్నా ప్రాణాలు తీస్తాడు. కొడుకంటే ప్రాణమైన భగవాన్.. జైపై పగ పెంచుకుంటాడు. అప్పటికే సంధ్య (సారాజేన్ డయాస్)ను ప్రేమించిన జై.. ఆమె కోసం కోల్ కత వదిలి వచ్చేస్తాడు. ఆ తర్వాత జై కోసం భగవాన్ వేట ఎలా సాగింది. చివరికి జై ఏం చేశాడు.. అన్నది మిగిలిన కథ.
కథ చెప్పగానే అర్థమై ఉంటుంది… ఇది బాలుకు భిన్నంగా ఏం లేదని.. ఐతే అక్కడ హీరోయిన్ కోసం హీరో.. తన యజమానికి ఎదురుతిరిగితే.. ఇక్కడే తనంతట తానే సమస్యలో చిక్కుకుంటాడు. పోనీ సన్నివేశాలైనా భిన్నంగా ఉన్నాయా అంటే అదీ లేదు.. హీరో ఇంట్రడక్షన్ సీన్ నుంచి అతని లవ్ స్టోరీ.. తర్వాత అతను సమస్యలో చిక్కుకునే సన్నివేశాలు.. చివరికి క్లయిమాక్స్ కూడా ఇదివరకు చాలా సినిమాల్లో చూసినవే. ఫస్టాఫ్ రొటీనే అయినా కొన్ని వేగంగా సాగడం, టేకింగ్ స్టయిలిష్ గా ఉండటం.. కథ కొన్ని మలుపులు తీసుకోవడం.. పర్వాలేదనిపిస్తుంది. కానీ ద్వితీయార్ధంలో కథను క్లయిమాక్స్ కు చేర్చడానికి దర్శకుడు అనవసర, బోరింగ్ సన్నివేశాలతో నింపేయడంతో సినిమా మీద ఇంప్రెషన్ క్రమంగా తగ్గిపోతూ వస్తుంది. సెకండాఫ్ లో ఏదైనా రిలీఫ్ ఇచ్చింది అంటే అది బ్రహ్మానందం-పాపారాయుడు పాటే. ఈ పాట అనుకున్న దానికంటే ఎంటర్టయినింగ్ గా సాగింది. ఈ పాటలో హావభావాలతో బాగా నవ్వించిన బ్రహ్మానందం మిగతా సన్నివేశాల్లో మాత్రం విఫలమయ్యాడు. అందుకు బాధ్యత దర్శకుడు, మాటల రచయితలదే. సినిమాకు థీమ్ గా వాడుకున్న ”సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపకపోవడం ఎంత తప్పో.. సాయం చేసిన వాడు కృతజ్ఞత ఆశించడం కూడా అంతే తప్పు” డైలాగ్ సూపర్బ్. కానీ నిజానికీ డైలాగ్ సినిమాకు ఎందుకు అవసరమైందో అర్థం కాలేదు. టైటిల్స్ కు ముందే పడే ఈ డైలాగ్ సినిమా ఉద్దేశాన్నేం చాటదు. మంచి డైలాగ్ రాస్తే సరిపోదు. అది సినిమాకు ఉపయోగమా కాదా అని కూడా చూడాలి. అబ్బూరి రవి మాటలు కొన్ని చోట్ల మాత్రమే పేలాయి.అంజలి తన శక్తిమేరకు ఎక్స్ పోజింగ్ చేసింది.
కథ,
కథనాల్లో ఏ కొత్తదనం చూపలేకపోయిన విష్ణు.. ఓ విషయంలో మాత్రం అవసరం లేని
క్రియేటివిటీ చూపాడు. సినిమాలో అత్యంత ఆకర్షణీయమైన పంజా టైటిల్ సాంగ్ ను
సినిమా ముగిశాక, జనాలు థియేటర్లు ఖాళీ చేశాక వచ్చేలా డిఫరెంట్ గా ప్లాన్
చేశాడు. మరో మంచి పాట “అనుకోనే లేదుగా” పల్లవికి పరిమితం చేసేయాలన్న ఆలోచన
అతనికెలా వచ్చిందో.. అంజలి లావనియా అందాలు ఆరబోసిన వెయ్ రా చెయ్ వెయ్ రా
పాటను కూడా పూర్తిగా ఆస్వాదించకుండా మధ్యలోనే బ్రేక్ చేశాడు. దీనివల్ల
యువన్ మంచి మ్యూజిక్ ను సినిమాకు ఉపయోగపడకుండా చేశాడు. ఐతే బ్యాగ్రౌండ్
స్కోర్ తో సినిమాకు పెద్ద ప్లస్ అయింది. పి.ఎస్.వినోద్ ఫొటోగ్రఫీ సినిమా
స్థాయికి మించి ఉంది. అతను ఎంచుకున్న థీమ్స్, లైటింగ్ సూపర్బ్. ఇందులో
విష్ణు అభిరుచి కూడా తోడైంది. ఇవే కాదు.. టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ అన్నీ
మంచి ఔట్ పుట్ ఇచ్చాయి. యాక్షన్ సీక్వెన్స్ అన్నీ హై స్టాండర్డ్స్ లో
ఉన్నాయి. లొకేషన్స్ కూడా డిఫరెంట్ గా ఎంచుకున్నారు. ఐతే కొసరంతా బాగానే
ఉంది. అసలే లేదు. సన్నివేశాల్లో బలం లేక ఈ అదనపు ఆకర్షణల్నీ చాలావరకు
ఉపయోగం లేకుండా పోయాయి
ఐతే స్టయిలిష్ డైరెక్టర్ అన్న ముద్రతో వచ్చిన విష్ణు.. కేవలం సన్నివేశాల్ని స్టయిలిష్ గా తీయడంపై మాత్రమే దృష్టిపెట్టాడు. కథ, కథనాల గురించి మరిచిపోయి కేవలం టేకింగ్ ను, టెక్నికల్ విషయాల్ని మాత్రమే పట్టించుకుంటే ఎలా మంచి సినిమా వస్తుందని విష్ణు అనుకున్నాడో. పవన్ సినిమాలన్నీ చూశానని చెప్పిన విష్ణు.. బాలు సినిమాను మాత్రం చాలా ఎక్కువసార్లు చూసినట్లున్నాడు. దీన్ని తన స్టైల్లో తీసి హిట్ చేద్దామనుకున్నాడో ఏమో.. “పవన్ నా పనిలో జోక్యం చేసుకోలేదు.. ఐతే ఏది ఎందుకు అని మాత్రం అడిగాడు” అని చెప్పాడు విష్ణు. ఐతే.. ఇదేంటి నాతో మళ్లీ బాలు క్యారెక్టర్ వేయిస్తున్నావు నాతో అని.. పవన్ విష్ణును అడగలేదా?
సినిమా మొత్తం తుపాకులతో ఒకరినొకరు కాల్చుకోవడం.. బ్లాస్ట్ లు ఇవే సన్నివేశాలు.. పదుల సంఖ్యలో తుపాకులతో తనను కాలుస్తున్నా సింపుల్ గా తప్పించుకునే హీరో గురి కూడా చూడకుండా లెక్కలేనంతమందిని కాల్చి పారేస్తుంటాడు. చెప్పుకోవడానికి, గుర్తు పెట్టుకోవడానికి ఒక్కటంటే ఒక్క క్యారెక్టరూ లేదు. పవన్ కళ్యాణ్ గెటప్, మారింది కానీ ఇప్పటికే చూసిన క్యారెక్టరే కదా. ఐతే తన వరకు అభిమానుల్ని అలరించడానికి పవన్ శాయశక్తులా ప్రయత్నించాడు. సీరియస్ క్యారెక్టర్ తోనూ ఎంటర్టయిన్ చేసేందుకు కృషి చేశాడు. ఇక ఏ మాత్రం ప్రత్యేకత లేని ఆ విలన్ పాత్రలకి జాకీష్రాఫ్, అతుల్ కులకర్ణిలే కావాలా? చాలా పరిమితులున్న పాత్రల్లో వాళ్లు చేసిందేమీ కూడా లేదు. అడివి శేష్ వేసిన శాడిస్ట్ క్యారెక్టర్ కాస్త ఆసక్తి కలిగించిన అతనేం చేయబోతున్నాడని ముందే అర్థమైపోతుంది. శాడిస్టు క్యారెక్టర్ని నెమ్మదిగా బిల్డప్ చేసి, ఇంటెన్సిటీ పెంచుతూ తర్వాత శాడిజం చూపిస్తే ప్రేక్షకులు థ్రిల్లవుతారు కానీ.. తొలి సన్నివేశం నుంచే అతనో పరమ శాడిస్టన్న విషయాన్ని చూపించేస్తే ప్రేక్షకులకు ఏం ఆసక్తి ఉంటుంది? జై సభాను తీసుకురావడానికి వెళ్లేటపుడు తర్వాత ఏం జరగబోతోందన్నది అర్థమైపోతుంది. తనికెళ్ల భరణిని సరిగా వాడుకోలేదు. బాలు, భగవాన్ ల మధ్య శతృత్వం పెంచేది అతనేనన్న విషయాన్ని చివరి వరకు దాచిపెట్టి, రివీల్ చేస్తే ప్రేక్షకులు సస్పెన్స్ ఫీలయ్యేవారేమో. పరుచూరి వెంకటేశ్వరరావు ఉన్న నాలుగు సన్నివేశాల్లో చాలా బాగా చేశారు. ప్రధాన హీరోయిన్ సారాజేన్ ఏమంత అందంగా లేదు. ఆమె నటన ఓకే. మరో .