Friday, 27 January 2012

పాటించేవారు ఏరీ?

రాయలసీమ జిల్లాలో యువత ప్రమాదకర బైక్ రేసు లు.. తల్లిదండ్రుల అతి గారాబం... వాహన చోదకుల నిర ్లక్ష్యం... పరిమితికి మించిన లోడుతో వా హనాల రాకపోకలు... ఇరువైపులా ప్రయాణికులతో ఆటోడ్రైవర్ల సర్కస్ ఫీట్లు, ప్రమాదకర మలుపులు... అమ్మకాలను పెంచుకునేందుకు వాహన తయారీదారుల విన్యాసాలు.. దశాబ్దా ల నాటిరోడ్లు.. పెరుగుతున్న జనాభా.. వీటన్నిటికీ మించి రవాణా, పోలీసు శాఖాధికారులు అలసత్వంతో రహదారులు మృత్యు దారులుగా మారుతున్నాయి. ప్రభుత్వం రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతో హడావుడి చేసినా ప్రయోజనం లేకపోతోంది. ఇప్పటివర కు ఇలాంటివి 22 వారోత్సవాలు చేసి నా అవి లెక్కగా మాత్రమే మిగిలాయి. ప్రజలకు భద్రత పట్ల అవగాహన కల్పించలేనంత వరకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.8 నివ దేశ ఆర్థిక వ్యవస్థపై రూ. 8 వేల కోట్లు భారం దేశంలో ఏడాదికి దాదాపు 3 లక్షల కు పైగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. లక్ష మందికి పైగా మృతి చెందుతున్నారు. 4 లక్షల మందికి పైగా గాయాలతో బయటపడి వికలాంగులవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల ప్రాణ, ధన నష్టం జరుగుతూ ఎన్నో లక్షల కుటుంబాలు జీవనాధారం కోల్పోయి అనాధలవుతున్నారు. ఈ ప్రమాదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 8 వేల కోట్ల భారం పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి నిమిషానికి ఒక్క ప్రమాదం, ప్రతి ఎనిమిది నిమిషాలకు ఒక మనిషి మృత్యువు పాలవుతున్నట్లు జాతీయ రోడ్డు భద్రత కార్పొరేషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే 75 శాతం ప్రమాదాలు దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో అధిక భాగం డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయని రోడ్డు భద్రత కమిషన్ నివేదిక తేటతెల్లం చేస్త్తోంది. - డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల 75 శాతం.పాటించేవారు ఏరీ? చట్టాలు ఎంత పకడ్బందీగా తయా రు చేసుకున్నా వాటిని అమలు చేసేవారు.. పాటించేవారు కరువవ్వడంతో ఈ రోడ్డు ప్రమాదాలు ప్రతి ఏటా పెరుగుతున్నాయి. అవగాహన కల్పించాల్సిన అధికారులు మొక్కుబడిగా సమావేశాలు నిర్వహిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మృతుల్లో యువత అధికమని చెబుతున్న అధికారులే దశాబ్దాలుగా వారిని చైతన్యవంతం చేయడంలో విఫలమవుతున్నారు.

ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్

తిరుమల తిరుపతి దేవస్థానం సామాన్య భక్తుల మాట మరచినట్టుంది. ప్రముఖుల సేవకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫార్సు లేఖలతో వచ్చేవారికి దర్శనాలు కల్పించడానికి ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేయడానికి సమాయత్తం అయింది. నాలుగేళ్ళ క్రితం తిరుమలలో చైర్మన్ కార్యాలయంగా ఉన్న డంబుల్ అతిధిగృహంలో ఎమ్మెల్యే, ఎంపీల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, ఎంపీల సిఫారసు లేఖలతో దళారీలు రాజ్యమేలారు. జెరాక్స్ కాపీలతో వందల కొద్ది టిక్కెట్లు సంపాదించి బ్లాక్‌లో అమ్ముకున్నారు. ఈ పరిస్థితిని అదుపు చేయడం కోసం సిఫారసు లేఖలపై టిక్కెట్లు ఇవ్వడాన్ని టీటీడీ బాగా తగ్గించింది. ఎమ్మెల్యే, ఎంపీలు లెటర్లు ఇచ్చినా నేరుగా వారు ఫోన్‌చేసి చెబితే తప్ప వీఐపీ బ్రేక్, ఇతర సేవా టిక్కెట్లు ఇవ్వకుండా నియంత్రించారు. అయితే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యేల సిపార్సు ఉత్తరాలకు మంచి రోజులు రాబోతున్నాయి. ఒక విధంగా సామాన్య భక్తులకు అన్యాయం చేయడమే. తమకు తగిన గౌరవం ఇవ్వడంలేదని ఎమ్మెల్యేలు, ఎంపీ లు బహిరంగంగా విరుచుకుపడటం, స్పీకర్ కు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లడంతో వీరిని సంతృప్తి పరచడానికి ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేయాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ సమాచారం.

అభిమానులు ,ప్రజలకు ఎలా ఉండాలో ఫోన్ చేసి చెప్తా...ఎమ్మెల్యే చిరంజీవి

తనను నమ్ముకున్న ప్రజలకు సేవ చేయడానికి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలనందునే కాంగ్రెస్‌తో జతకట్టానని తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి వ్యాఖ్యానించారు.  నీతి నిజాయితీ ప్రాతిపదికగా తాను రాజకీయ రంగప్రవేశం చేశానని, సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్నానని చెప్పారు. పూలేలాంటి గొప్ప నేతలను తెర మీదకు తెచ్చి సామాజిక న్యాయం గురించి తమ పార్టీ ప్రచారం చేసిన తర్వాతనే మిగిలిన పార్టీలు అనుసరించి ఆయన విగ్రహాలను పెట్టాయన్నారు.తన అభిమానులు ఎలా ఉండాలో వారికి ఫోన్ చేసి చెబుతానని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి  మీడియాతో అన్నారు. అభిమానులు పరస్పరం గొడవలకు దిగడం సరికాదన్నారు. ఇలాంటి వాతావరణం తీసుకు రావడం మంచిది కాదన్నారు. మీ అందరికీ తెలుసునని తాను ఎప్పుడూ ఘర్షణలకు చోటిచ్చేలా మాట్లాడలేదన్నారు. అలా మాట్లాడటం ధర్మం, బాధ్యత కాదన్నారు.కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం విలీనంపై వస్తున్న విమర్శలపై ఆయన స్పందిస్తూ రాజకీయ లబ్ధి కోసం ఎవరి కాళ్లా వేళ్లా పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక శక్తి, మరో శక్తితో జత కడితే అద్భుతాలు సాధించగలనని భావించానన్నారు. అధికారాన్ని దక్కించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, చేతకాని నేతలే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చిరంజీవికి మంత్రి సి.రామచంద్రయ్య భారత రాజ్యాంగం పుస్తకాన్ని బహుకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, సి.రామచంద్రయ్య, సినీ నిర్మాత అల్లు అరవింద్, చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.