Friday, 30 December 2011

సౌత్ టాప్ హీరో సర్వేలో జూ ఎన్టీఆర్

ప్రముఖ తమిళ పత్రిక కండక్టు చేసిన సర్వే ప్రకారం సౌత్ టాప్ హీరోల లిస్ట్ అంటూ ఓ లిస్ట్ నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఆన్ లైన్ సర్వే చేసి ప్రకటించామంటున్న వారి లెక్కలు ప్రకారం...

1.రజనీకాంత్ --95%

2.జూ.ఎన్టీఆర్ --85%

3.చిరంజీవి---82%

4.అజిత్--76%

5.విజయ్---74%

6.పవన్ కళ్యాణ్-72%

7.మోహన్ లాల్--63%

8.సూర్య--63%

9.మహేష్ బాబు--57%

10.ప్రభాస్--56%

అయితే ఈ పర్శంటేజ్ లు కేవలం ఆన్ లైన్ సర్వే ప్రకారం చేసినవి అని చెప్తున్నారు. అలాగే ఈ లెక్కలు 'ధట్స్ తెలుగు' స్వయంగా వేసినవి కాదని గమనించాలి. ప్రచారంలో ఉన్న వాటిని పాఠకులు కోసం అందించటం జరుగుతోంది.

అక్కినేని అన్నపూర్ణమ్మ నాకు తల్లిలాంటివారు... బాలకృష్ణ


 

ప్రముఖ నటులు అక్కినేని నాగేశ్వరరావు సతీమణి అన్నపూర్ణ నిన్న కన్నుమూశారు. తెలుగు పరిశ్రమ మొత్తం చూసి వచ్చి సంతాపం ప్రకటించారు. వారిలో...బాలకృష్ణ మాట్లాడుతూ..‘‘నాకు తల్లిలాంటివారు. నాకెంతో ఇష్టమైనవారు. నేనీ మధ్య ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో రాముని పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అందులో వాల్మీకిగా నటించాలని నాగేశ్వరరావుగారిని అడిగితే... అన్నపూర్ణగారు చాలా ప్రోత్సహించారు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’అన్నారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ మాట్లాడుతూ..‘‘నాగేశ్వరరావుగారికి ఇది నిజంగా పూడ్చలేని లోటు. నా సినీ కెరీర్ మొదలైన నాటినుంచి అక్కినేని కుటుంబంతో నాకు అనుబంధం ఉంది. ఇంటికెళ్లినప్పుడల్లా ఎంతో ఆప్యాయంగా పలకరించేవారామె. అన్నపూర్ణమ్మగారి మరణం అక్కినేని కుటుంబానికే కాదు... చిత్రపరిశ్రమకే తీరని లోటు. ఈ బాధ నుంచి నాగేశ్వరరావుగారు త్వరగా బయటపడాలని ఆ దేవుడ్ని వేడుకుంటున్నాను’’అన్నారు ఇక ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణ రావు మాట్లాడుతూ...‘‘అక్కినేని నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ ఆదిదంపతులు. అన్నపూర్ణ స్టూడియోలోకి అడుగుపెడుతుంటే శివపార్వతుల విగ్రహం కనిపి స్తుంది. ఆ విగ్రహం చూడగానే నాకు ఈ ఇద్దరే గుర్తొస్తారు. అన్నపూర్ణ స్టూడియో పతాకంపై నిర్మించిన తొలి చిత్రం ‘కళ్యాణి’కి నేను దర్శ కత్వం వహించాను. ఆ తర్వాత బుచ్చిబాబు, ప్రేమాభిషేకం, యువ రాజుతో కలిపి ఆరు సినిమాలు ఈ సంస్థలో చేశాను. అన్నపూర్ణమ్మ ఎప్పుడూ షూటింగ్‌కి వచ్చేవారు కాదు. కానీ షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఏదో ఒకటి తినడానికి తీసుకువచ్చేవారు. ఆ రకంగా ‘అన్నపూర్ణ’ అనిపించుకున్నారు’’ అన్నారు. అలాగే మోహన్ బాబు మాట్లాడుతూ..‘‘ఆ మహాతల్లి మరణవార్త ఓ ‘షాక్’లా నా మనసంతా కదిలించి వేసింది. ఆ కుటుంబంతో నా అనుబంధం మాటల్లో చెప్పలేనిది. ‘కురుక్షేత్రం’లో నా డైలాగులు ఎంతో నచ్చాయని, ఎన్టీఆర్ తర్వాత అలా డైలాగ్స్ నేను మాత్రమే చెప్పగలనని ఆమె నా గురించి అన్న మాటలు ఈ సందర్భంలో గుర్తొస్తున్నాయి. ఆ స్త్రీమూర్తికివే నా కన్నీటి వీడ్కోలు’’ అన్నారు.

యమదొంగ,సింహాద్రి తరహాలో...ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ము

ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో హైలెట్స్ చాలా ఉన్నాయని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చెప్పుకోదగినవి..ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం..అయితే అదుర్స్ టైప్ లో కాకుండా రెండు పాత్రలూ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయని చెప్తున్నారు. అందులో ఒకటి పోలీస్ అధికారిగా అదరకొట్టే పాత్ర అని చెప్తున్నారు. అంతేగాక రెండో పాత్ర అది,సింహాద్రిలను తలపించే రేంజిలో పాత్ర అంటున్నారు. ఆ రేంజి ఎమోషన్స్ ఆ పాత్రలో నింపాడని చెప్తున్నారు. అలాగే చిత్రంలో రెండో హైలెట్ సిస్టర్ సెంటిమెంట్. శంభో శివ శంబో లో చేసిన అభినయ ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు చెల్లిగా చేస్తోంది. వీరిద్దరి మధ్య వచ్చే టచింగ్ సీన్స్ సినిమాకు ప్రాణమై నిలుస్తాంటున్నారు. రాఖీ రేంజిలో సిస్టర్ సెంటిమెంట్ పండుతుందని చెప్తున్నారు. వీటికి అదనపు బలం ఎమ్.ఎమ్ కీరవాణి సంగీతం. యమదొంగ,సింహాద్రి తరహాలో ఈ చిత్రంలో పాటలన్నీ మ్యూజికల్ హిట్స్ అవ్వటమే కాక సినిమా సీన్స్ కు బలం చేకూరుస్తాయని చెప్తున్నారు. చివరగా అపజయమెరగని దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ. వరస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణను సింహా చిత్రంతో మరోసారి హిట్ పధంలో నడిపించిన ఘనత బోయపాటికే దక్కింది. ఈ చిత్రంతో తను యంగ్ హీరోల చిత్రాలను డైరక్ట్ చేసే కంటిన్యూ అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాడు..అందుకు తగిన కృషి చిత్రంలో కనిపిస్తుందని చెప్తున్నారు.ఇక దమ్ము చిత్రంలో ఎన్టీఆర్ సరసన త్రిష,కార్తిక నటిస్తున్నారు.తొట్టింపూడి వేణు ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావగా కనిపించనున్నారు.భానుప్రియ ..ఎన్టీఆర్ కి తల్లిగా చేస్తోంది.ఇలా ఎక్కడా రాజీపడకుండా అద్బుతమైన తారాగణంతో ఉన్నతమైన సాంకేతిక విలువలతో ఈ చిత్రాన్ని సూపర్ హిట్ చేయాలని భావిస్తున్నారు.

న్యూఇయర్ వేడుకలకు ముస్తాబు

కాల గమనంలో ఎన్ని వసంతాలు మన కళ్ల ముందు మంచులా కరిగిపోతున్నా కొత్త సంవత్సరం రాక నూతనోత్సాహమే. పాత ఏడాదికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరాన్ని వినూత్నంగా ఆహ్వానం పలికేందుకు అందరూ సిద్ధమవుతున్నారు.న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కొందరు ఇతర ప్రాంతాలకు వెళ్తుంటే.. మరికొందరు పుణ్యక్షేత్రాలకు పయనమవుతున్నారు. అలా వీలు కాని వాళ్లు మాత్రం స్థానికంగానే అంబరాన్నంటే సంబరాల్లో మునిగిపోవాలని పరితపిస్తున్నారు. కొత్త ఏడాది ప్రారంభానికి రెండు రోజులుండగానే ‘అనంత’ సుందరంగా ముస్తాబవుతోంది. వన్ ప్లస్ వన్ ఆఫర్లంటూ అప్పుడే వ్యాపారస్తులు న్యూఇయర్ బొనాంజా ప్రకటిస్తున్నారు.మద్యం కూడా ఆఫర్లలో లభిస్తుండడంతో మద్యంప్రియులు హుషారెక్కేందుకు సిద్ధమవుతున్నారు. వస్త్రదుకాణాలు కిటకిటలాడుతున్నాయి. పలు విద్యా సంస్థలు వేడుకలు నిర్వహించేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. కాగా కాలం తెచ్చిన మార్పుతో గ్రీటింగ్ కార్డులు వెలవెలబోతున్నాయి. సెల్ ఫోన్‌తో క్షణాల్లో శుభాకాంక్షలు చెప్పుకునే వీలుం డడంతో అందరూ వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు. కొత్త ఏడా ది తమ జీవితంలో ఎలాంటి మార్పులు తెస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంతో జ్యోతిష్కులకు డిమాండ్ పెరి గింది. గురువారం నగరంలోని రెస్టారెంట్లు, ఐస్ క్రీం పార్లర్‌లు, బేకరీలు విద్యుద్దీపాలంకరణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరోసారి పెరగనున్న పెట్రోల్ ధరలు ?

జనవరి ఒకటి నుంచి పెట్రోల్‌ ధర పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువ క్షీణించడం, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధర పెరగడంతో పెట్రోల్‌ ధరను పెంచేందుకు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. లీటర్‌ ధర 2 రూపాయల 25 పైసల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. కంపెనీలు రూపాయి 90 పైసలు పెంచుతాయని, దీనికి రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్ను అదనమని భావిస్తున్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్‌ ధరను సమీక్షిస్తాయి. డిసెంబరు 15 నాటి సమీక్షలో లీటర్‌కు 65 పైసలు పెంచాలని తొలుత భావించాయి. అయితే రిజర్వ్‌ బ్యాంకు జోక్యం చేసుకుని రూపాయి పతనాన్ని అడ్డుకోవడంతో ఆయిల్‌ కంపెనీలు ధర పెంపు నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నాయి. అయితే ఇప్పుడు రూపాయి పతనంతో పాటు ముడి చమురు ధర పెరగడంతో పెట్రోల్‌ ధర పెంచకతప్పదని కంపెనీలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ధర పెంచొద్దని చెబితే తప్ప ఆయిల్‌ కంపెనీలు తమ నిర్ణయంపై వెనక్కు తగ్గే అవకాశం లేదు.

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోంది ... చంద్రబాబునాయుడు

దేశంలో అవినీతే తీవ్రవాదం కన్న పెద్ద సమస్యని, అవినీతిని నిరోధించాల్సిన అవసరం ఉందని, అవినీతిని రూపు మాపడానికి సమర్ధవంతమైన చట్టాలు రావాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అవినీతిని రూపుమాపే ఉద్దేశం, చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన విమర్శించారు. లోక్‌పాల్ బిల్లును కేంద్ర ప్రభుత్వం నీరుగార్చిందంటూ బాబు ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా శుక్రవారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ పటిష్టవంతమైన లోక్‌పాల్ బిల్లు కోసం తుదివరకు పోరాటం చేస్తామని అన్నారు. మద్యం అమ్మకాల్లో దేశంలోనే రాష్ట్రన్ని మొదటి స్థానంలో నిలిపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని విమర్శించారు. సమాజాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మద్యానికి బానిసలుగా మారుస్తుందని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం అమ్మకాలను నియంత్రిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మద్యంనకు ప్రోత్సాహాకాలు ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో 4.12 కోట్ల లిక్కర్ కేన్‌లు, 3.49 కోట్ల బీర్ కేన్‌లు ఉత్పత్తి చేస్తున్నారని ప్రతి లిక్కర్ కేన్‌కు ప్రభుత్వానికి రూ. 1549 లాభం వస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, ఒక వ్యక్తికి ఒకే షాపు రావాలన్న నిబంధనలున్నప్పుడు బొత్సకు 31 షాపులెలా వచ్చాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రభుత్వం మద్యం సిండికేట్లపై ఏసీబీ నివేదికను ఎందుకు బయటపట్టడం లేదని బాబు ప్రశ్నించారు. మద్యం సిండికేట్లకు నిరసనగా జనవరి 3,4,5 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీలు నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు.

శ్రీశైలంలో డిజిటల్ విద్యాభ్యాసం

శ్రీశైల ప్రాజెక్ట్ కాలనీలో విద్యార్థుల కోసం అధునాతన బోధనా పద్దతిలో భాగంగా డిజిటల్ బోర్డు ద్వారా విద్యాబోధనను పాఠ్యాంశాలగా బోధించేందుకు  మధ్యాహ్నం జెన్‌కో ఛీప్ ఇంజనీరు లక్ష్మినారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. స్థానిక డిఎవి ఉన్నత పాఠశాలలో అన్ని తరగతులకు డిజిటల్ తరగతులను నిర్వహించేందుకు ప్రధానోపాధ్యాయులు సతీష్ చంద్ర కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా పోటీ ప్రపంచంలో అంచెలంచెలుగా పెరుగుతున్న బోధనాపద్దతులకు ధీటుగా మా విద్యార్థులకు కూడా మెరుగైన విద్యను అందించేందుకు ఈ డిజిటల్ బోర్డుల ద్వారా విద్యను బోధించేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన అన్నారు. ఈసందర్భంగా జెన్‌కో సిఇ మాట్లాడుతూ ఈ పద్దతుల ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాలను సులువుగా అర్థం చేసుకుని తెలివితేటలను మెరుగుపరుచుకుని తద్వారా ఉత్తీర్ణతాశాతాన్ని పెంచుకోవచ్చని దాని ద్వారా పాఠ్యాంశాలపై మంచి పట్టును కూడా సాధించవచ్చునని ఈ కార్యక్రమంలో జెన్‌కో రైట్ బ్యాంక్ సూపరింటెండింగ్ ఇంజనీరు రాంబాబు, ఇఇలు రవీంద్ర, డిఇలు సత్యసాయిబాబా, శ్రీనివాసులు, ఎడిఇ రామకృష్ణారెడ్డి, అకౌంట్ అధికారులు ఎమ్‌ఎస్‌ఆర్‌కె శర్మ, శ్రీ్ధర్, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు

ద్వాదశ జ్యోతిర్లింగ శైవక్షేత్రం, అష్టాదశ శక్తి పీఠమైన శ్రీశైల దేవస్థానంలో కొలువున్న శ్రీ భ్రమరాంబిక, మల్లిఖార్జునస్వామి దేవస్థానంలో రానున్న నూతన సంవత్సర సందర్భంగా ఆదివారం రోజున శ్రీశైల దేవస్ధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వాహణాధికారి వి హనుమంతరావు తెలిపారు. నూతన సంవత్సరంలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తారనే ముందస్తు జాగ్రత్త చర్యగా ఆరోజున అన్ని ఆర్జిత సేవలను రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. శాశ్వత కల్యాణాలు త ఉన్నా భక్తులు యధావిధిగా కల్యాణాలు నిర్వహించబడతాయని అంతేకాక ఆ రోజున ఆలయ వేలాలలో కూడా మార్పులు చేయనున్నారు. వేకువ జాముననే 3:30 గంటలకు ఆలయద్వారాలు తెరచి మంగళవాయిద్యాలు 4గంటలకు సుప్రభాత సేవ, 4:30గంటలకు మహామంగళహారతి నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు దర్శనమివ్వనున్నారు.