Saturday, 24 December 2011

కిరణ్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన.... వైయస్ జగన్

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రైతులను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన శనివారం కడప జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. రైతులకు భరోసా ఇవ్వని ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపినా తప్పు లేదని ఆయన విరుచుకుపడ్డారు. కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లి గ్రామంలో ానయ ఉల్లి పంటను పరిశీలించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో, లేదో అర్థం కాని పరిస్థితిలో రైతు ఉన్నాడని ఆయన అన్నారు. పది నెలలు వ్యవసాయ శాఖకు మంత్రి లేడని, వ్యవసాయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్‌ను నియమించలేదని, ఇంతటి దుస్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతకు ముందు వైయస్ జగన్ పులివెందులలోని వైయస్సార్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. వైయస్సార్ కాంగ్రెసు గౌరవాధ్యక్షురాలు, శానససభ్యురాలు వైయస్ విజయమ్మ కూడా వైయస్సార్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆమె శనివారం ఉదయం ఇడుపులపాయకు చేరుకున్నారు. వైయస్ విజయమ్మ కోడలు భారతి కూడా వైయస్సార్‌కు నివాళులు అర్పించారు.

కడప జిల్లాలో రేప్ కేసులో,లాకప్ డెత్ ?

కడప జిల్లా కాజీపేటలో ఓ నిందితుడు మరణించాడు. అయితే, దాన్ని లాకప్ డెత్‌గా అనుమానిస్తున్నారు. గంగులయ్య అనే వ్యక్తి ఉరేసుకుని పోలీసు స్టేషనులో మరణించాడు. చెన్నూరుకు చెందిన గంగులయ్యను పోలీసులు ఓ ఆత్యాచారం కేసులో అరెస్టు చేశారు. గంగులయ్య చెన్నూరు వంతెనపై 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషనులో బంధించారు. అతన్ని పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేశారని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. గంగులయ్య బాత్రూమ్‌కు వెళ్లి తన లుంగీతో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెబుతున్నారు. అయితే, గంగులయ్య బంధువులున పోలీసు స్టేషను ఎదుట ఆందోళనకు దిగారు. పోలీసులు కొట్టడం వల్లనే గంగులయ్య మరణించాడని అతని బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది

రజనీతో వర్క్ చేయడమంటే చాలా ఇష్టం...అసిన్

రజనీతో వర్క్ చేయడమంటే చాలా ఇష్టం. ఆయనతో వర్క్ చేయడాన్ని ప్రేమిస్తాను. ఓ మంచి 'స్రిప్టుతో రూపొందే చిత్రంలో రజనీతో నటించాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను. ఆయనతో నటించే అవకాశం లభిస్తే దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోను. కానీ ఇప్పటి వరకు ఎవరూ నన్ను సంప్రదించలేదు’ అంటూ రజనీకాంత్ పై తన మనసులో ఉన్న కోరికను బయట పెట్టింది అసిన్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా....తమిళ్ లో కొచ్చాదయాన్ అనే 3డి చిత్రం రూపొందుతోంది. రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తన్న ఈ చిత్రంలో రజనీ చెల్లెలు పాత్రను స్నేహ పోషిస్తుండగా, ఐశ్వర్య రాయ్ మరో ముఖ్యమైన అతిథి పాత్రలో దర్శనం ఇవ్వనుందనే వార్తలు వనిపిస్తున్నాయి. వీరితో పాటు ఇందులో అసిన్ కూడా నటించే అవకాశ ఉందని, నిర్మాతలు ఈ మేరకు ప్రత్నాలు చేస్తున్నారనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు అసిన్ పై విధంగా స్పందించింది.

సచిన్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ ?

యావత్ క్రికెట్ ప్రపంచానికే తమ అనితర సాధ్యమైన ప్రతిభతో వనె్నతెచ్చిన భారత ‘సీనియర్‌త్రయం’ సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్‌లకు బహుశా తమ కెరీర్‌లో ఇదే చివరి ఆస్ట్రేలియా టూర్ కావచ్చు. దాదాపు ముగ్గురూ రిటైర్మెంట్‌కు సమీపంలో ఉన్నారు. చాలా రికార్డులు సొంతం చేసుకున్నారు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఘనత సచిన్‌ది. అత్యధిక పరుగుల్లోనూ అతనే నంబర్‌వన్ స్థానాన్ని ఆక్రమించాడు. అతని వెన్నంటే ద్రవిడ్ మొత్తం పరుగుల విషయంలో రెండో స్థానంలో నిలుస్తున్నాడు. భారీ భాగస్వామ్యాలు... కీలక విజయాలు.. కళాత్మక ఆట.. కడవరకూ పోరాడే తత్వం..వివాదాలకు దూరంగా ఉండడం.. అత్యున్నత క్రీడా ప్రమాణాలను పాటించడం వంటి అనేకానేక అంశాల్లో ఈ ముగ్గురికీ సారూప్యం ఉంది. గణాంకాల విషయం ఎలావున్నా, సామర్థ్యంలో ముగ్గురూ ముగ్గురే. జాతీయ జట్టుకు అత్యుత్తమ సేవలు అందించడంలో మొనగాళ్లే. ఆస్ట్రేలియాలో టీమిండియా నాలుగు టెస్టులు ఆడుతుంది.తిరిగి 2014 డిసెంబర్‌లో మరోసారి ఆసీస్ టూర్‌కు వెళుతుంది.అప్పటికి ఈ ముగ్గురూ టెస్టు క్రికెట్‌లో ఉంటారనేది అనుమానమే.ఒకవేళ ఎవరైనా రిటైర్‌కాకుండా కెరీర్‌ను కొనసాగించినా, ముగ్గురూ కలిసి ఆడడం అసాధ్యంగానే కనిపిస్తోంది. నిజం చెప్పాలంటే, ఇదే ఆసీస్‌లో తమ చివరి టెస్టు సిరీస్ అన్నది స్వదేశం నుంచి బయలుదేరే సమయంలోనే ఈ ముగ్గురు సీనియర్లు ఒక నిర్ణయానికి వచ్చివుంటారు. అందుకే ఈ సిరీస్‌ను ముగ్గురూ ఆఖరి పోరాటంగా భావించి, గొప్ప ముగింపును ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 26 నుంచి మెల్బోర్న్‌లో ఆరంభం కానున్న తొలి టెస్టులో మిగతా ఇద్దరి విషయం ఎలావున్నా, అందరి దృష్టీ సచిన్‌పైనే కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ‘సెంచరీల సెంచరీ’కి కేవలం ఒక సెంచరీ దూరంలో ఉన్న సచిన్ ఈ టెస్టులోనే దానిని సాధిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పటికే క్రికెట్ బ్యాటింగ్ విభాగంలో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూ, ఎవరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన సచిన్ మరో మైలురాయిని చేరుకోవడానికి తహతహలాడుతున్నాడు. వందో సెంచరీకి తొందర లేదని ప్రకటిస్తున్నప్పటికీ, సచిన్ ధ్యాస మొత్తం దీనిపైనే ఉంటుందనేది వాస్తవం. ఇంగ్లాండ్ టూర్‌లో అద్భుతంగా రాణించిన ద్రవిడ్,ఎన్నోసార్లు ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపించిన లక్ష్మణ్ కూడా తమతమ వ్యక్తిగత మైలురాళ్లను అధిగమించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. వీరి సామర్థ్యం యువ క్రికెటర్లకు ఎన్నో పాఠాలు నేర్పుతుంది. జట్టులోని జూనియర్ ఆటగాళ్లకు ఇదో చక్కని అవకాశం.సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్‌లతో కలిసి ఆడడం, వారి నుంచి కళాత్మక బ్యాటింగ్‌లోని సొగసును ఆస్వాదించడం యువకులకు ఓ వరం. ముగ్గురు అతిరథ మహారథులు చెలరేగితే, వారిని కట్టడి చేయడానికి ఆసీస్ బౌలర్లు ఎంత కష్టపడాలో?.

భారతి, వొడాఫోన్, ఐడియాలకు ‘డాట్’ నోటీసులు జారీ

తక్షణమే తమ 3జి రోమింగ్ ఒప్పందాలను
నిలిపివేయాలని సూచిస్తూ మూడు ప్రధాన టెలికాం సంస్థలు భారతి
ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియాలకు టెలికాం శాఖ (డాట్) నోటీసులు జారీచేసింది. ఈకంపెనీలు కుదుర్చుకున్న 3జి రోమింగ్ ఒప్పందాలు చట్టవిరుద్ధం కావున దీనిపై 24 గంటల్లోగా తమ వివరణఇవ్వాల్సిందిగా టెలికాం ఆపరేటర్లను ఆదేశించింది. తమకు 3జి స్పెక్ట్రమ్ లభించని సర్కిళ్లలో 3జి రోమింగ్ సేవల కోసం పరస్పరఒప్పందాలు కుదుర్చుకున్న భారతి, వొడాఫోన్, ఐడియాలకు డాట్ ఈరోజు నోటీసులు జారీచేసింది. అలాగే రోమింగ్ సేవల నిలిపివేత విషయంలో శనివారం సాయంత్రం మూడు గంటలలోగా తమకు వివరణ ఇవ్వాలని టెలికాం శాఖ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు
తెలియజేశాయి. ఇదిలావుంటే 3జి రోమింగ్ ఒప్పందాలను తక్షణం నిలిపివేయాలని సూ చిస్తూ డాట్ త మకు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన భారతి, వొడాఫోన్, ఐడియా సంస్థలు దీన్ని సవాలుచేస్తూ టెలికాం ట్రిబ్యునల్ టిడిశాట్‌కు ఫిర్యాదు చేశాయ.టెలికాం శాఖ నుంచి నోటీసులు అందుకున్న వెంటనే ముగ్గరు ఆపరేటర్లు టెలికాం ట్రి బ్యునల్‌కు వెళ్లారు. రోమింగ్ వివాదంపై టిడిశాట్ శనివారం ప్రత్యేక ంగా విచారణ జరపనుంది.

అనంతపురం జిల్లా ఉప ఎన్నికల పోరుపై తెలుగుదేశం పార్టీ లో టెన్షన్!

ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో అనంతపురం నియోజకవర్గంమే తలనొప్పిగా ఉంది. ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ వైకుంఠం ప్రభాకర్‌చౌదరి, ఇన్‌చార్జి మ హాలక్ష్మీ శ్రీనివాస్, రాజ్యసభ మాజీ స భ్యుడు కేఎం సైపుల్లా, మైనార్టీ నేత న దీం ప్రధానంగా టికెట్ రేసులో ఉన్నా రు. దీంతో ఎవరికి అధినేత ఛాన్సు ఇస్తారనే ఉత్కంఠత కొనసాగుతోంది. బుధవారం నియోజకవర్గ సమీక్షలో కూడా క లిసి పనిచేద్దాం అంటూనే కొందరు తిరకాసు పెట్టారు. ప్రభాకర్‌చౌదరి టికెట్ ఎ వరికి వచ్చినా మనస్ఫూర్తిగా గెలుపుకు పనిచేస్తానన్నారు. అయితే నాయకులు మారాలని పరోక్షంగా సూచించారు. కే ఎం సైపుల్లా ఒకడుగు ముందుకేసి అభ్యర్థిని ముందే ప్రకటించిన తర్వాతే జనచైతన్యయాత్రను మొదలు పెట్టాలని డి మాండ్ చేశారు. మహాలక్ష్మీ శ్రీనివాస్ మాత్రం సమష్టిగా పనిచేసి పార్టీని బలో పేతం చేసి అనంతలో పచ్చజెండా ఎగురవేద్దామని పిలుపునిచ్చారు. నాయకు లు, కార్యకర్తలు ఒక్కటేనని ఆభావంతో నే ముందుకు సాగాలని మరోనేత నదీం సూచించారు. ఇలా టికెట్ రేసులో ఉన్న నాయకులు తమ మనసులోని మాటను బయటపెట్టారు. అయినా టికెట్టు రేసు లో మాత్రం ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారన్న ఊహగానాలున్నా యి. ఇదిలా ఉంటే రాయద్గుం నియోజకవర్గం అభ్యర్థి ఎంపికపై సైలెంట్‌గా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఇటీవల పార్టీలోకి చేరిన దీపక్‌రెడ్డికి టికెట్ ఖాయమని భావించారు. అయితే మెట్టు గోవిందరెడ్డి తన కుమారుడిని తెరపైకి తెచ్చా రు. అంతలోనే మెట్టుతోపాటు ఇతర నేత లు బీసీ అభ్యర్థిని నిలబెట్టాలని అధినేతకు సూచించినట్టు సమాచారం.కొందరైతే ఏకంగా మాజీ ఎంపీ కాల్వ శ్రీనివాసులను నిలపాలని కోరగా కాల్వ నిరాకరించినట్టు చర్చించుకుంటున్నారు. ఈ తతంగంలో కొందరు గుట్టుగా టికెట్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది. ఉప ఎన్నికల అభ్యర్థుల ఎంపిక ఇలా అనంతలో టెన్షన్ ఉంటే రాయదుర్గంలో సైలెంట్‌గా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. 29న కొలిక్కి ఇదిలా ఉంటే ఈనెల 29న రాజధానిలో జరిగే జిల్లా నేతల సమావేశంలో అభ్యర్థుల ఎంపిక ఓకొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు అధినేత తమ అభిప్రాయాన్ని గట్టిగానే చెప్పే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నా రు. ఈ ఉత్కంఠకు వారం ఆగుదాం.

అనంతపురం జిల్లా లో వ్యవసాయంపై కేంద్ర కమిటీ!

అనంతపురం జిల్లా కరువును ఎదుర్కొనేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. వేరుశనగకు బదులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవకాశాలు, కరువును అధిగమించేందుకు తీసుకోవాల్సిన చర్యలు తదితర అన్ని రకాల పరిస్థితులను నిశితంగా పరిశీలించేందుకు 12 మందితో ఓ కమిటీని నియమించింది. ఈ మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి డెరైక్టరు జనరల్, కార్యదర్శి డాక్టర్ ఎస్. అయ్యప్ప  ఉత్తర్వులు జారీ చేసినట్లు రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాసమగ్ర వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికపై అధికారులతో చర్చించేందుకు జిల్లా యంత్రాంగంతో నేడు తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.జిల్లా కలెక్టరు దుర్గాదాస్‌తో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులను కూడా సమావేశానికి ఆహ్వానించినట్లు తెలిపారు. కేంద్రకమిటీ జనవరిలో ‘అనంత’లో పర్యటించి జనవరి 30లోపు జిల్లా వ్యవసాయరంగ పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. వ్యవసాయశాఖతో పాటు అనుబంధశాఖలైన పశుసంవర్ధకశాఖ, హార్టికల్చర్, ఏపీఎంఐపీ, మత్య్సశాఖ, డీఆర్‌డీఏ, ఆర్‌డబ్ల్యూఎస్, ఇరిగేషన్ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులు శనివారం రాజధానిలో జరిగే సమావేశానికి హాజరు కావాలని మంత్రి ఆదేశించారు.