Friday, 21 October 2011

రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు

                         
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కారణంగా నష్టపోయింది తెలంగాణ వాళ్లే.. రాష్ట్ర విభజన ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను కోదండరాం రెచ్చగొడుతున్నారు. ఇది ప్రజలే అర్థం చేసుకోవాలి' అని మంత్రి శైలజానాథ్ పేర్కొ న్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు.

తెలంగాణ ఉద్యమాన్ని శాంతింపచేయడానికి కేసీఆర్ వర్గానికి చెందిన కొందరికి పోలవరం ప్రా జెక్టు పనులు ఇచ్చారనే ఆరోపణలపై మంత్రిని విలేఖరులు ప్రశ్నించగా అదంతా సోనియమ్మ చూసుకుంటారని బదులిచ్చారు. కేసీఆర్, కోదండరాం లాంటి వాళ్లు సొంత లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొట్టి శాంతికి విఘాతం కలిగిస్తున్నారన్నారు. రైల్‌రోకోలు.. బస్సుల బంద్ లాంటివాటిని సకల జనుల సమ్మె పేరుతో నిర్వహిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్నారు

No comments:

Post a Comment