Monday, 24 October 2011

చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు సిపిఐ

                                 
అనంతపురం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమాలపై ఆధారాలు ఉంటే ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం అనంతపురం జిల్లాలో అన్నారు. ఆయనపై ఆధారాలు ఉంటే కాంగ్రెసు ప్రభుత్వం విచారణ ఎందుకు చేపట్టడం లేదని ప్రశ్నించారు. గత సాధారణ ఎన్నికల్లో తాము తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ గతంలో చంద్రబాబు వ్యతిరేక విధానాల పైన ఉద్యమాలు చేశామన్నారు. బాబు అవినీతిపై విచారణ జరిపితే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. అక్రమాలు ఎవరు చేశారని తెలిసినా విచారణ జరపాల్సిందేనన్నారు

శ్రీశైలం ఆర్జిత సేవల టికెట్ల ధరలు 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు

శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి ఆలయ గోపురం సువర్ణ కవచం పనులు జనవరి నాటికి పూర్తిచేస్తామని ఆలయ పాలక మండలి చైర్మన్ ఇమిడిశెట్టి కోటేశ్వరరావు తెలిపారు. ఆదివారం జరిగిన దేవస్థానం ధర్మకర్తల మండలి సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల పెంచిన ఆర్జిత సేవల టికెట్ల ధరలు 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు తెలిపారు. కార్తీక మాసంలో ప్రతిరోజు 50 మందికి, ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున 200 మందికి అన్నదానం చేస్తామన్నారు