టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల
గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా
విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై
ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు.
మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు
చేశాడు. ఫీల్డింగ్లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ
ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ
కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ
టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని
సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు
ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని
ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర
సెహ్వాగ్కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి
వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి
మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి
తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు
తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని
ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్
ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి
గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని
బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని,
సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ
వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి
పాలైన తర్వాత కెప్టెన్గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు
చేశాడు.Wednesday, 22 February 2012
టీమిండియా క్రికెట్ జట్టులో అంతర్గత పోరు!
టీమిండియాలోని అంతర్గత పోరు నిజమేనని తేలిపోయింది. రొటేషన్ కారణంగా విభేదాల
గుట్టు రట్టయింది. ధోనీకి వీరేంద్ర సెహ్వాగ్ చురకలు వేయడం ద్వారా
విభేదాలను బయట పెట్టారు. సీనియర్ల ఫీల్డింగ్పై ధోనీ చేసిన వ్యాఖ్యలపై
ఇప్పటికే సీనియర్లు మండిపడుతున్నారు. తాజాగా, సెహ్వాగ్ గొంతు విప్పాడు.
మంగళవారం లంక తో ఓటమితో అనంతరం మీడియా సమావేశంలో నేరుగా ధోనీపై విమర్శలు
చేశాడు. ఫీల్డింగ్లో మందకొడిగా ఉంటున్నామని తనకు కాని ఇతర సీనియర్లకు కానీ
ఎప్పు డూ చెప్పలేదని ఆయన అన్నాడు. 'అతను ధోనీ ఏమి మాట్లాడాడో, మీడియాలో ఏ
కథనాలు వస్తున్నాయో నాకు తెలీదు. వచ్చే ప్రపంచ కప్ ఇక్కడ జరుగనుండడంతో ఆ
టోర్నీలో ఆడే జూనియర్లకు వన్డేల్లో అవకాశమివ్వాలని మాతో చెప్పాడు' అని
సెహ్వాగ్ చెప్పాడు.సచిన్, వీరూ, గంభీర్ వల్ల ఫీల్డింగ్ సమస్యలు
ఎదురవుతున్నాయని, అందువల్లే వీరిని రొటేషన్ పద్ధతిలో పక్కనపెడుతున్నామని
ధోనీ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.భారత క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, వైస్ కెప్టెన్ వీరేంద్ర
సెహ్వాగ్కు మధ్య వివాదానికి సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి
వచ్చింది. శ్రీలంకపై జరిగిన మ్యాచుకు ముందు తుది జట్టు కూర్పుపై ఇరువురి
మధ్య తీవ్ర విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. తుది జట్టులోకి
తీసుకోవాల్సిన 11 మంది ఆటగాళ్లపై వారిద్దరి మధ్య వివాదం చోటు చేసుకున్నట్లు
తెలుస్తోంది. శ్రీలంకపై ఆడే జట్టులోకి రోహిత్ శర్మను తీసుకోవాలని
ధోనీ సూచించగా, ఆ మ్యాచుకు కెప్టెన్సీ చేసిన సెహ్వాగ్ ముగ్గురు సీనియర్
ఆటగాళ్లతో ఆడడానికి మొగ్గు చూపాడు. ఈ వివాదం తెలిసి బిసిసిఐ దిగ్భ్రాంతికి
గురైనట్లు చెబుతున్నారు. డ్రెసింగ్ రూంలోనే వివాదాన్ని పరిష్కరించుకోవాలని
బిసిసిఐ వారికి సూచించింది. ఈ సంఘటన తమను తీవ్ర కలవరానికి గురి చేసిందని,
సీనియర్ ఆటగాళ్లు ఆ విధంగా ప్రవర్తించడం తాము ఇది వరకు చూడలేదని బిసిసిఐ
వర్గాలు వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి. పైగా, శ్రీలంకపై ఘోరంగా ఓటమి
పాలైన తర్వాత కెప్టెన్గా వ్యవహరించిన సెహ్వాగ్ ధోనీపై తీవ్ర వ్యాఖ్యలు
చేశాడు.కిరణ్-చంద్రబాబు శాసనసభలో తీవ్ర వాగ్వివాదం
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, చంద్రబాబునాయుడికి మధ్య బుధవారం
శాసనసభలో తీవ్ర వాగ్వివాదం జరిగింది. బాబు శానససభలో ప్రసంగిస్తుండగా
ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని - చంద్రబాబు వాడిన భాషపై అభ్యంతరం తెలిపారు.
మాటిమాటికీ దోచుకున్నారని, దోపిడీ చేశారని చంద్రబాబు అంటున్నారని, అదేదో
గొప్పని అనుకుంటున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబు ఆవేశంతో
ఉన్నారని, అన్ని విషయాల గురించి మాట్లాడుతున్నారని, అయితే ప్రజా తీర్పును
చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అన్నారు. చంద్రబాబు ఏ విధంగా
మాట్లాడాలో ఆలోచించుకుని మాట్లాడాలని ఆయన అన్నారు.శాంతి భద్రతలు పరిస్థితి
అధ్వాన్నంగా తయారయిందన్నారు. భానుకిరణ్ ఎక్కడున్నాడో తెలియని పరిస్థితి
ఏర్పడిందన్నారు. మైలవరం దుర్ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని
ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెల్ల ప్రాజెక్టుకు జాతీయహొదా కల్పించలేకపోవడం
ప్రభుత్వం చేతగానితనంగా పేర్కొన్నారు. రైల్వే బడ్జెట్ లో రాష్ట్రానికి
అన్యాయం జరిగిపోయిందన్నారు. రాష్ట్రంపై కేంద్రం ఎందుకు వివక్ష చూపుతోందని
ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. అవినీతి మంత్రులు
ఎందుకు రాజీనామా చేయరని ఆయన ప్రశ్నించారు. మద్యం సిండికేట్ లో ప్రమేయం
ఉన్నట్లు ఆరోపణలు వచ్చినా మంత్రి రాజీనామా చేయలేదన్నారు. ముఖ్యమంత్రి కూడా
ఆయనపై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీశారు. ఈ ప్రభుత్వం అవినీతిని
నియంత్రించలేకపోతుందన్నారు. 4700 కోట్ల రూపాయల విలువైన పోలవరం ప్రాజెక్టు
కాంట్రాక్ట్ ని అర్హతలేని కంపెనీకి ఇచ్చి, ఆ తరువాత రద్దు చేశారన్నారు.
మంత్రుల మాటలు విన్న అధికారులు జైళ్లలో ఉన్నారని గుర్తు చేశారు. ప్రభుత్వ
అవినీతి వల్ల వోక్సు వ్యాగన్ పూనేకు వెళ్లిందన్నారు. ఒక్క పరిశ్రమ కూడా
ఇక్కడకు రావడంలేదని బాధపడ్డారు. రాజీవ్ గృహ కల్పపేరుతో డబ్బు వసూలు చేసి
ఇళ్లు కట్టించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం రైతులకు సాయం చేస్తుందంటే నమ్మాలా అని చంద్రబాబు ప్రశ్నించారు.
మిగిలిన రాష్ట్రాల్లో రైతుకు మద్దతు ధర ఉంటే మన రాష్ట్రంలోనే లేదన్నారు.
కాంగ్రెసు మాటలు కోటలు దాటేలా ఉన్నా చేతలు గడప దాటడం లేదన్నారు. ఢిల్లీలో
పదవుల కోసం పైరవీలే తప్ప ప్రజా సమస్యలు వీరికి పట్టడం లేదన్నారు.
గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకుంటున్నారన్నారు. రాష్ట్రం నుండి 32
మంది పార్లమెంటు సభ్యులు ఉన్నప్పటికీ రైల్వే బడ్జెట్ విషయంలో కేంద్రంపై
ఒత్తిడి తేలేక పోతున్నారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు భారీగా ఉన్నాయన్నారు.
చివరకి సిఎం పేషీలో కూడా కరెంట్ లేని పరిస్థితి ఉందన్నారు.తొలిసారిగా నేపాల్లో శ్రీవారి కల్యాణాం
తొలిసారిగా పొరు గు దేశమైన నేపాల్లో ఈ నెల 25న శ్రీవారి 108వ కల్యాణా
న్ని టీటీడీ నిర్వహించనున్న ది. ఇందుకోసం పటిష్ఠమైన బందోబస్తు మధ్య
శ్రీదేవి, భూదేవి సహిత శ్రీనివాసుల కల్యాణ మూర్తులు ఉన్న బ స్సు తిరుమల
నుంచి నేపాల్ కు బయలుదేరింది. ఈ సందర్భంగా వాసుదేవాచార్య మా
ట్లాడుతూ ఇప్పటికి టీటీడీ ఆధ్వర్యంలో కల్యాణ మూర్తులకు 107 కల్యాణ ఉత్సవాలు
జరిగాయని, 108వ కల్యాణోత్సవం నేపాల్లో జరపాలని ఆ దేశపు రాజు కోరడంతో
అక్కడకు వెళుతూ మార్గమధ్యంలో విజయవాడలో బస చేశారన్నారు.స్వయంగా
స్వామివారి కల్యాణ ఉత్సవ మూర్తులు ఇక్కడకు రావడంతో తాము తలవని తలంపుగా
ప్రాతఃకాల పూజలను నిర్వహించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. టీటీడీ
విజిలెన్స్, సెక్యూరిటీ అధికారి సుదర్శన్ మాట్లాడుతూ కోదాడ, కరీంనగర్
మీదుగా నాగపూర్ వెళ్ళి, అక్కడ నుంచి నేపాల్ చేరుకుంటామన్నారు. నేపాల్లో ఈ
నెల 25 వ తేదీన శ్రీవారి కల్యాణం జరుగుతుందని చెప్పారు. బస్సులో అర్చకులతో
సహా మొత్తం 15 మంది సిబ్బంది ఉన్నారు.
Subscribe to:
Posts (Atom)