నమస్తే రాయలసీమ పాఠకులకు విజ్ఞప్తి. కొన్ని కారణాల వాళ్ళ, మన వెబ్ సైటు గూగుల్ క్రోమ్ లో కనిపించుట లేదు. దయచేసి ఫైర్ ఫాక్స్ లేదా ఎక్స్ ప్లోరర్ ఉపయోగించగలరు. అసౌకర్యానికి చింతిస్తున్నాం.
Monday, 14 November 2011
రైతుల దారుణమృతి
కర్నూలు: పెదకడులూరు లో వరిపొలం మీదుగా ఉన్న విద్యుత్లైన్ నుంచి అకస్మాత్తుగా తీగలుతెగి పంటపొలంలో
పడడంతో పనిలో నిమగ్నమైన ఇద్దరు రైతులు విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచారు.
ఏం జరిగిందో వారికి సహాయం అందించబోయిన పక్కపొలానికి చెందిన రైతు కూడా
అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులపై
గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కు గుడ్ న్యూస్
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అక్రమ ఆస్తులపై హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది.
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు, చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకి కోర్టు నిర్దేశించింది.
చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది
వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు, చంద్రబాబు ఆస్తులపై మూడు నెలల్లో ప్రాథమిక విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని కేంద్ర దర్యాప్తు సంస్థకి కోర్టు నిర్దేశించింది.
చంద్రబాబుతోపాటు 13 మందిపై విచారణ జరపాలని ఆదేశించింది. ప్రతివాదులందరికీ నోటీసులు పంపారు. నారా భువనేశ్వరి, ఆమె కంపెనీలు, లోకేష్, రామోజీరావు, ఆయన కంపెనీలు, అహోబలరావు, ఎంపి వైఎస్ చౌదరి, మాగంటి మురళీ మోహన్, కర్నాటి వెంకటేశ్వరరావు, సిఎం రమేష్ వ్యక్తిగత ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది
తిరుమల ,తిరుపతిలో చెత్త వేస్తే 1000 రూపాయలు జరిమానా
శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల కోలాహలం
Subscribe to:
Posts (Atom)
