Thursday, 29 December 2011

కాణిపాకం విచ్చేసే భక్తులకు జనవరి ఫస్ట్‌కు విస్తృత ఏర్పాట్లు

జనవరి ఒకటవ తేదీ కాణిపాకం విచ్చేసే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు డీఆర్వో శేషయ్య తెలిపారు.  సాయంత్రం ఈవో కార్యాలయంలో జనవరి ఫస్ట్ ఏర్పాట్లపై అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి ఫస్టున లక్ష మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని అధికారుల ను ఆదేశించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. వీఐపీ భక్తుల వల్ల సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులందరికీ శీఘ్రదర్శనం కల్పించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత కల్పించాలన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటి కప్పుడు శానిటేషన్ పనులను పరిశీలించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశిం చారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని ఆర్‌అండ్‌బీ అధికారులకు ఆయన సూచించారు. ఈ సమావేశానికి ఎంపీడీవో పార్వతమ్మ, డీపీఆర్వో గైర్హాజర్ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఏడీ మోహన్‌రాజ్ మాట్లాడు తూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను అందుబాటులో ఉంచుతామని తెలిపా రు. అనంతరం మండల వైద్యాధికారిణి షర్మిష్టారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక వైద్యశిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో సుబ్రమణ్యేశ్వరరెడ్డి, డీఎస్పీ శిల్పవల్లి, సీఐ శ్రీకాంత్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ గురుప్రసాద్, తహసీల్దార్ రంగస్వామి తదితరు లు పాల్గొన్నారు.

ప్రపంచస్థాయికి తిరుపతి జూ అభివృద్ధి

ఆసియా ఖండంలో విస్తీర్ణత దృష్ట్యా రికార్డు సాధిం చిన తిరుపతి జంతు ప్రదర్శన శాలను ప్రపంచస్థాయికి అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుం దని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి గల్లా అరుణకుమారి తెలిపారు. కర్ణాటక రాష్ట్రం మైసూరు జూ నుంచి తీసుకువచ్చి న మూడు అడవి దున్నల ఎన్‌క్లోజర్లను ఆమె జెండా ఊపి ప్రారంభిం చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తిరుపతికి వస్తున్న యాత్రికులు, సందర్శకులను దృష్టిలో ఉంచుకుని తొలిసారిగా ఇక్కడి జూలో అడవి దున్నలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఒక మగ, రెండు ఆడజాతి దున్నలను ఇక్కడికి తీసుకువచ్చి అందుకు బదులుగా మైసూరు జూకు 4 ఎలుగుబంట్లను ఇక్కడి నుంచి తరలించి నట్టు తెలిపారు. ఈ అడవి దున్నలకు తిరుపతి జూ వాతావరణం అనువుగా ఉంటుందన్నారు. వీటి జీవితకాలం 20-25 సంవత్సరాలు ఉంటుందన్నారు. వీటి సంరక్షణకు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకున్నట్టు మంత్రి పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా టీడీపీ నాయకులు రసవత్తరంగా ‘టికెట్’ రాజకీయం

అనంతపురం అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయనే ఆలోచనతో టీడీపీ నాయకులు టికెట్ కోసం ఎవరి ప్రయత్నాలు వారు ముమ్మరం చేశారు. తనకు టికెట్ ఇవ్వాలని నియోజక వర్గ ఇన్‌చార్జ్ మహాలక్ష్మి శ్రీనివాస్, ..కాదు తనకే ఇవ్వాలని ప్రభాకర్ చౌదరి, తమ కుటుంబంలో ఒకరికి కేటాయించాలని సైఫుల్లా....ఇలా ఎవరికివారు చంద్రబాబు వద్ద వాణి వినిపించారు. తాజాగా బుధవారం సైఫుల్లా తనయుడు జకీవుల్లా మరోసారి చంద్రబాబు వద్ద బలప్రదర్శన చేసేందుకు రాజధానికి బయలుదేరారు. మహాలక్ష్మి శ్రీనివాస్‌కు టికెట్ దక్కనీయకుండా సైఫుల్లా, ప్రభాకర్ చౌదరి పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబు వద్ద పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. టికెట్ ఎవరికివ్వాలో తనకు తెలుసనని ఆయన ముగ్గురికీ చురకలంటించినట్లు తెలిసింది. ముందుగా జనచైతన్య యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని, తర్వాత టికెట్ సంగతి తేలుస్తానని చంద్రబాబు సూచించారు. దీంతో ఈ నెల 21 నుంచి యాత్ర చేపట్టేందుకు మహాలక్ష్మి ప్రణాళిక రూపొందించగా, టికెట్ విషయం తేల్చకుండా ప్రజల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని సైఫుల్లా పట్టుబట్టడంతో బ్రేక్ పడింది. ఎట్టకేలకు ఈ నెల 25 నుంచి యాత్ర ప్రారంభించారు. ఇందులో సైఫుల్లా వర్గం పాల్గొనలేదు. ఈ క్రమంలో బుధవారం సైఫుల్లా తనయుడు జకీవుల్లా తన వర్గీయులతో సమావేశం నిర్వహించారు. అనంతరం దాదాపు వంద వాహనాల్లో హైదరాబాద్ పయనమయ్యారు. రాజధానిలో 1,500 మందికి భోజన ఏర్పాట్లు కూడా చేశారు. టికెట్‌పై తాడోపేడో తేల్చుకున్న తర్వాతే తిరిగి వస్తామని, అంతవరకూ అక్కడే మకాం వేస్తామని తమ వర్గం నాయకులతో జకీవుల్లా చెప్పారు. పార్టీ కోసం తన సోదరుడిని కోల్పోయామనే విషయాన్ని చంద్రబాబుకు గుర్తు చేసి ఎలాగైనా టికెట్ దక్కించుకోవాలనే యోచనలో జకీవుల్లా ఉన్నారు. టికెట్ రాకపోతే మరో పార్టీలో చేరేందుకూ ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు సన్నిహితుల ద్వారా తెలిసింది. జకీవుల్లా తీరుపై ఇటు మహాలక్ష్మి, అటు ప్రభాకర్ చౌదరి గుర్రుగా ఉన్నట్లు సమాచారం.

విష్ణు ఈ సారి తప్పకుండా కొడతాడంటున్న...మోహన్ బాబు

తన కుమారుడు విష్ణు ఈ సారి తప్పకుండా హిట్ కొడతాడంటున్నారు సినీయర్ నటుడు మోహన్ బాబు. విష్ణ, హన్సిక జంటగా జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో 24ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఓ వినోద భరితమైన చిత్రాన్ని నిర్మించబోతోంది. జనవరి 5న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభ కానున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియాతో మాట్లాడుతూ విష్ణు కెరీర్లోనే అద్భుతమైన హిట్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం, చక్రి సంగీతం అందిస్తున్న ఈ సినిమాలోని నాలుగు పాటలు ఇప్పటికే రికార్డు చేయడం పూర్తయిందన్నారు. 2012లో ఈ సినిమా తమ బేనర్ లో మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. లక్ష్మి ప్రసన్న నిర్మాతగా రూపొందుతున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం కూడా మనోజ్ కెరీర్ లో మంచి హిట్ గా నిలుస్తుందని, బయటి బ్యానర్లో మనోజ్ నటిస్తున్న మిస్టర్ నోకియా చిత్రం కొత్త సంవత్సరంలో ఘన విజంయ సాధిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.

మల్టీస్టారర్ చిత్రాలు పెరిగేనా?

ప్రతి ప్రేక్షకునికి ఇద్దరు అభిమాన నటులుంటారు. వారిద్దరూ కలిసి, ఒకే సినిమాలో నటిస్తే చూడాలని, అన్నివర్గాల ప్రేక్షకులకు వుంటుంది. పాత తరం నటుల్లో దాదాపు అగ్ర హీరోలందరూ కలిసి నటించి, అభిమానుల్ని అలరించారు. కానీ నేటి తరం ప్రేక్షకులకు ఆ కమ్మని అనుభూతి కలగానే మిగిలిపోయింది. ఆరోజుల్లో ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్‌బాబు లాంటి అగ్రనటులు ఎటువంటి భేషజాలు లేకుండా కలిసి నటించి అభిమానుల్ని ఆనందపరిచారు.ఎందుకో తెలియదు గాని ఈనాటి హీరోలు మల్టీస్టారర్ సినిమాల గురించి ఆలోచించడం లేదు. ఏ నటున్నైనా ఈ విషయం గురించి ప్రస్తావిస్తే, సరైన కథ దొరికితే, తప్పకుండా కలిసి నటిస్తామని చెబుతుంటారు. సరైన కథలంటే ఏంటో వారికే తెలియాలి. తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో చక్కని కథారచయితలు, దర్శకులున్నారు. వీరు ఆ మాత్రం కథల్ని అందించలేరా? ఇప్పుడు ఇక్కడి హీరోలకు కలిసి నటించేందుకు కావాల్సింది కథలు మాత్రమే! సాటి హీరోలతో కలిసి నటించాలన్న అభిలాష లేకపోవడంవల్లనే, మల్టీ స్టారర్ సినిమాలు రావడం లేదు. అప్పట్లో కొనే్నళ్ళపాటు చిరంజీవి, బాలకృష్ణ కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్ళడం వలన, ఇక వారి అభిమానుల ఆశ, అడియాసగానే మిగిలిపోయింది. కాబట్టి ఇప్పుడైనా స్టార్ ఇమేజ్ వున్న హీరోలు మల్టీ స్టారర్ చిత్రాలపై దృష్టిసారిస్తే మంచిది.ఇలా నటించడంవలన అభిమాన ప్రేక్షకులకు ఆనందం పంచడమే కాకుండా, పరిశ్రమలో సుహృద్భావ వాతావరణంకోసం కృషిచేసిన వారిగా చెప్పుకోబడతారు.ఇటీవల అనౌన్స్ అయిన మల్టీస్టారర్ సినిమాలు ప్రేక్షకులకు కాస్త ఊరటగా అనిపించింది. వెంకటేష్ మహేష్‌బాబుతో కలిసి నటించబోతున్న ‘‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’’అనే చిత్రం, రామ్‌చరణ్ తేజ్ అల్లు అర్జున్‌తో కలిసి నటిస్తున్న సినిమాలు రాబోయే రోజుల్లో మల్టీస్టారర్ సినిమాల వాతావరణాన్ని సృష్టిస్తాయని తెలుగు సినీ ప్రేక్షకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ గోపీచంద్ లాంటి యంగ్ హీరోలు కూడా ఒకరితో ఒకరికి కలిసి నటించాలని వుందన్న విషయాన్ని, బయటపెట్టడం అభినందనీయం. ఇప్పుడున్న స్టార్ హీరోలలో నాగార్జున, మోహన్‌బాబు, శ్రీహరి, జగపతిబాబు, శ్రీకాంత్, రవితేజ, అల్లరి నరేష్ మొదలైనవారు మల్టీ స్టారర్ సినిమాలకు సై అంటున్నారు.వీరిలా అందరు హీరోలు ఆలోచిస్తే ఎంతో బాగుంటుంది. కొంతకాలంపాటు హీరోలందరూ భేషజాలు పక్కనపెడితే, సూపర్ హిట్ మల్టీస్టారర్ సినిమాలు వస్తాయి. అప్పుడు మనం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, పవన్ కళ్యాణ్, జూ.ఎన్టీఆర్, ప్రభాస్, నాని, గోపీచంద్ వంటి హీరోలు ఒకరితో ఒకరు కలిసి నటిస్తే, చూసి తరిస్తాం. అప్పుడు బాక్స్ ఆఫీసులు కూడా పచ్చనోట్లతో కళకళలాడుతాయి.

రామ్‌చరణ్ పూర్తి చేస్తాడు, పదవి ఏదైనా ఓకే: చిరంజీవి

మిగిలిన తన సినీ ప్రస్థానాన్ని తన తనయుడు రామ్‌చరణ్ తేజ పూర్తి చేస్తాడని తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. కాంగ్రెసు పార్టీ ఏ పదవి ఇచ్చినా తనకు అభ్యంతరం లేదన్నారు. ఏ పదవి ఇచ్చినా స్వీకరించి పార్టీ కోసం పని చేస్తానన్నారు. తాను పదవి కోసం ఎప్పుడూ పాకులాడదేలన్నారు. తన బలం, బలహీనత రెండూ అభిమానులేనని ఆయన అన్నారు.కాగా చిరంజీవి వర్గం శాసనసభ్యులకు కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రెండు పదవులు ఇచ్చేందుకు అధిష్టానం సుముఖత వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సిఎం కిరణ్ తన ఢిల్లీ పర్యటనలో చిరు వర్గానికి మంత్రి పదవుల అంశంపై కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది.

జనవరిలో వ్యవసాయ అధ్యయన కమిటీ పర్యటన

'జిల్లాలో వ్యవసాయ రంగం నష్టం పోవడానికి కారణాలను అధ్యయనం చేసేందుకు ఏర్పాటు అయిన కేంద్ర క మిటీ జనవరిలో.. జిల్లాలో పర్యటన చేస్తుంది. ఇక్కడి వాస్తవ పరిస్థితులు, పక్కా సమాచారం సేకరించి ఆ బృం దానికి నివేదికలు ఇవ్వండి. పర్యటన లో కూడా ఎలాంటి పొరపాట్లు జరగకుండా ప్రణాళిక బద్ధంగా చేపట్టేందు కు సిద్ధం చేయాల'ని అధికారులకు రె వెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి ఆదేశించారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జనవరిలో 12 మంది సభ్యులతో కూడిన కేంద్ర బృం దం జిల్లాలో పర్యటించనుందన్నారు. జిల్లా వ్యాప్తంగా పర్యటించి సమగ్రం గా పరిశీలన జరిపి జిల్లా వ్యవసాయ అభివృద్ధి ప్రణాళికను తయారుచేస్తారన్నారు ఇందు కోసం వారికి అవసరమైన పూర్తి సమాచారాన్ని ప్రణాళిక బ ద్ధంగా రూపొందించి అమలు చేయాలన్నారు. వారికి సరైన దిశానిర్దేశం చేయాలన్నారు. రైతులు ఇబ్బందుల తెలుసుకుని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి జి ల్లాకు రెండు టీఎంసీల నీటిని కేసీకెనాల్ ద్వారా విడుదలకు ఆదేశాలు ఇ చ్చారన్నారు. సాగునీటి కోసం రైతులు ఎలాంటి ఆందోళనలకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. అన్ని ప్రాంతాలకు కచ్చితంగా సాగునీరు అందిస్తామన్నారు.