Monday, 27 February 2012

యువరాజ్‌ను కలిసిన... కుంబ్లే

ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతూ అమెరికాలో చికిత్స పొందుతున్న భారత క్రికెట్ ఆటగాడు యువరాజ్ సింగ్‌ను భారత మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే స్వయంగా పరామర్శించారు. జంబో రాకతో ఆశ్చర్యానికి గురయ్యానని.. కుంబ్లేతో కలిసిన రోజు చాలా సంతోషంగా ఉన్నానని.. ఆయన ఇచ్చిన మనోధైర్యం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని యువరాజ్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. శనివారం రోజున తనని కలువడానికి నటుడు రణ్‌విజయ్ సింగ్ వచ్చాడని.. రణ్ విజయ్‌తో అందాజ్ అప్నా అప్నా చిత్రాన్ని చూశానని ట్విట్టర్‌లో తెలిపాడు.

ఫ్యాన్స్‌కు పవన్ కళ్యాణ్ పలకరింపు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ట్విట్టర్ అకౌంట్ లేదు. మరి ఆయన తన ట్విట్టర్ అభిమానులను ఎలా పలకరించారంటే..? తన అభిమాని, హీరో నితిన్ నటించిన ‘ఇష్క్’ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రం మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఇటీవల నితిన్ పవర్ స్టార్‌ను కలిశాడట. పవర్ స్టార్‌తో తన అనుభవాలను ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు ఈ యువహీరో.ఇష్క్ సినిమా విజయవంతం కావడంపై పవర్ స్టార్ నాకు కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే నా సినిమా చూస్తానన్నారు. అదే విధంగా ట్విట్టర్ ను ఫాలో అయ్యే తన అభిమానులకు హాయ్ చెప్పమని చెప్పారు. అంటూ తన ట్విట్టర్లో వ్యాఖ్యానించారు నితిన్. ఈ విషయం ట్విట్టర్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ స్టార్ ఫ్యాన్‌కు పాకి..సర్వత్రా సచర్చనీయాంశం అయింది

కెసిఆర్ తాడిపత్రి వస్తే స్వాగతం...జెసి దివాకర్ రెడ్డి

అనంతపురం జిల్లా సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి సోమవారం జోస్యం చెప్పారు. దీనిపై జెసి స్పందించారు. టిఆర్ఎస్ పోటీ పెట్టదని చెప్పారు. ఒకవేళ అభ్యర్థిని పెట్టినా తాము స్వాగతిస్తామని చెప్పారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే సమావేశాలకు వెళ్లాలని అనిపించడం లేదని అన్నారు. కెసిఆర్ సీమాంధ్రలో ఎక్కడైనా పర్యటించవచ్చునని ఆయన అన్నారు. స్వతంత్ర భారతావనిలో ఎవరు ఎక్కడైనా తిరగవచ్చునని చెప్పారు. కెసిఆర్ సీమాంధ్రలో సభ పెట్టి మాట్లాడినా తమకు అభ్యంతరం లేదన్నారు. తాడిపత్రిలో సభ పెడతానంటే తాను అన్ని ఏర్పాట్లు చేస్తానని చెప్పారు. మైకు, స్టేజ్ అన్ని అరెంజ్ చేస్తానన్నారు. కెసిఆర్‌ను అక్కడకు ఆహ్వానిస్తానని చెప్పారు.
 

రాయలసీమ నదీ జలాల సమష్టి కృషి....వివేకానందరెడ్డి

రాయలసీమ నదీ జలాల సమగ్ర అభివృద్ధికి పార్టీలకు అతీతంగా సమష్టి కృషి చేస్తామని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. స్థానిక ఒక ప్రయివేట్ స్కూల్‌లో ఆదివారం రాయలసీమ జలాల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చా వేదిక నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాయలసీమ వెనుకబాటుతనానికి శాశ్వత పరిష్కారం కనుగొనాలంటే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌ల ద్వారా కృష్ణా నది జలాలను తరలించడం ఒక్కటే మార్గమన్నారు. దీనికి ఈ ప్రాంత నాయకుల సమన్వయంతో సాధ్యమవుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రం అల్మట్టి డ్యాం ఎత్తు పెంచడాన్ని ట్రిబ్యునల్ ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని సవాల్ చేస్తూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. పై రాష్ట్రాల వాటా పెరిగి తీవ్ర నష్టం సంభవిస్తోందని, దీంతో మిగులు జలాలను ప్రస్తుతం వినియోగించుకొనే స్వేచ్చను కోల్పోతున్నామన్నారు.

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జగన్ సిఎం...శోభా నాగి రెడ్డి

రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైయస్సార్ కాంగ్రెసు పార్టీయే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు శోభా నాగి రెడ్డి సోమవారం తిరుపతిలో అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఆమె అన్నారు. తమపై వేటు వేసి ఉప ఎన్నికలకు వెళ్లే ధైర్యం లేకే కాంగ్రెసు ప్రభుత్వంపై తమపై చర్యలు తీసుకోవడం లేదని ఆమె అన్నారు. కాంగ్రెసుకు దమ్ముంటే తమపై వేటు వేసి వెంటనే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.కేటాయించిన ఇరిగేషన్ బడ్జెట్ ను కాలవ్యవధిలో ఖర్చు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జలయజ్ఞం ప్రాజెక్టులపై తాజాగా తెచ్చిన జివోను ప్రభుత్వం రద్దు చేయాలన్నారు. ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఆలస్యమైతే పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఉద్యమిస్తుందన్నారు.

రాజకీయాలకు సూట్ కాను ....నాగార్జున

రాజకీయాలంటే ఇష్టమని చెప్పానుకాని, వస్తానని చెప్పలేదని యువసామ్రాట్ నాగార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయాలకు ఓ నమస్కారం అంటూ తను రాజకీయాల్లోకి రావడంలేదని ఆయన స్పష్టం చేశారు. తనకు రాజకీయాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అని, వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటానని చెప్పారు. మంచి రాజకీయ నాయకులు మనకు అవసరమని చెప్పారు. అయితే తాను రాజకీయాలకు సూట్ కానని నాగార్జున చెప్పారు. తాను రాజకీయాల్లోకి రానని చెప్పారు.అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. నాగార్జున త్వరలో రాజకీయాల్లోకి రానున్నారని, అందుకే ఆయన ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పారు. టాప్ హీరోల్లో చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నారు. బాలకృష్ణ కూడా 2014 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. అదే దారిలో ఇప్పుడు నాగార్జున రానున్నారని జోరుగా ప్రచారం జరిగింది. నాగార్జున మాత్రం తాను రాజకీయాల్లోకి రానని మరోసారి స్పష్టం చేసి చర్చకు తెరదించే ప్రయత్నాలు చేశారు. అసలు నాగార్జున రాజకీయాలపై కామెంట్ చేసిన రోజే తాను రానని స్పష్టం చేసినప్పటికీ ఆరంగేట్రంపై జోరుగా చర్చ జరగడం విశేషం.