Friday, 21 October 2011

వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు

వనిత కార్డుల అమ్మకాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉందని ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్(నెల్లూరు) సూర్యచంద్రరావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక టు డిపో మేనేజర్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ నెల్లూరు, ఒంగోలు, తిరుపతి రీజియన్ల పరిధిలో ఇప్పటి వరకు లక్షా 34 వేల వనిత కార్డులు అమ్మినట్లు తెలిపారు. 17వేల వనిత కార్డులు తీసుకున్న గ్రామాలకు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు చెప్పారు.

నెల్లూరు, తిరుపతి, ఒంగోలు రీజియన్ల పరిధిలో త్వరలో 40 ఇంద్ర బస్సులు నడుపుతామన్నారు. శబరిమలైలోని పంబా వద్ద ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతి రీజియన్ పరిధిలో శబరిమలకు వంద సర్వీసులు నడపుతున్నట్లు తెలిపారు. బస్సుల్లో ఇద్దరు గురుస్వాములు, ఇద్దరు బాలస్వాములు, ఒక వంటమనిషికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. శబరిమలకు బస్సులు బుక్ చేసిన వారికి ప్రోత్సాహకాలు అందజేయనున్నట్లు తెలిపారు. మూడు బస్సులు బుక్ చే స్తే రూ.250, నాలుగు బస్సులు రూ.300, ఐదుపైన బస్సులు రూ.350 చొప్పున రోజుకు ఇవ్వనున్నట్లు తెలిపారు. త్వరలో తిరుపతి రీజియన్ పరిధిలో కండక్టర్లు, డ్రైవర్ల నియమాకం చేపట్టనున్నట్లు తెలిపారు. తిరుపతి సమీపంలోని మంగళం డిపోను త్వరలో ప్రారంభిస్తామన్నారు. బి.కొత్తకోట డిపోకు స్థలం ఇస్తే తిరిగి పునః ప్రారంభిస్తామన్నారు

No comments:

Post a Comment