తన బరువు బాధ్యతల మీద సంపూర్ణ అవగా హన కలిగిన వ్యక్తి ధోనీ. ఏ
కెప్టెన్కైనా కష్టనిష్ఠూ రాలు సహజం. ఆడినా ఆడలేక పోయినా వికెట్లు తీయ
లేకపోయిన సహచరులను పల్లెత్తుమాట అనకుండా తనకు కావాల్సింది ఇతరుల నుంచి
రాబట్టుకోగల నేర్పరి ధోనీ. ఓటమి ఎదురవుతున్న స్థితిలోనూ మహీ నిరాశకులోనైన
సందర్భం ఒక్కటీ నేను చూడలేదు. సంయమనంతో వ్యవహరిం చడమనేది ధోనీకి ఉన్న గొప్ప
లక్షణం.అన్ని విభా గాల్లోనూ ఆటగాళ్లను సక్రమంగా వినియో
గించుకోగలిగాడు. వికెట్ కీపర్, బ్యాట్స్మన్, కెప్టెన్ అవతారాల్లో ధోనీ
మీద ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఊహించండి. ధోనీయే అత్యుత్తమ
కెప్టెననేది నా అభిప్రాయం అని అంశు మన్ గైక్వాడ్ అభిప్రాయపడ్డాడు. భారత్
వరుస పరాజయాలకు ఒక్క ధోనీనే నిందించడం తగదు. కానీ ఓటమికి జట్టుతో సహా
జవాబుదారీగా నిలవాలని అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించాడు.ఆస్టేలియా టెస్టు సిరిస్లలో టీమిండియా ఓటిమికి భాద్యత వహిస్తూ తాను తన
కెప్టెన్సీని వదులు కోవడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు.ఇంగ్లాండ్, ఆస్టేలియాలలో ఘోర పరాజయాలను మూటగట్టుకున్నందుకు టీమిండియా జట్టు
కెప్టెన్గా తాను భాద్యతను వహిస్తున్నానని మహేంద్ర సింగ్ ధోని ఓ ప్రముఖ
టివి ఛానల్కు ఇచ్చిన ఇంటర్యూలో మాట్లాడారు. ఇంగ్లాండ్, అంతేకాకుండా
ఆస్టేలియా మీడియా ముందు ధోని కెప్టెన్సీ అనేది నేను అదనపు బాధ్యతగా
భావించడం లేదు. సెలక్టర్స్ నన్ను కెప్టెన్సీ నుండి తోలగించినా నేను ఆనందంగా
ఆ బాధ్యతల నుండి వైదోలగడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు.
టీమిండియా కెప్టెన్గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్ని అందించిన అత్యత్తుమ కెప్టెన్గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్ల టెస్టు సిరిస్లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.
టీమిండియా కెప్టెన్గా ధోనీ 2007వ సంవత్సరంలో బాధ్యతలను స్వీకరించాడు. తాను కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత టీమిండియా ఎన్నో విజయాలను సొంతం చేసుకుంది. 28 సంవత్సరాలుగా కళ్లు కాయలు కాచేలా వేచిచూసిన ప్రపంచ కప్ని అందించిన అత్యత్తుమ కెప్టెన్గా ధోనీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. ధోనీ క్రికెట్ ట్రాక్ రికార్డుని గనుక పరిశీలిస్తే 67 టెస్టులాడి, మొత్తం 3509 పరుగులు చేశాడు.
ఐతే ఇంగ్లాండ్, ఆస్టేలియా వరుస ఓటముల తర్వాత ధోనీ కెప్టెన్సీపై చర్చనీయాంశం అయింది. ఇటీవల ఆస్టేలియా క్రికెటర్ ఇయాన్ ఛాపెల్ మాట్లాడుతూ టీమిండియా కొత్త కెప్టెన్ని వెతకాల్సిన సందర్బం వచ్చిందని పేర్కోన్నడమే కాకుండా.. ధోనీ టెస్టు క్రికెట్కి మరిన్ని రోజులు సమాధానం చెప్పలేడని తేలికగా కొట్టి పారేశాడు. ధోనీని విదేశంలో జరిగిన ఈ రెండు టూర్స్లలో గమనించినట్లేతే బ్యాటింగే కాదు.. కీపింగ్లో కూడా ఏమంత ప్రతిభను కనబర్చలేదు. 2011లో జరిగిన ఇంగ్లాండ్ నాలుగు మ్యాచ్ల టెస్టు సిరిస్లో ధోనీ కేవలం 220 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజి చూస్తే 31.40గా నమోదైంది. ఇక ఆస్టేలియా టెస్టు సిరిస్లో కూడా ఆడిన మూడు టెస్టు మ్యాచ్లలో కేవలం 102 పరుగులు చేసి 20.40 యావరేజిని నమోదు చేశాడు. పెర్త్లో జరిగిన మూడవ టెస్టులో స్లో ఓవర్ రేట్ కారణంగా అడిలైడ్ టెస్టుకి ధోనిని నిషేధించిన సంగతి తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇండియన్ క్రికెట్ మాజీలు ధోనిని సమర్దిస్తున్నారు. నా వరకు ఇప్పటికీ ధోనీయే అత్యుత్తమ కెప్టెన్ అని కపిల్ దేవ్ అన్నాడు. నాలుగు సంవత్స రాల్లో కెప్టెన్గా ధోనీ రాణించిన విధానం అద్భు తం. 'ఇది గెలువు' అని అడిగిన ప్రతిదీ గెలిపించి పెట్టాడు. పరిమితులకు లోబ డే గెలుపును సాధించాడు. ఇప్పుడు కూడా అదే పరిమితులను గుర్తించి ధోనీ విషయంలో నిర్ణయం తీసుకుంటే జట్టుకు మేలు జరుగుతుందని కిరణ్ మోరే అన్నాడు.


