చంద్రబాబు వైయస్ను విమర్శిస్తుంటే అధికార పక్షం మాట్లాడక పోవడం బాధాకరమని, వైయస్ నిరంతరం కృషి చేసి కాంగ్రెసును అధికారంలోకి తీసుకు వచ్చారన్నారు. వైయస్ అసెంబ్లీలో మాట్లాడుతుంటే తాను టీవీల్లో చూసేదాన్నని ఆవేదనగా చెప్పారు. ఇది చాలా దురదృష్టకరమైన రోజని అన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టినా మద్దతిస్తామన్న జగన్ మాట ప్రకారమే టిడిపికి అండగా నిలబడుతున్నామన్నారు. అవిశ్వాసం ఎవరు పెట్టారన్నది తమకు ముఖ్యం కాదన్నారు. రైతులకు ప్రభుత్వం ఏమీ చేయలేక పోతోందని విమర్శించారు. వైయస్ ఉన్నప్పుడు రైతులకు భరోసా ఉండేదని కాని ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదన్నారు. వైయస్ మృతిని తట్టుకోలేక చనిపోయిన వారిని ప్రభుత్వం ఇప్పటి వరకు పరామర్శించిందా అన్నారు. వైయస్ కాంగ్రెసును రెండు సార్లు గెలిపించారని కానీ ఆయన మృతి తర్వాత కాంగ్రెసు ఆయనకు ఏం బహుమతి ఇచ్చిందని ప్రశ్నించారు.అధికార, ప్రతిపక్ష పార్టీలు ఓ వర్గం మీడియాతో కలిసి వైయస్పై కుట్ర చేస్తున్నాయన్నారు. జగన్కు కాంగ్రెసు పొమ్మన లేక పొగపెట్టిందన్నారు. అధికారం కోసమే తాము ప్రయత్నించినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. తమను బయటకు పంపడమే కాంగ్రెసు వైయస్కు ఇచ్చిన బహుమతా? అని ప్రశ్నించారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలను ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తుందని విమర్శించారు. టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు కుమ్మక్కైందని ఎవరు విమర్శలు చేసినప్పటికీ వైయస్ ఆశయాలు నీరుగారుస్తున్న కాంగ్రెసు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైయస్ను అభిమానించే ఎమ్మెల్యేలు ఓటు వేయాలని సూచించారు
Monday, 5 December 2011
ఈ రోజు దురదృష్టకరమైన రోజు....వైఎస్ విజయమ్మ
మహానేత తెచ్చిన ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం బాధాకరమని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ అన్నారు. ఈ రోజు దురదృష్టకరమైన రోజు అని అవిశ్వాస తీర్మాన చర్చలో మాట్లాడుతూ ైవె ఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్ విజయమ్మ తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనంతగా.. లక్షలాది ఎకరాల్లో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారన్నారు. రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ను అందిస్తామని మహానేత వైఎస్ఆర్ ప్రజలకు వాగ్దానం చేశారని.. ప్రస్తుత ప్రభుత్వం మహానేత వాగ్ధానాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే కాంగ్రెస్ అనే స్థితికి పార్టీని తీసుకువచ్చారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆయనకు బహుమతి ఏమిచ్చిందని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పేరును సీబీఐ రిపోర్ట్లో పెట్టి ఆయనకు బహుమానంగా ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ప్రస్తుత ప్రభుత్వం రైతుల సమస్యల్ని, ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదని విజయమ్మ అన్నారు. వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్న విషయాన్ని విజయమ్మ ప్రస్తావించారు. 108, 104, ఇందిరమ్మ ఇళ్లు పథకాల్ని సరిగా అమలు చేయలేకపోవడాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీ కలువకముందే చంద్రబాబు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి ఉంటే ఈ ప్రభుత్వం ఏనాడో పడిపోయి ఉండేదని విజయమ్మ అన్నారు.
వైఎస్ విజయమ్మ వెంట 19 మంది ఎమ్మెలు
కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో జరుగుతున్న అవిశ్వాస తీర్మానం సందర్బంగా ఆమె సభకు హాజరయ్యారు. ఆమె వెంట జగన్ వర్గం ఎమ్మెలు 19 మంది సభకు చేరుకున్నారు. మహిళా ఎమ్మెల్యేలు సుచరిత, కొండ సురేఖ దగ్గరుండి వైఎస్ విజయమ్మను సభలోకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు జోహార్ వైఎస్ఆర్ అంటూ నినాదాలు చేశారు.
ప్రభుత్వం తమ పార్టీ ఎమ్మెల్యే లను బెదిరిస్తుందని, అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని డబ్బును, పదవుల్ని ఎమ్మెల్యేలకు ప్రభుత్వం ఎరగా చూపుతుందని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు
పులివెందుల రోగులకు శిక్ష
అక్కడ నర్సులే డాక్టర్లు. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యం చేస్తారు. దంత
వైద్యులు సాధారణ వైద్యుల అవతారం ఎత్తుతారు. ఉన్న ఒకే ఒక సూపరింటెండెంట్
పరిపాలనా బాధ్యతలతో వైద్యం చేయలేని పరిస్థితి. ఇక మందుల సంగతి
చెప్పక్కరలేదు. అనేక వ్యాధులకు మందులు బయట కొనుక్కోవాల్సిందే...ఇదీ
పులివెందుల ఏరియా ఆస్పత్రి దుస్థితి. 15 మంది వైద్యులు ఉండాల్సిన చోట
ఇద్దరే ఇద్దరున్నారు. వారిలో ఒకరు సర్జన్. మరొకరేమో దంత వైద్యుడు.
ఆస్పత్రులలో అన్ని మందులూ ఉన్నాయని మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి
చెప్పే మాటలకూ అక్కడి పరిస్థితికీ పూర్తి విరుద్ధం. దివంగత మహానేత డాక్టర్
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం ప్రభుత్వ పెద్దలు దీని గురించి
పట్టించుకోవడమే మానేశారు. రాజకీయ కక్షతో వైద్య శాఖ మంత్రి డాక్టర్ డీఎల్
రవీంద్రారెడ్డి అక్కడ వైద్యులను నియమించేందుకు కృషి చేయడం లేదు.ఓట్లు వేయలేదనే కోపంతో..సాధారణంగా నేతలు రాజకీయ కక్షలు పెట్టుకున్నా...ప్రజల నుంచి వ్యతిరేకత
ఎదురవకుండా ఉండేందుకు వారికి ఇబ్బంది కలగకుండా చూస్తారు. మంత్రి డాక్టర్
డీఎల్ రవీంద్రారెడ్డి మాత్రం అలా కాదు.. మొన్నటి ఉప ఎన్నికల్లో ప్రజలు
డిపాజిట్ దక్కనీయకుండా ఓడించడంతో, వారిపై ‘కసి’ పెంచుకున్నారు. దీనికి తోడు
ఆయనపై భారీ మెజార్టీతో ఎంపీగా గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అధ్యక్షుడు, యువనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత ఊరు పులివెందుల.
అందుకేనేమో మంత్రి డీఎల్ మరింత రాజకీయ కక్ష పెంచుకుని అక్కడి ఆస్పత్రిలో
సేవలు మెరుగు పరిచే విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ప్రజలను ఇబ్బందుల
పాలు చేస్తున్నారు. వైద్యులను నియమించకపోవడంతో రోగులకు నర్సులే
దిక్కవుతున్నారు. ఆయుర్వేద, దంత వైద్యులు జనరల్ డ్యూటీ డాక్టర్లుగా
మారిపోయారు
సినిమా అనేది గ్లామర్...ముద్దుగుమ్మ త్రిష
ప్రలోభాలకు లొంగేది లేదు....ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి
అవిశ్వాసంపై లగడపాటి జోస్యం
తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానంపై విజయవాడ పార్లమెంటు
సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సోమవారం జోస్యం చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి
ప్రభుత్వానికి 171 మంది ఎమ్మెల్యేల ఓట్లు వస్తాయని చెప్పారు. టిడిపి
పెట్టిన అవిశ్వాసం వీగిపోతుందన్నారు. టిడిపి చీఫ్ నారా చంద్రబాబు నాయుడు తన
హయాంలో రైతులకు ఏం చేశారని ప్రశ్నించారు. కాంగ్రెసు ప్రభుత్వం రైతులకు
ఎంతో చేస్తుందన్నారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు
నాయుడు రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఏఐసిసి అధికార ప్రతినిధి
రేణుకా చౌదరి విమర్శించారు. టిడిపి పెట్టిన అవిశ్వాసాన్ని తాము
స్వాగతిస్తున్నామని చెప్పారు. మా బలాన్ని మేం నిరూపించుకుంటామన్నారు.
కార్యకర్తల అభిప్రాయం మేరకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్
జగన్ ఎమ్మెల్యేలు తిరిగి వస్తున్నారన్నారు
అద్దె గర్భం ద్వారా...తండ్రయిన అమీర్ ఖాన్
వైఎస్ జగన్,వైఎస్ విజయమ్మ....ఓట్లు వేస్తారా?
Subscribe to:
Posts (Atom)