
ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రేక్షకులు, సత్యసాయి భక్తులు మెచ్చే విధంగా
‘బాబా-సత్యసాయి’ చిత్రం వుంటుందని ఆ చిత్రదర్శకులు కోడిరామకృష్ణ తెలిపారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న అనంతరం బాబా బాల్యజీవిత
విశేషాలను, సేవాకార్యక్రమాలకు కేంద్రబిందువైన పుట్టపర్తిలో చిత్రీకరణకు
అనుమతి కోరే విషయంపై ట్రస్టువర్గాలతో చర్చించారు. ఐటిభవన్ చేరుకున్న
కోడిరామకృష్ణ సత్యసాయి సెంట్రల్ ట్రస్టు కార్యదర్శి ప్రసాద్రావు,
ట్రస్టుసభ్యులు ఆర్జె రత్నాకర్, ఎస్వి గిరిలతో ప్రత్యేకంగా సమావేశమై
చర్చించారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని సూపర్స్పెషాలిటి హాస్పిటల్,
యూనివర్శిటీ భవనం, సత్యసాయి మాతృమూర్తుల సమాధులు, ప్రశాంతినిలయంలోని కొన్ని
ప్రాంతాల్లో చిత్రీకరణకు అనుమతి ఇవ్వాలని ట్రస్టుసభ్యులను అభ్యర్థించారు.
ఇందుపై ట్రస్టుసభ్యులు మాట్లాడుతూ సత్యసాయి జయంతి వేడుకల తదుపరి
చిత్రీకరణకు ట్రస్టుపరంగా అన్ని సహకారాలు అందిస్తామని రత్నాకర్ హాబఈ
ఇచ్చారు. ప్రధానంగా వీరి సంభాషణలో బాబా-సత్యసాయి చిత్రం దేశీయంగానూ,
అంతర్జాతీయంగానూ ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం వుందని, అందువల్ల
దేశీయంగా వివిధ రాష్ట్రాల్లో నటీనటులను పాత్రకు తగినట్టుగా ఎంపిక
చేశామన్నారు. కృత్రిమంగా కూడా సహజపాత్రకు అనుగుణంగా సరిపోయే నటీనటులను
ఎంపిక చేశామని ఆర్జె రత్నాకర్ వద్ద కోడిరామకృష్ణ వెల్లడించారు. అనంతరం ఆయన
విలేఖరులతో మాట్లాడుతూ బాబా పర్యటించిన ప్రాంతాలు వైట్ఫీల్డ్,
కొడైకెనాల్తో పాటు సాయికుల్వంత్ సభామండపం తదితర సెట్టింగులను
హైదరాబాద్లోనే ఏర్పాటు చేసి సినిమా తీస్తున్నామన్నారు. చిత్రంలో పది పాటలు
వుంటాయని, సంగీతం ఇళయరాజా నిర్వహిస్తున్నారన్నారు. ఈ నెల 17న ముంబైలో పాటల
మిక్సింగ్ కార్యక్రమం చేపడతామన్నారు. బాబా ఆధ్యాత్మిక బోధనలు, మానవాళికి
అందించిన సేవలు చిత్రంలో వుంటాయన్నారు. ఏప్రిల్ మాసానికి చిత్రనిర్మాణం
పూర్తి చేసి మేలో విడుదల చేసేందుకు అవకాశం వుందని ఆయన వెల్లడించారు. బాబాను
స్ఫూర్తిగా తీసుకొని సేవాభావాన్ని అలవరుచుకుంటే ప్రపంచంలో భారత్
మొదటిస్థానంలో నిలుస్తుందన్నారు. బాబా స్నేహితులతో పాటు దేశ, విదేశీభక్తులు
కూడా ఈ చిత్రంలో కనిపిస్తారని, ఇప్పటికే కొంతభాగం షూటింగ్ జరిపామని,
సత్యసాయిట్రస్టువారి సహకారంతో పుట్టపర్తిలో అవసరమైన ప్రాంతాల్లో చిత్రీకరణ
చేస్తామన్నారు. అయితే నటీనటుల పేర్లు తెలపడానికి నిరాకరించారు. బాబా
జీవితవిశేషాలు చిత్రంలో నిక్షిప్తమై వుంటాయన్నారు.