Friday, 2 December 2011
విజయ పాలు డైరీకి ముప్పు..
రైతు సమస్యలపై అనంతపురం జిల్లా బంద్, ర్యాలీలు సంపూర్ణం
వర్షాభావ పరిస్థిితుల కారణంగా పంట నష్టపోయిన రైతు లను ఆదుకోవాలని డిమాండు
చేస్తూ శుక్రవారం విపక్షాలు అనంతపురం జిల్లా బంద్ నిర్వహించాయి. ఈ ఏడాది
సకాలంలో వర్షాలు కురవకపోవడంతో రైతన్నలు పెద్ద ఎత్తున పంట నష్టపోయారు.
దీంతో జిల్లాలోని అన్ని మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రభుత్వం ప్రకటించినా
ఎలాంటి సహాయ కార్యక్రమాలు నిర్వహించలేదు.ఈ పరిస్థితుల్లో జిల్లాకు
ప్రత్యేక ప్యాకేజి ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం, సీపీఐ,
సీపీఎంలతోపాటు ఇతర ప్రజా సంఘాలు శుక్రవారం జిల్లా బంద్ నిర్వహించాయి. అన్ని
నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో ఆయా పార్టీల నేతలు ఉదయం నుంచే రోడ్లపైకి
వచ్చి వాహనాల రాకపోకలను నిలిపివేయించారు.అనేకచోట్ల ర్యాలీలు
నిర్వహించారు. దుకాణాలను బంద్ చేయించారు. ఉదయం 6 గంటలకే ఆర్టీసీ డిపో
వద్దకు వెళ్లి బస్సులు కదల కుండా అడ్డుకున్నారు. బస్సులు డిపోలోనే
నిలిచిపోవడంతో విధులకు వెళ్లే ఉద్యోగులు, ప్రయాణికులు అనేక ఇబ్బందులు
ఎదుర్కొన్నారు. బంద్ కారణంగా బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించాయి.
ఏ పత్రమైనా 15 నిమిషాలే
రాష్ట్ర ప్రభుత్వం ఇక రెవెన్యూ విభా గం సేవలను మీ-సేవ పేరుతో కేవ లం 15 నిమిషాలలో అందించేందుకు సిద్ధమైంది. రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శా ఖల ద్వారా వచె,్చ ఏదాది నాటికి 50 రకాల సేవలను అందించాలన్నది ల క్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. నవంబర్ 4న ఆధికారికంగా తిరుపతి లో లాంఛనంగా ప్రారంభించిన ము ఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పాలన లో తనదైన ముద్ర వేసుకునేందుకు తెరపైకి తెచ్చి ప్రజలకు శ్రమ లేకుం డా సేవలందించేందుకు కసరత్తు మొ దలు పెట్టారు. ఈ క్రమంలో ప్రజలు అధికారులపై ఆధారపడి పరిష్కారమయ్యే వి«ధానానికి స్వస్తి పలికి మీసేవలు ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించి వివిధ «ద్రువీకర ణ పత్రాలు పొందడంలో ఎలాంటి జాప్యం జరగకుండా, మామూళ్ళ వ్యవస్థకు అడ్డుకట్టవేసేందుకు ఈ పద్ధతిని తెచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.తక్షణం పని లేదంటే టోల్ఫ్రీకి ఫిర్యాదు: మీ-సేవా సేంటర్ల ద్వారా తక్షణం ప్రజలకు సేవలు అందాలి లేని పక్షం లో టోల్ఫ్రినెంబర్1100 కు ఫిర్యాదు చేస్తే అక్కడి కక్కడే పరిష్కారం జరగనుంది. ప్రస్తుతం తహసీల్దార్ కార్యలయాల్లో అ«ధికారులు పని ఒత్తిడి వల్ల అవసరమైన పత్రాలను సమయానికి ఇవ్వకపోవడంతో జాప్యం జరుగుతోంది. అడంగల్ కావాలన్న, ఆర్వోఆర్ కావాలన్న చివరికి జనన, మరణ కుల ధృవీకరణ పత్రాలు కావాలన్నా అధికారులు అందుబాటులో లేకపోవడం వల్ల ఆలస్యమవుతోంది. మీసే వా కేంద్రాల ద్వారా ఎవరితో అవస రం లేకుండా తక్షణం కోరిన వారికి వాటిని జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం మీ-సేవల ధృవీకర ణ పత్రాలను ఇకపై 15 నిమిషాల్లోపే ఇవ్వనున్నారు. ఈ మీ-సేవలను అ మలు చేసేందుకు పౌర హక్కుల చట్టం తీసుకురానున్నారు.భూ వివాదాలకు చరమగీతం .. ఇంతకు ముందు గతంలో రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు ఆదాయం వస్తుం దా లేదా అని చూస్తూ ఒకే సర్వే నెం బర్ భూమిపై రెండు మూడు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. దీంతో భూ వివాదాలు అధికమయ్యాయి. ఈ విధానం అమలులోకి వస్తే ఇలాంటి వాటికి చెక్ పడే అవకాశం ఉంది. లిం క్ డాక్యుమెంట్లను పరిశీలించి భూ మిని కూడా సరిచూసుకొని ఈ మీ-సేవ కేంద్రాల్లో ఇచ్చే ధృవీకరణ పత్రాలకు నకిలీ సృష్టించే వీలు లేదు.
రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ లో కనిపించని రేణుదేశాయ్
‘శ్రీరామ రాజ్యం’ సినిమాపై పవన్ ప్రశంసల జల్లు
వైయస్ విజయమ్మ ఇక ఎమ్మెల్యే కాదు !! ?
తీర్పు: ఇల్లు ఖాళీచేసిన లక్ష్మీ పార్వతి
Subscribe to:
Posts (Atom)