Friday, 21 October 2011

రక్షణశాఖల ఆధ్వర్యంలో యుద్ధ ట్యాంకుల సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు

 ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత మండ లం కలికిరి సమీపంలో కేంద్ర హోం, రక్షణశాఖల ఆధ్వర్యంలో యుద్ధ ట్యాంకుల సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటుకు అధికారులు స్థలాన్ని పరిశీలించారు. గురువారం కలికిరి పంచాయతీ కె. కొత్తపల్లి సమీపంలో ఎద్దలకొండ పరిసరాలను డిఫెన్స్ అధికారులు గిరిధరన్, లోకనాథం పరిశీలించారు.

మదనపల్లె ఆర్డీవో వినయ్‌చంద్ ఆధ్వర్యంలో కె.రెడ్డివారిపల్లె పంచాయతీలోని సర్వే నెంబర్ 1066, కలికిరి పంచాయతీలోని 1051, 1043 సర్వే నెంబర్లలోని 500 ఎకరాల విస్తీర్ణం కల్గిన ప్రభుత్వ, ప్రయివేటు భూములను పరిశీలించారు. సామర్థ్య పరీక్షా కేంద్రానికి ఈ ప్రాంతం అనుకూలంగా ఉంటుందనే అభిప్రాయాన్ని రక్షణశాఖ బృందం వ్యక్తం చేసింది. ప్రస్తుతం దేశానికి అవసరమైన యుద్ధ ట్యాంకులను చెన్నై సమీపంలో తయారు చేస్తున్నారు. అనంతరం రాజస్తాన్‌లో వీటి సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నట్టు అధికారులు తెలిపారు. సామర్థ్య పరీక్షా కేంద్రం ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు

No comments:

Post a Comment