Saturday, 5 November 2011

క్రికెట్ కి దేవుడయ్యాడు సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్లో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వ్యక్తి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వం ఆయన సొంతం. అందుకే కాబొలు క్రికెట్ కి దేవుడయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో 20 సంవత్సరాలు కెరియర్‌ని ముగిసినప్పటికీ సీనియర్లు పాఠాలు తనని ఎంతగానో ప్రోత్సహించాయని ఇటీవల 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ అలా ఒకసారి గుర్తు చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ ఇప్పటి వరకు తన క్రికెట్ జీవితంలో మొత్తం 33 రంజీ మ్యాచ్‌లలో పాల్గోనడం జరిగింది.

                                  
ఈ సందర్బంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ భారత్‌లో ఏ క్రికెటర్‌కైనా రంజీ ట్రోఫీ అతి ముఖ్యమైన టోర్నీ అని అన్నాడు. 2000 సంవత్సరంలో తాను ఆడిన సెమీఫైనల్ మ్యాచ్ గురించి చెబుతూ, ‘484 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మేం విజయానికి దగ్గరగా వచ్చాం. ఇంకా 42 పరుగులు చేయాలి. చేతిలో రెండు వికెట్లు మాత్ర మే ఉన్నాయి. ఆ 42 పరుగుల్నీ నేనే చేశాను. పది, పదకొండో స్థానాల్లో వచ్చిన ఆటగాళ్లు ఖాతానే తెరవలేదు. విచిత్రమేమంటే వీరిద్దరు ఒక్క పరుగు కూడా చేయలేదని నాకు ఆట అయిపోయేంత వరకు తెలియదు. రంజీ మ్యాచ్‌లలో ఇది నాకు ఇష్టమైన సంఘటన’ అని అన్నారు. ఈ మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ (234 బంతుల్లో 233, ఆరు సిక్స్‌లు, 21 ఫోర్లు) సాధించాడు.
ఇప్పుడు ఇక్కడ నేను రంజీ మ్యాచ్ ల గురించి ప్రస్తావించడానికి కారణం.. రంజీల్లో ఆడటం వల్ల సీనియర్ ఆటగాళ్లతో సాన్నిహిత్యం పెరుగుతుందని... తద్వారా వారి అనుభవాలు ఎంతో ఉపయోగపడతాయని సచిన్ తెలిపారు. ‘నేను రంజీలు ఆడే రోజుల్లో ఏడెనిమింది టెస్టు ఆటగాళ్లు మాజట్టులో ఉండేవారు. వెంగ్‌సర్కార్, రవిశాస్త్రి, మంజ్రేకర్, చంద్రకాంత్ పండిట్... వీరందరితో ఆడే అవకాశం నాకు లభించింది. అప్పటికి నా వయసు 15 ఏళ్లే’ అని సచిన్ తన అనుభవాలను నెమర వేసుకున్నాడు

కడప జిల్లా ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది

                                         
ముస్లీంలు పవిత్రంగా నిర్వహించుకునే బక్రీద్‌ పండుగ దగ్గర పడటంతో ఏర్పాట్లను జోరుగా చేస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా రాజస్థానం నుంచి ఒంటెలను ప్రత్యేకంగా తెప్పించారు. వివిధప్రాంతాలనుంచి తెప్పించిన వందలాది ఒంటెలు కడప జిల్లా రాయచోటికి చేరుకున్నాయి. ముస్లీంలు జరుపుకునే బక్రీద్ పర్వదినం సందర్భంగా రాజస్థాన్ నుంచి ఒంటెలను కొనుగోలు చేస్తున్నారు. కడప జిల్లా రాయచోటిలో పాతికేళ్లనుంచి ఒంటెల వ్యాపారం జోరుగా సాగుతుంది. బక్రీద్ పండుగ నెలముందునుంచే ఈ వ్యాపారం జోరందుకుంటోంది. ఇందుకోసం రాజస్థాన్‌నుంచి సుమారు 6వందల ఒంటెలను ఇక్కడికి తీసుకొచ్చారు. ఈ ఒంటెలను కొనేందుకుమన రాష్ట్రంవాల్లేకాకుండా తమిళనాడు,కేరళనుంచి వ్యాపారులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో ఆందోళన

రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్‌లో మెయింటెనెన్స్ ఉద్యోగాల భర్తీలో సిఇ కుమార్‌బాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి జెన్‌కో నుంచి ఆదేశాలు వచ్చినా జాబితా ప్రకటించడం లేదన్నారు. ఈ మేరకు వారు సిఈ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల జాబితాను తనవద్దే ఉంచుకుని తనకు అనుకూలురైన వారికి మాత్రమే నియమిస్తున్నారని వారు ఆరోపించారు