ఒకవైపు శివరాత్రి వేడుకలు, మరోవైపు పల్స్పోలియో
కార్యక్రమం... అదే సమయంలో
ఈనెల 19న వీఆర్వో, వీఆర్ఏ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు.
క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో పొరపాట్లకు
తావులేకుండా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. 58 వీఆర్వో
పోస్టులకు 59,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా
వ్యాప్తంగా 14 పట్టణాల్లో 219 సెంటర్లు ఏర్పాటయ్యాయి. వీఆర్ఏ రాత పరీక్ష
కోసం 5,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. కర్నూలులో మాత్రమే 16
సెంటర్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులో 55020 మంది అభ్యరులు పరీక్షలు
రాయనున్నారు. 15 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు వీఆర్వో పరీక్ష ఉదయం
10 నుంచి 12 గంటల వరకు,
వీఆర్ఏ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు.పరీక్షా
కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును
ఏర్పాటు చేస్తున్నారు.మరో రెండురోజుల్లో జరగనున్న గ్రా మ రెవెన్యూ
అధికారులు వీఆర్వో, గ్రామ
రెవె న్యూ సహాయకుల వీఆర్ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షకు సంబంధించి ప్రశ్న
పత్రా లు జిల్లా కేంద్రానికి చేరాయి. గట్టి పోలీసు బందోబస్తు మధ్య రాష్ట్ర
రాజధాని నుంచి ప్రశ్నపత్రాలు బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో సీల్డ్
ట్రంకు పెట్టెలు, సీల్డ్ బాక్సులను జిల్లా హుజూరు కార్యాలయంలోని స్ట్రాంగ్
రూంలో
భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. 19న ఉదయం 6
గంటలకు ప్రశ్న పత్రాలను జిల్లాలోని పరీ క్షా కేంద్రాలకు పోలీసు బందోబస్తు
తరలిం చనున్నారు.ఇందుకు తగిన విధంగా కేంద్రాల్లో సీటింగ్ అరెంజ్మెంట్లు
చేస్తున్నారు. సెంటర్ల వారీగా పరీక్షా కేంద్రాలు, అక్కడ పరీక్షలు రాసే
అభ్యర్థుల
సంఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. .
.
.