Friday, 17 February 2012

రాలయసీమ జిల్లాలో వీఆర్వో,వీఆర్ఏ పరీక్షా కేంద్రాలు సెంటర్ల వారీగా ఏర్పాటు

ఒకవైపు శివరాత్రి వేడుకలు, మరోవైపు పల్స్‌పోలియో కార్యక్రమం... అదే సమయంలో ఈనెల 19న వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహిస్తున్నారు. క్లిష్టమైన పరిస్థితుల్లో పరీక్ష నిర్వహించాల్సి ఉండటంతో పొరపాట్లకు తావులేకుండా అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లలో నిమగ్నమైంది. 58 వీఆర్వో పోస్టులకు 59,592 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 14 పట్టణాల్లో 219 సెంటర్లు ఏర్పాటయ్యాయి. వీఆర్‌ఏ రాత పరీక్ష కోసం 5,115 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. కర్నూలులో మాత్రమే 16 సెంటర్లు ఏర్పాటు చేశారు.చిత్తూరులో 55020 మంది అభ్యరులు పరీక్షలు రాయనున్నారు. 15 కేంద్రాలు అధికారులు ఏర్పాటు చేశారు వీఆర్వో పరీక్ష ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, వీఆర్‌ఏ పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నిర్వహించనున్నారు.పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించడంతోపాటు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.మరో రెండురోజుల్లో జరగనున్న గ్రా మ రెవెన్యూ అధికారులు వీఆర్వో, గ్రామ రెవె న్యూ సహాయకుల వీఆర్ఏ పోస్టుల భర్తీ రాత పరీక్షకు సంబంధించి ప్రశ్న పత్రా లు జిల్లా కేంద్రానికి చేరాయి. గట్టి పోలీసు బందోబస్తు మధ్య రాష్ట్ర రాజధాని నుంచి ప్రశ్నపత్రాలు బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో  సీల్డ్ ట్రంకు పెట్టెలు,  సీల్డ్ బాక్సులను జిల్లా హుజూరు కార్యాలయంలోని స్ట్రాంగ్ రూంలో భద్రపరిచారు. స్ట్రాంగ్ రూం వద్ద పోలీసు పహారాను ఏర్పాటు చేశారు. 19న ఉదయం 6 గంటలకు ప్రశ్న పత్రాలను జిల్లాలోని పరీ క్షా కేంద్రాలకు పోలీసు బందోబస్తు తరలిం చనున్నారు.ఇందుకు తగిన విధంగా కేంద్రాల్లో సీటింగ్ అరెంజ్‌మెంట్లు చేస్తున్నారు. సెంటర్ల వారీగా పరీక్షా కేంద్రాలు, అక్కడ పరీక్షలు రాసే అభ్యర్థుల సంఖ్య వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. .
.

గోవిందుని ఆంతర్యాలు పై టిటిడి ఉద్యోగులకు శిక్షణ

టిటిడి ఉద్యోగులకు ‘గోవిందుని ఆంతర్యాలు’ అనే అంశంపై శే్వతలో ఆ సంస్థ సంచాలకులు డాక్టర్ కెవి రామకృష్ణ  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్నకాలంలో భక్తుల మనోభావాలకు అనుగుణంగా టిటిడి ఉద్యోగులు వారి విధుల్లో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ ‘గోవిందుని ఆంతర్యాలు ’అనే కోర్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గత యేడాది కాలంలో ఎన్నో కోర్సులను శే్వతాలో ప్రవేశపెట్టామన్నారు. ప్రత్యేక వృత్తికోర్సులనే కాకుండా జనరల్ ప్రోగ్రామ్స్, ఆలయ యాజమాన్యం, శాస్ర్తియ పరివర్తన, ఆరోగ్యం, యోగాథెరపి, పాలనా యాజమాన్యం, వక్తిత్వ వికాసం, క్రమశిక్షణ తదితర అనేక అంశాలపై తాము ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగుల ప్రవర్తనపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపధ్యంలో ఈ కొత్త కోర్సు ప్రవేశపెట్టామన్నారు. ఇందులో ఉద్యోగుల ప్రవర్తనా లోపంపై మరింత స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతున్నట్లు తెలిపారు. ఈకోర్సు ద్వారా సప్తగిరి విశిష్టత, శ్రీవారి గర్భాలయంలోని మూల మూర్తి, పరివారదేవతలు, వెంకటేశ్వరుని మహాత్మ్యం, శ్రీవారి ఆలయ ఆచార వ్యవహారాలు, స్థానిక ఆలయాలు, ఆలయ చరిత్ర, ఆలయ ఆచార సాంప్రదాయాలు, శిల్పశోభ, కల్యాణోత్సవం, ఆలయ నియమాలు, శ్రీవారి సేవలో కళాకారులు, సాంప్రదాయాలు కట్టుబాట్లు, నిత్యార్చన, ఆగమ సాంప్రదాయం లాంటి అనేక అంశాలంటాయన్నారు. త్వరలో వ్యవహారికంగా తిరుమలలో వాడుకభాష అయిన తెలుగు, తమిళం, కన్నడ, ఆంగ్లం, హిందీ భాషల్లో మాట్లాడే విధంగా ఉద్యోగులకు తర్ఫీదు ఇచ్చే విధానాన్ని త్వరలో పునఃప్రారంభించనున్నట్లు తెలిపారు.

రూ. 1,45,854 కోట్లతో రాష్ట్ర బడ్జెట్


ఆర్థికమంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి 1,45,854 కోట్లతో 2012-13 సంవత్సరపు వార్షిక బడ్జెట్ ను శుక్రవారం రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టారు. ద్రవ్యలోటును రూ. 20,008 కోట్లుగా, రెవెన్యూ మిగులును రూ. 4,444 కోట్ల అంచనాగా చూపించారు. జాతీయ సగటు కన్నా రాష్ట్ర వృద్ధిరేటు అధికంగా ఉందని ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. 2005-11లో రాష్ట్ర వృద్ధిరేటు 9.26 శాతంగా నమోదు అయిందని, దేశ వృద్ధిరేటు 8.5గా మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. రాజీవ్ యువకిరణాల ద్వారా ఇప్పటికే 1.42 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు మంత్రి తెలిపారు. 2014 నాటికి 15 లక్షల మందికి ప్రైవేటు ఉద్యోగాలు కల్పించనున్నట్లు మంత్రి ఆనం తెలిపారు. విపత్తుల ప్రత్యామ్నాయ నిధి కింద రూ. 560.9 కోట్లు కేటాయింపు, రాజీవ్ యువకిణాలకు రూ. 777 కోట్లు కేటాయింపు, ఇందిరా జలప్రభకు రూ. 1800 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు రూ. 1,075 కోట్ల వడ్డీలేని రుణాలు కేటాయిస్తున్నట్లు ఆనం తెలిపారు. ఆర్థిక వృద్ధి మందగించిందని ఆయన అన్నారు. ఉపాధికల్పనపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు చెప్పారు. 2005-2011లో వృద్ధి రేటు 9.26 శాతం ఉన్నట్లు ఆనం పేర్కొన్నారు.ప్రణాళికా వ్యయం రూ. 54.030 కోట్లు, ప్రణాళికేతర వ్యయం రూ. 91.824 కోట్లు, రెవెవ్యూ మిగులు రూ. 4,440 కోట్లు, ద్రవ్య లోటు రూ. 20.008 కోట్లుగా అంచవేయడం జరిగినట్లు మంత్రి తెలిపారు.


  • హోంశాఖ రూ. 4832 కోట్లు
  • రాజీవ్ యువకిరణాలు రూ. 777 కోట్లు
  • మత్స్యకారుల భీమాకు రూ. 234 కోట్లు
  • ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి రూ. 151 కోట్లు
  • గ్రామీణాభివృద్ధికి రూ. 4703 కోట్లు
  • వ్యవసాయం రూ.2572 కోట్లు
  • ఇంధనం, విద్యుత్ శాఖ రూ. 5937 కోట్లు
  • గ్రామీణ ఉపాథి కల్పన రూ.188 కోట్లు
  • పాల కమిషన్ రూ. 100 కోట్లు
  • పశువుల వ్యాధి నిరోధకానికి రూ.50 కోట్లు
  • కార్మిక ఉపాధి శాఖ రూ.500 కోట్లు
  • రవాణా, రోడ్లు, భవనాలు రూ.5032 కోట్లు
  • పట్టణాభివృద్ధి రూ.6586 కోట్లు
  • సాంఘిక సంక్షేమ శాఖ రూ.2677 కోట్లు
  • సాంకేతిక విద్య రూ.1,087 కోట్లు
  • పట్టు పరిశ్రమ రూ.188 కోట్లు
  • గృహ నిర్మాణ శాఖ రూ. 2302 కోట్లు
  • సాధారణ పరిపాలన శాఖ రూ. 88 కోట్లు
  • రచ్చబండ కార్యక్రమం రూ.1269 కోట్లు
  • క్రీడాభివృద్ధి రూ.220 కోట్లు
  • గిరిజన సంక్షేమం రూ. 1540 కోట్లు
  • బీసీ సంక్షేమం రూ.3014 కోట్లు
  • మహిళ సంక్షేమ శాఖ రూ.3014 కోట్లు
  • వికలాంగుల సంక్షేమం రూ.66కోట్లు
  • మైనార్టీ సంక్షేమం రూ.489 కోట్లు
  • ప్రాథమిక విద్య రూ.15510 కోట్లు
  • సాంకేతి విద్య రూ.1087 కోట్లు
  • ఉన్నత విద్య రూ. 1841 కోట్లు
  • నీటి పారుదల రూ.15010 కోట్లు
  • పరిశ్రమలు రూ.633 కోట్లు
  • వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం రూ.5889 కోట్లు
  • ఆర్టీసీకి రాయితీ రూ.710 కోట్లు