Monday, 21 November 2011

దూకుడు నిర్మాత నివాసంపై ఐటీ దాడి

దూకుడు’ చిత్ర నిర్మాత అనిల్ నివాసంపై ఆదాయపు పన్ను (ఐటీ)అధికారులు దాడి చేశారు. దూకుడు చిత్ర వసూళ్లకు సంబంధించిన వివరాల్ని అనిల్ నుంచి సేకరిస్తున్నట్టు సమాచారం. టాలీవుడ్ హీరో మహేష్ బాబు, సమంత నటించిన దూకుడు చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. టాలీవుడ్‌లోనే మరో హీరోకు సంబంధించిన వర్గం దూకుడు కలెక్షన్లు రికార్డు స్థాయిలో లేవంటూ ఆరోపణలు చేయడంతో ఈ చిత్ర వసూళ్లు ఇటీవల వివాదస్పదమయ్యాయి

నేనూ చిరంజీవి అభిమానినే:మంత్రి గల్లా అరుణకుమారి

కాంగ్రెస్‌పార్టీ వారిని ఆదరిస్తున్నట్లుగా ప్రజారాజ్యంపార్టీని ఆదరిస్తానని మంత్రి గల్లా అరుణకుమారి అన్నారు.చిత్తూరు జిల్లాలో పిఆర్‌పి విలీన సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజకీయంలో ఎవరు మిత్రులు, ఎవరు శత్రువులు అనేది శాశ్వతం కాదన్నారు.బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయన్నారు. మేము అంతా మెగాస్టార్ చిరంజీవి అభిమానులమన్నారు. మా కుంటుంతో ఎంతో సన్నిహితంగా ఉంటారన్నారు. మా మధ్య ఇప్పటివరకు విమర్శలు లేవన్నారు. రాజకీయంగాలో ఉండే కక్షలు మెగాస్టార్‌తో లేవని అందరితో కలగలుపుగా ఉంటూ కలసిమెలసి పోతారన్నారు. ప్రతిపక్షాలు ముందుకు రాకున్నా చిరంజీవి స్పీకర్‌ను ఆయన సీటు వద్దకు తీసుకెళ్లినప్పుడు ఆయన హుందాతనం తెలిసిందన్నారు. కాంగ్రెస్ పార్టీలోని నాయకులను కార్యకర్తలను ఆదరిస్తున్నట్లుగానే పిఆర్‌పి వారిని ఆదరిస్తామన్నారు. వారిని పార్టీలోనికి ఆహ్వానిస్తూ కండువాలను కప్పారు. సైకం జయచంద్రారెడ్డి, హరిప్రసాద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలను మమ్మల్ని, మా నాయకుడ్ని ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. దీంతో తాము విలీనం అవుతన్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.

జై రాయలసీమ సినిమా తీయాలి

 రాయలసీమ వాసులు కర్నూలు రాజధానిగా ఉన్న సమయంలో విశాలాంధ్ర కొరకు త్యాగం చేసి తెలుగు ప్రజల అభ్యున్నతి కోసం ఎన్నో త్యాగాలకు వారసులైన రాయలసీమ త్యాగ నిరతిపై జై రాయలసీమ చిత్రాన్ని సినీ నిర్మాతలు తీయాలని రాయలసీమ ఐక్య వేదిక అధ్యక్షులు పిబివి సుబ్బయ్య కోరారు. ఆదివారం స్ధానిక రవీంద్ర ఇంగ్లీషు మీడియం పాఠశాలలో సీమ ఐక్య వేదిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జై రాయలసీమ చిత్ర నిర్మాణం కోసం తాము సినిమా నిర్మాతలను సంప్రదించాలని, తమ సభ్యులతో కలసి చలన చిత్ర మండలి మాజీ అధ్యక్షులు, నిర్మాత బీవీ రెడ్డిని త్వరలో కలుస్తామని అన్నారు. ఐక్య వేదిక కార్యదర్శి విక్టర్ ఇమ్మానియేలు మాట్లాడుతూ రాయలసీమ ఫ్యాక్షన్ గురించి, కత్తులు కటారులు చూపడం భావ్యం కాదన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి వీరగాధలు, పోతులూరి వీరబ్రహ్మేంద్ర ఆధ్యాత్మికతను ప్రధాన భూమికగా చూపాలని అన్నారు. మంచి హృదయంతో కర్నూలు ప్రజలు సమైక్యవాదానికి ప్రతీకగా నిలిచిన కర్నూలు త్యాగ నిరతిని చూపించాలని కోరారు. విద్యార్ధి సంఘాలు, ఐక్య కార్యాచరణ సంఘాలు, రాజకీయవాదులు, మేధావి వర్గాలు వీటిపై స్పందించి తగిన రీతిలో ముందుకు వచ్చి మన త్యాగ నిరతిని సినిమా ద్వారా, సాహితీ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చాటాలని ఆయన పిలుపునిచ్చారు

త్వరలో జైళ్ల కంప్యూటరీకరణ

రాష్ట్రంలోని జైళ్లను కంప్యూటరీకరణ చేస్తున్నట్లు జైళ్ల శాఖ ఐజి సునీల్‌కుమార్ తెలిపారు.వ్యవసాయ ఆరుబయలు కారాగారాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. జిల్లా జైలులో కోటి నలబై ఏడులక్షల రూపాయలతో నిర్మిస్తున్న ప్రహరీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ సిబ్బంది, అధికారులకు అనువైన ఆఫీసు నిర్వహణా కార్యాలయాన్ని ఏర్పాటుచేస్తామన్నారు. ఆరుబయలు కారాగారంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనశాల, వ్యవసాయ కర్మాగారంలో ఖైదీల ద్వారా పండిస్తున్న కూరగాయలు, పండ్లను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎగ్జిబిషన్‌ను ఐజి సునీల్‌కుమార్ పరిశీలించా

రాజమౌళి-అక్కినేని కాంబినేషన్లో ఓ సినిమా

తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రతి యువహీరో ప్రముఖ దర్శఖుడు రాజమౌళితో ఒక సినిమా చేయాలని కోరుకుంటుంటారు. తాజా ఆ అవకాశం అక్కినేని యువహీరో నగచైతన్యకు దక్కింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం ప్రకారం త్వరలో రాజమౌళి-అక్కినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కబోతోందని తెలిసింది. నాగచైతన్యకు సరిపోయే ఓమంచి స్టోరీలైన్ రాజమౌళి తయారు చేశాడని, ఈ స్టోరీ నాగార్జన విని చాలా ఎగ్జైట్ అయ్యాడని, తానే స్వయంగా అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మించాలని డిసైడ్ అయ్యాడని సమాచారం. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక సమాచారం వెలువడే అవకాశం ఉంది

మహేష్ బాబు కొత్త సినిమా ముగ్గురు హీరోయిన్లు

దూకుడు యాభై రోజులు పూర్తవ్వక ముందే తన కొత్త సినిమా బిజినెస్ మెన్ ట్రైలర్ పూర్తి రిలీజ్ చేసాడు. దీని తరువాత కూడా ఇదే స్పీడ్ లో దూకుడుగా ముందుకెలుతున్నాడు. జనవరిలో బిజినెస్ మెన్ రిలీజ్ అయిన వెంటనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు షూటింగ్ లో వెంకటేష్ తో కలిసి పాల్గొంటాడు.దీని తరువాత మహేష్ క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఇప్పటివరకు మహేష్ సినిమాలలో యువరాజు లో తప్ప అన్ని సినిమాలలోనూ ఒక్కరే హీరోయిన్. అయితే మొదటి సారి మహేష్ తో కలిసి క్రిష్ దర్శకత్వం వచించే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. ఎవరా హీరోయిన్లు అన్నది ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.కాగా ఈ ముగ్గురు కథానాయికలను సెట్ చేయడం డైరెక్టర్ క్రిష్ కి అగ్ని పరీక్షలా తయారయ్యిందని తెలుస్తోంది

వీఆర్‌ఓ, వీఆర్‌ఏ నియామకాల్లో మార్పులు

 వీఆర్‌ఓ, వీఆర్‌ఏ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీఆర్‌ఓ పరీక్షలకు రాత పరీక్ష నిర్వహించాలని, ఇంటర్వ్యూ విధానం ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మార్కుల రేషనైలేజేషన్ సాధ్యం కాదని మంత్రులకు అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 30 తేదిన మరో షెడ్యూల్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది. త్వరలో 1172 వీఆర్‌ఓ పోస్టులు, 6063 వీఆర్‌ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది