Sunday, 22 January 2012

టిడిపి పార్టీ ఆదేశిస్తే చిరంజీవిపై పోటీ చేస్తా...బాలయ్య

తెలుగుదేశం పార్టీ ఆదేశిస్తే .. చిరంజీవిపై పోటి చేయడానికి సిద్ధమని బాలకృష్ణ స్పష్టం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో పర్యటిస్తున్న బాలకృష్ణ పాడేరులో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరుస్తూ తాను పార్టీలో కొనసాగుతానని స్పష్టం చేశారు. తమ కుటుంబంలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవన్నారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. పాడేరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.కాగా అంతకుముందు తాను ఏ ప్రాంతం నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని బాలకృష్ణ చెప్పారు. ఆయన విశాఖపట్టణంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుండి పోటీ చేసేందుకైనా సిద్ధమని చెప్పారు. ఏ ప్రాంతమైనా తనకు ఫర్వాలేదన్నారు. ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి అత్యంత ప్రజాధరణ ఉందని చెప్పారు. సినిమాల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఎంతగా ఆదరణ చూపారో అదే ఆదరణ రాజకీయాల్లోనూ తనపై ప్రజలు చూపాలని కోరుకుంటున్నానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు టిడిపికి పట్టం కట్టడం ఖాయమన్నారు. కాగా బాలయ్య రాక సందర్భంగా విశాఖలో సందడి నెలకొంది. తెలుగుదేశం పార్టీలో క్యాడర్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. కాగా ఇటీవల బాలకృష్ణ రాజకీయ పర్యటనలు చేస్తున్న విషయం తెలిసిందే. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు బాలయ్య పక్షం రోజుల క్రితం కృష్ణా జిల్లా పర్యటనలో విస్పష్ట ప్రకటన చేశారు. అప్పటి నుండి పలుమార్లు రాజకీయ కోణంలోనే మాట్లాడుతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా తాను రాజకీయాల్లోకి వస్తున్నానని, ఎంపీగా కాకుండా అసెంబ్లీ నుండి పోటీ చేస్తానని చెప్పారు. బాలయ్య ఎక్కడి నుండి పోటీ చేసినా స్వాగతిస్తామని ఆయన అభిమానులు, టిడిపి క్యాడర్ చెబుతోంది.

24న జాతీయగీతం జనగణమన వందేళ్ల ఉత్సవం

జాతీయగీతం జనగణమనకు వందేళ్లు, విశ్వకవి రవీంద్రనాథ్‌ఠాగూర్ 150వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె బిటి కళాశాల ప్రిన్సిపల్ తులసీరామ్‌నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 24న జనగణమన జాతీయగీత వందేళ్ల ఉత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటి సిఎం దామోదర్ తో పాటు 10మందికి పైగా కేంద్ర, రాష్టమ్రంత్రులు, చిరంజీవి, ఎమ్మెల్యేలు, ఎంపిలు ఉత్సవానికి హాజరవుతున్నట్లు మదనపల్లె ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాష వెల్లడించారు.  విశ్వకవి రవీంద్రుడు ఆరురోజుల పాటు మదనపల్లె బిటి కళాశాలలో బసచేసిన ప్రదేశాలు, నాడు జనగణమన గేయానికి బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి ట్యూన్‌చేసి గీతాన్ని మొదటిసారిగా అప్పటి విద్యార్థులచే ఆలపించిన ప్రదేశాలను సిఎం, గవర్నర్‌లు పరిశీలించనున్న దృష్ట్యా వాటిని అధికారులు పరిశీలించారు. అనంతరం హెలీప్యాడ్ ల్యాండ్ స్థలం కోసం బెంగళూరురోడ్డులోని బిటి కళాశాల ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం జరిగే సిఎం బహిరంగ సభ కోసం పుంగనూరురోడ్డులోని మిషన్‌కాంపౌండు ఆవరణాన్ని పరిశీలించారు. అనంతరం ఆర్‌అండ్‌బి అతిథిగృహం, ఎమ్మెల్యే స్వగృహాన్ని కూడా అధికారులు పరిశీలించారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు సిఎం మదనపల్లె పట్టణంలో ఉంటున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్‌బాష స్థానిక విలేఖరులతో మాట్లాడారు. జనగణమనకు వందేళ్ళు, విశ్వకవి రవీంద్రునికి 150 జయంతి ఉత్సవాలను ఈనెల 24న ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 24న మధ్యాహ్నం 2గంటలకు ప్రజలందరూ ఒకేసారి జనగణమన జాతీయగీతం ఆలపించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీ రద్దు

లక్షలాది మంది రోగులకు ఉచిత వైద్య సేవలందించే సత్యసాయి సూపర్ స్పె షాలిటీ హాస్పిటల్‌కు ప్రభుత్వం భరించే విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం శనివారం అధికారికంగా ఉత్తర్వులు విడుదల చేసింది. జిఓఆర్‌సి నెం.9 మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. పుట్టపర్తిలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను 1992లో ప్రారంభించారు. రోగుల నుండి ఒక నయాపైసా వసూలు చేయకుండా సేవలందిస్తున్న దృష్ట్యా విద్యు త్ సబ్సిడీని ప్రభుత్వం జీఓ ఎంఎస్ నెం 98 1993 ఏప్రిల్ 26 నుంచి ప్రభుత్వమే చెల్లించేది. ఇది సుమా రు రెండు దశాబ్దాలుగా ఈ ప్రక్రియ అమలవుతోం ది. ఇప్పటి దాకా సత్యసాయి సూపర్ స్పెషాలిటీ విద్యు త్ వినియోగానికి అనుగుణంగా ట్రాన్స్‌కోకు రూ. 4.2 కోట్లు ప్రభుత్వపరంగా సబ్సిడీ మొత్తం చెల్లించాల్సి వుంది. గత కొంతకాలంగా ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో సబ్సిడీ మొత్తాన్ని చెల్లించాలని సత్యసాయి సెంట్రల్ ట్రస్టుపై వత్తిడి తెస్తూ నోటీసులు సె తం జారీ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ట్రస్టు కూడా ప్రభుత్వపరంగా విద్యుత్ సబ్సిడీ మొత్తాన్ని విడుదల చేయాలని కూడా తమ లేఖలో పలుమార్లు కోరింది. అయితే అనూహ్యంగా ప్రభు త్వం విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ శనివారం అధికారికంగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో విద్యుత్‌ను వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేస్తున్న దృష్ట్యా కొనుగోలు వ్యయం 86% చేరిందని, ఈ క్రమంలో సబ్సిడీని వినియోగదారుడే భరించాలి తప్పా ట్రాన్స్ కో భరించే స్థితిలో లేదని ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం ఈ అంశంపై ఎంతో కూలంకషంగా పరిశీలించిన పిమ్మట, ట్రాన్స్‌కో పంపిన ప్రతిపాదన మేరకు శ్రీ సత్యసాయి వైద్య విజ్ఞాన సంస్థకు భరించే విద్యుత్ సబ్సిడీని 2009 సంవత్సరం నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ట్రాన్స్‌కో ఎండి తన ఉత్తర్వు ల్లో పేర్కొన్నారు. జిఓ ఆర్‌సి నెం 9 మేరకు ఈ విద్యు త్ సబ్సిడీ రద్దు ప్రక్రియ అమలులోకి వస్తుందని వెలువరించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వపరంగా సబ్సిడీ రద్దయితే ప్రతి నెల సూపర్‌స్పెషాలిటి హాస్పిటల్ వర్గాలు రూ. 16 లక్షల వంతు న విద్యుత్ చార్జీలు చెల్లించాల్సి వుంటుంది. హాస్పిటల్‌లో వినియోగించే విద్యుత్‌లో యూనిట్‌కు రూ.4 వంతున వసూలు చేసే మొత్తంలో రూ.3.70 పైసల వంతున ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుండగా 30పైసల వంతున హాస్పిటల్ వర్గాలు విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియ నేటి దాకా కొనసాగుతోంది. ప్రతి నెల సుమారు రూ. 16 లక్షల మేర బిల్లులు రానుండగా ఇందులో రూ. 3 లక్షల వంతున సత్యసాయి సూపర్ స్పెషాలిటీ వర్గాలు క్రమం తప్పకుండా చెల్లిస్తున్నాయి. అయితే ప్రభుత్వం తాజా ఉత్తర్వుల ప్రకారం విద్యుత్ బిల్లుల మొత్తాన్ని హాస్పిటల్ వర్గాలే భరించాల్సి వుంటుంది. సత్యసాయి శివైక్యం పొందిన తదుపరి ఈ పరిణామం చోటుచేసుకోవ డం పుట్టపర్తి ప్రజలను ద్రిగ్భాంతికి గురిచేసింది. లక్షలాది మంది నిరుపేదలకు ఉచితంగా వైద్య సేవలందిస్తున్న హాస్పిటల్‌కు విద్యుత్ సబ్సిడీని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించడం అన్యాయమంటూ స్థానికులు ఆక్రోశిస్తున్నారు