తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన
నిర్ణయం తీసుకోలేదని పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల
సునీత చెప్పారు. రేపు పరిటాల రవీంద్ర ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె సోమవారం
మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి
శ్రీరామ్కు ఇంకా సమయం రాలేదని ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం
చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్
రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె
చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల
కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ
శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల
ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం
వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె
శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు.అనంతపురం జిల్లాలో
కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా పరిటాల రవి కుటుంబం ఉంటూ వస్తోంది. తెలుగుదేశం
పార్టీకి పరిటాల రవి మొదటి నుంచి బలాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఇప్పుడు తన
ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి
రావడానికి సిద్ధపడినట్లు సమాచారం. రాకీయాల్లోకి రావాలనే నిర్ణయమే తీసుకోనప్పుడు శ్రీరామ్
శాసనసభకు పోటీ చేస్తాడా, పార్లమెంటుకు పోటీ చేస్తాడనే విషయం ప్రస్తావనకే
రాదని ఆమె అన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో
భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నారని ఆమె అన్నారు.
Monday, 23 January 2012
బాబు అనుమతి కావాలా...?వైయస్ వివేకానంద రెడ్డి
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై దివంగత ముఖ్యమంత్రి
వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి సోమవారం
విరుచుకు పడ్డారు. వైయస్ విగ్రహాలు పెట్టడానికి చంద్రబాబు అనుమతి
తీసుకోవాలా అని ప్రశ్నించారు. ప్రజలు వైయస్పై అభిమానంతో విగ్రహాలను
ఏర్పాటు చేసుకుంటున్నారని, అలాంటి విగ్రహాలకు చంద్రబాబు అనుమతే కాదు ఎవరి
అనుమతి అవసరం లేదన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాలను తీసివేయమని ఎవరైనా
అడిగారా అని ప్రశ్నించారు. చనిపోయిన వారి గురించి అలా దురుసుగా
మాట్లాడటమేమిటని, ఆయనది నోరా కాదా అన్నారు. పులివెందుల నియోజకవర్గానికి
నీటి కేటాయింపులపై కూడా ఆయన ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పులివెందులకు రావాల్సిన నీటి కేటాయింపుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని
ఆరోపించారు. నీటిని ఏమాత్రం కేటాయించకుండా ఇప్పుడు నీరు లేదని చెప్పడం
దారుణమన్నారు. ఈ విషయమై అధికారుల నుండి ముఖ్యమంత్రి వరకు తీసుకు వెళ్లినా
ఫలితం లేదని, ఇందుకోసం పోరాటం చేస్తామన్నారు.
ఉప ఎన్నికలో తిరుపతి నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ...!?
తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో రాజకీయం ఇప్పటి నుంచే వేడెక్కుతోంది.
చిరంజీవి రాజీనామా చేసి కేంద్ర మంత్రిగా వెళ్లిపోతే తిరుపతి శాసనసభ
నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఉప ఎన్నిక జరిగితే కాంగ్రెసు ఓటమి
పాలవుతుందనే భయాలను పక్కన పెడుతూ వ్యూహాత్మకంగా చిరంజీవి ముందుకు
వస్తున్నట్లు కనిపిస్తోంది. ఉప ఎన్నికలో తిరుపతి అభ్యర్థిగా కాంగ్రెసు
నుంచి చిరంజీవి భార్య సురేఖ పోటీ చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
చిరంజీవి వారసురాలిగా తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి సురేఖ పోటీ చేసే
అవకాశాలను ఆయన వర్గానికి చెందిన నాయకులు తోసిపుచ్చడం లేదు. తిరుపతిలో
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బలాబలాలపై చిరంజీవి తరుచుగా తన వర్గానికి
చెందిన నాయకులను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం. అంతేకాకుండా తిరుపతి
నియోజకవర్గంలో తరుచుగా పర్యటిస్తూ స్థానికులతో సంబంధాలను కొనసాగిస్తూ
వస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలోని వర్గ సమీకరణలపై కూడా ఆయన ఆరా
తీస్తున్నట్లు సమాచారం. తిరుపతి శాసనసభ నియోజక వర్గం సీటును చిరంజీవి
కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కాంగ్రెసు అధిష్టానం సంసిద్ధత వ్యక్తం
చేసినట్లు చెబుతున్నారు. తిరుపతి నుంచి తన బావమరిది అల్లు
అరవింద్ను లేదా సోదరుడు నాగబాబును పోటీకి దించే విషయంపై కూడా చిరంజీవి
గతంలో ఆలోచన చేశారని చెబుతున్నారు. అయితే, తన సతీమణి సురేఖను పోటీకి
దించితే 30 శాతం బలిజ ఓటర్ల మద్దతు పొందడంతో పాటు ఇతర వర్గాల మద్దతు కూడా
లభిస్తుందని ఆయన భావిస్తున్నట్లు ఓ ఆంగ్ల దినపత్రిక రాసింది. సురేఖను
కాంగ్రెసు పోటీకి దింపితే టిడిపి మాజీ శాసనసభ్యుడు చదలవాడ కృష్ణమూర్తి
భార్య చదలవాడ సుచరితను పోటీకి దించాలని తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నట్లు
తెలుస్తోంది. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి భూమన కరుణాకర్
రెడ్డి పోటీ చేసే అవకాశాలున్నాయి.చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులు
తిరుపతిలో
బీఈడీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. థానిక శాసనసభ్యుడు చిరంజీవిని బిఇడి విద్యార్థులు సోమవారం అడ్డుకున్నారు.
తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. జివో నెంబర్ 3ను తొలగింప చేయాలని
విజ్ఞప్తి చేశారు. చిరంజీవిని అడ్డుకున్న బిఇడి విద్యార్థులకు వైయస్సార్
కాంగ్రెసు పార్టీ మద్దతు పలికింది. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం
పార్టీ అధినేత నారాచంద్రబాబు నాయుడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని
విమర్శించారు. చిరంజీవి నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో
పాల్గొనేందుకు ఉదయం తిరుపతి వచ్చారు. అంతకుముందు హైదరాబాద్ నుండి తిరుపతి
విమానాశ్రయంలో దిగిన ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవులు మూడు
ఇవ్వలేమని చెప్పి అధిష్టానం సర్దుకోమని చెప్పిందని, తెలంగాణకు మరో విధంగా
న్యాయం చేస్తామని చెప్పిందని అందువల్లే రెండు మంత్రి పదవులు ఒప్పుకున్నట్లు
చెప్పారు.. తమ పాలిట శాపంగా పరిణమించిన ఏడో నెంబర్ జీవోను రద్దు
చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అదే సమయంలో బయటకు వచ్చిన చిరంజీవి
ఇరకాటంలో పడ్డారు. అభ్యర్థులకు స్పష్టమైన హామీ ఇవ్వకుండానే ఆయన
వెళ్లిపోయారు.
నా రెండో రూపం వారికి తెలియదు...బాలకృష్ణ
చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.విశాఖ జిల్లా పర్యటనలో ఉన్న బాలకృష్ణ చిరంజీవిపై ధ్వజమెత్తారు. తనను ఒకరు
బాలుడన్నారని, తమను ఒకవైపే చూశారని, తమ రెండో రూపం వారికి తెలియదని
బాలకృష్ణ హెచ్చరించారు. అధికారం కోసం పార్టీని అమ్ముకోలేదని, సీఎం
కుర్చీనే వారి జీవిత లక్ష్యమని బాలకృష్ణ అన్నారు. పార్టీని అమ్ముకున్న
వారికి నాన్నగారితో పోలికా అంటూ ఆయన ప్రశ్నించారు. జిల్లాలో రెండోరోజైన
సోమవారం పర్యటిస్తున్న బాలయ్య పెదవాల్తేరులో ఎన్టీఆర్ విగ్రహాన్ని
ఆవిష్కరించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ
పార్టీని అమ్ముకున్న వాళ్లా మమ్మల్ని విమర్శించేది అంటూ ధ్వజమెత్తారు.
నాన్నగారి ఆశయాలే తమను రాజకీయాలకి ఆహ్వానించాయని బాలకృష్ణ పేర్కొన్నారు.
ప్రజాధనాన్ని కుటుంబానికి దోచిపెట్టిన వారి విగ్రహాలు చూడాల్సివస్తోందని,
స్వప్రయోజనాల కోసం కొందరు విగ్రహాలను రాజకీయం చేస్తున్నారని బాలకృష్ణ
వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ కాలిగోటికి ఎవరూ సరిపోరని అన్నారు. తండ్రి
ఆశయాలను కొనసాగిస్తామని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి
చేస్తానని ఆయన స్పష్టం చేశారు.బాలకృష్ణ వ్యాఖ్యలపై స్సందించను: చిరంజీవి

బాలకృష్ణ ఎక్కడ నుంచి పోటీ చేసినా గొప్పేమీ లేదని, ఆ విషయాన్ని తాను లైట్ తీసుకుంటానని చిరంజీవి తిరుపతిలో అన్నారు.సినీహీరో బాలకృష్ణ వ్యాఖ్యలపై తాను స్పందించనని స్థానిక ఎమ్మెల్యే చిరంజీవి అన్నారు. చిత్తశుద్ధితో సేవచేసినంతకాలం ఎవరెన్ని వ్యాఖ్యలు చేసినా ప్రజలు పట్టించుకోరన్నారు. తనపై బాలకృష్ణ వ్యాఖ్యలను కూడా ప్రజలు పట్టించుకోరని ఆయన చెప్పారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకు లేదన్నారు. చంద్రబాబు పాలనలో బిసిలకు అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ లో విభేదాలు ఏమీలేవని చెప్పారు. విభేదాలు అన్ని మీడియా కథనాలేనన్నారు.
నీచ రాజకీయాలకు బలి కావద్దు...లక్ష్మీపార్వతి

నీచ రాజకీయాలకు బలిపశువు కావద్దని సినీహీరో బాలకృష్ణకు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి సలహా ఇచ్చారు. ఈ రోజు ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు నీచుడు, నయవంచకుడు అటువంటి వ్యక్తితో బాలకృష్ణ చేతులు కలపడం బాధాకరం అన్నారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిన బాబుతో చేయి కలపడం భావ్యంకాదని బాలకృష్ణని ఉద్దేశించి ఆమె అన్నారు. తండ్రిని చంపిన వ్యక్తితో చేతులు కలుపుతావా? అని ప్రశ్నించారు. మీ తండ్రికి చేసిన నష్టాన్ని ఎవరైనా పూడ్చలుగుతారా? అని కూడా ఆమె అడిగారు. వేషాలు మార్చే చంద్రబాబుని ఎవరూ నమ్మరని చెప్పారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు తెలుగు జాతి గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టుపెట్టారని విమర్శించారు. నీచుడు, అవినీతిపరుడైన చంద్రబాబుతో చేతులు కలపవద్దని, చక్రవర్తి కుమారుడిలాగా తలెత్తుకు బతకమని ఆమె బాలకృష్ణకు సలహా ఇచ్చారు.
సచిన్ సెంచరీ కంటే.. భారత్ గెలుపే ముఖ్యం..గౌతం గంభీర్
‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ 100వ సెంచరీ కంటే భారత్ విజయమే
ముఖ్యమని, టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత
ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే కీలకమని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టెస్టు
సిరీస్ను ఇప్పటికే చేజార్చుకున్న క్రమంలో మంగళవారం అడిలైడ్లో చివరి
టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చివరి టెస్టునైనా గెలిచి
‘వైట్వాష్’ నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలని చూస్తున్న టీమిండియా
ఇక్కడ ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ అనంతరం
విలేఖరులతో మాట్లాడిన గంభీర్..ప్రతి టెస్టు ప్రత్యేకమేనన్నారు. గత టెస్టు
జయాపజయాలకు అతీతంగా తనను తాను మార్చుకొని సహజసిద్ధమైన ఆటలోకి ప్రవేశించని
ఆటగాడు క్రికెట్కు పనికి రాడని పేర్కొన్నాడు. కాగా, ఒకటి, రెండు టెస్టు
సిరీస్లలో విఫలం చెందినంత మాత్రానా చెడుగా భావించడం సరికాదని, ఇంగ్లాండ్,
ఆసీస్ సిరీస్ల ముందు భారత్ ప్రపంచ ర్యాంకింగ్లో మొదటి స్థానంలో ఉందని
గుర్తు చేశాడు. ఇక సచిన్ తెండూల్కర్ సెంచరీపై స్పందిస్తూ సచిన్ సెంచరీ
సాధించడం కంటే జట్టు గెలిస్తేనే తనకు అమితానందమని, ఓ దేశం కోసం ఆడుతున్న
సమయంలో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానే్న ఆటగాడు కోరుకోవాలన్నాడు.
సచిన్ సెంచరీ చేయలేదన్న బాధ కంటే నాలుగు టెస్టుల సిరీస్ను 0-3 తేడాతో
చేజార్చుకోవడమే అధికంగా బాధిస్తోందని, చివరి టెస్టులో సచిన్ సెంచరీ కన్నా
జట్టు 1-3 తేడాతో విజయం సాధిస్తేనే ఆనందమన్నాడు. సచిన్ సెంచరీ సాధించి,
చివరి టెస్టులో ఓటమిపాలైతే అది తమకు ఆనందం కలిగించబోదన్నాడు.
మరోవైపు తొలి మూడు టెస్టుల్లో దూకుడు మీదున్న ఆసీస్ను చివరి టెస్టులో
కట్టడి చేసి విజయం సాధిస్తామనే ధీమాను ఈ సందర్భంగా గంభీర్ వ్యక్తం చేశాడు.
ఆసీస్తో వనే్డ సిరీస్ ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ విధానంపై స్పందిస్తూ తాము
స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నామని, ఆసీస్ బ్యాట్స్మెన్లు ఆ విధంగా
బ్యాటింగ్ చేయలేకపోతున్నారన్నాడు. అయితే ఈ పర్యటనలో తన ఫాం పట్ల
అసంతృప్తిని వ్యక్తం చేశాడీ ఢిల్లీ బ్యాట్స్మన్. ఓపెనర్గా ఉన్న తాను
పేలవమైన ప్రదర్శననిస్తున్నానని అంగీకరించాడు. అయితే ఓపెనర్గా దిగుతుండటంతో
పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, బంతి బాగా బౌన్స్ అవుతోందని వివరించాడు
Subscribe to:
Posts (Atom)

