Monday, 6 February 2012

ఐఎఎస్ అధికారులు పెద్ద చేపలెవరో చెప్పాలి...డిఎల్ రవీంద్రా రెడ్డి

వ్యక్తి స్వార్ధం వల్లనే గత ప్రభుత్వ హాయాంలో వ్యవస్థ నాశనమైందని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ డిఎల్ రవీంద్రారెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని ఉద్దేశించి పేర్కొన్నారు. వైఎస్ హయాంలో జరిగిన వాస్తవాలను ఐఏఎస్ అధికారులు నిర్భయంగా వెల్లడించాలని అన్నారు. ఈ సందరర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పులు చేయనప్పుడు అధికారులు బాధపడనవసరం లేదని, నాటి సమయంలో పెద్ద చేపలెవరో, వారి పేర్లను వెల్లడించాలని మంత్రి కోరారు. జూనియర్ డాక్టర్లు మొండిగా వ్యవహరిస్తున్నారని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వ్యాఖ్యానించారు. సమ్మె విమరిస్తే చర్చలు జరిపి జూనియర్ డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని ఆయన అన్నారు. జూనియర్ డాక్టర్లు విద్యార్థులేనని, ఉద్యోగులు కారని ఆయన అన్నారు. తప్పులు చేసినవారు ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందేనని మరో మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. చట్టం ముందు అందరూ సమానమేనని ఆయన విడిగా మీడియా ప్రతినిధులతో అన్నారు