రైల్వే శాఖ తత్కాల్ బుకింగ్ లో మార్పులు చేసింది. ఇక ఒక్క రోజు ముందు మాత్రమే తత్కాల్ టిక్కెట్ ఇస్తారు. తత్కాల్ టిక్కెట్ పోగొట్టుకుంటే ఇక ముందు డూప్లికేట్ టిక్కెట్ ఇవ్వరు. ఖాయం అయిన టిక్కెట్ ని రద్దు చేస్తే ఇకనుంచి తిరిగి డబ్బు ఇవ్వరు. ఈ నిబంధనలు వారం రోజులలో అమలులోకి వచ్చే అవకాశం ఉంది
Friday, 11 November 2011
నందమూరి తారక రామారావు గారి పేరు నిలబెడతా: బాలకృష్ణ
ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న:ఎన్టీఆర్
జూ ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములో కార్తిక సెకెండ్ హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే.బోయపాటి శ్రీను దర్శకత్వంలో కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం సెట్స్ పై కార్తీక ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఆమెను మొదటి రోజు రిసీవ్ చేసుకున్న ఎన్టీఆర్ ఆమె దగ్గరకు వెళ్లి.. నాకు మీ అమ్మగారు రాధ అంటే చాలా గౌరవం, ఇష్టం. ఆమెతో చేద్దామనుకున్నాను కానీ కుదరలేదు.కానీ ఆవిడ కూతురైన మీతో చేయటం చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమెతో చెప్పాడు. దాంతో కార్తిక షాక్ కి గురైంది. ఆమె కెరిర్ లో ఎప్పుడూ హీరో నుంచి ఇలాంటి మాటలు ఎప్పుడూ ఎక్సపెక్ట్ చేయలేదు. ఇంత గౌరవంగా తనను రిసీవ్ చేసుకుంటాడని భావించని ఆమె తన సర్కిల్స్ లో ఎన్టీఆర్ ఎంత గొప్పవాడో, అతని ప్రెడ్లీ నేచర్ ఎలాంటిదో చెప్తోంది. ఇదే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా త్రిష చేస్తోంది. ఈ చిత్రం ఎమోషన్ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి అభివర్ణిస్తున్నారు
త్రిష :మూడు కండిషన్లు
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ
తిరుమలలో టికెట్లకు ఫొటోమెట్రిక్ పద్దతి
తిరుపతి: తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు అధికారులు రోజుకో కొత్త విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో దళారుల ప్రమేయం లేకుండా చేసేందుకు ఫొటో మెట్రిక్ పద్దతిని ప్రవేశపెట్టారు. దీంతో దళారులనే కాదు భక్తుల్ని క్యూ లైన్లలో తోస్తున్న కొంత మంది అధికారులను కూడా నియంత్రించే వీలు కలిగింది. అన్ని దర్శన టికెట్లకు ఫొటో విధానం ప్రవేశపెట్టేందుకు టిటిడి ప్రయత్నిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే భక్తుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. దళారులకు తోడు కొందరు టిటిడి అధికారుల ఇష్ట్యా రాజ్యం కూడా శ్రీవారి భక్తులకు చుక్కలు చూపిస్తున్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు దేవస్థానం ఉన్నతాధికారులు కొత్తకొత్త విధానాల్ని వెతుకుతున్నారు
ఆర్జిత సేవా టికెట్లలో దళారుల మోసాల్ని నియంత్రించేందుకు కొత్తగా ఫొటో మెట్రిక్ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చారు. దీంతో భక్తులు ఇతరుల వద్ద అధిక ధరకు కొనుగోలు చేసిన ఫొటో లేని టికెట్లు చెల్లుబాటు కావు. ఫొటో లేని భక్తుల్ని క్యూ లైన్ల నుంచి తప్పిస్తారు. వేలిముద్రలు మాత్రమే అమలులో ఉన్న విధానంలో దళారులకు తోడు కొందరు అధికారులు కూడా మధ్యలో భక్తుల్ని క్యూ లైన్లలోనికి తోసేవారు. ఫొటో పద్దతి అమలులోకి వచ్చినందున దళారుల నుంచి కష్టాలు తప్పినట్లేనని భక్తులు సంతోషపడుతున్నారు. ఆర్జిత సేవా టికెట్లలో ఫొటో విధానాన్ని ప్రవేశపెట్టినట్లే ఇతర టికెట్లకు ఫొటోమెట్రిక్ పద్దతిని ప్రవేశపెట్టాలని టిటిడి యోచిస్తోంది.
Subscribe to:
Posts (Atom)