Friday, 21 October 2011

డెంగ్యూ , మలేరియా, క్యాన్సర్ రోగులకు (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)చికిత్స మిషన్

: పేద, మధ్యతరగతి కుటుంబాల రోగులకు వరం డెంగ్యూ వ్యాధి నిర్ధారణ చికిత్స మిషన్ (సింగిల్ డోనర్ ప్లేట్‌లెట్ సెపరేషన్ యూనిట్)ను అన్నదాత ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందించడం ఎంతో అభినందించదగ్గ విషయమని కలెక్టర్ రాంశంకర్ నాయక్ పేర్కొన్నారు. గురువారం నంద్యాల వైద్య విధాన పరిషత్‌లో ఎంపి ఎస్పీవై రెడ్డి విరాళంగా అందజేసిన మిషన్‌ను కలెక్టర్ రాంశంకర్ నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కర్నూలుతోపాటు నంద్యాలలో కూడా రూ.13లక్షలు విలువ చేసే మిషన్‌ను ఏర్పాటుచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు. దీనివల్ల రోగులు కర్నూలుకు రావాల్సిన అవసరం లేదని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్సలు చేయించుకోవచ్చన్నారు. ప్రస్తుతం జిల్లాలో డెంగ్యూ వ్యాధి భయభ్రాంతులకు గురిచేస్తున్నదని దీనివల్ల అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పారు. పేద, మధ్యతరగతి కుటుంబాల వారు రోగం వస్తే ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అధిక వ్యయం చేసి చికిత్సలు చేయించుకోలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే రూ.10వేల నుంచి రూ.20వేల వరకూ వ్యయం అవుతుందని, అయితే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం ఈ మిషన్ ద్వారా రూ.5,500లకే చికిత్సలు చేస్తారని తెలిపారు. దీనివల్ల ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చన్నారు. ఈ మిషన్ డెంగ్యూ వ్యాధితోపాటు మలేరియా, క్యాన్సర్ రోగులకు కూడా చికిత్సలు చేయవచ్చన్నారు. మిషన్ ద్వారా వ్యాధి వచ్చిన రోగికి గంటపాటు చికిత్స చేయవచ్చన్నారు. ఈ మిషన్ ద్వారా రోగికి వచ్చిన వైరస్‌ను తొలగించి కొత్త రక్తం ద్వారా స్వస్థత చేకూర్చవచ్చన్నారు. ఎంపి ఎస్పీవై రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మిషన్‌ను ఉపయోగించుకోవాలని కోరారు. తాను ఎప్పుడూ పేద రోగులకు అండగా ఉంటానని తెలిపారు. మిషన్‌ను ఆపరేట్ చేయడానికి ముగ్గురు టెక్నీషియన్లకు శిక్షణ ఇచ్చి ఏర్పాటుచేయడం జరిగిందన్నారు

No comments:

Post a Comment