Thursday, 19 January 2012
వారసులొస్తున్నారు!
ఫామ్లో ఉన్నది క్రికెట్ దేవుడొక్కడే...డేవిడ్ వార్నర్
అనంతపురం జిల్లాలో జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలు
అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ సీనియర్ ఛాంపియన్
షిప్పోటీలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన
సాఫ్ట్బాల్ క్రీడాకారులు అనంతకు మొదటి సారి వచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు
అనంతలో సంజీవరెడ్డి స్టేడియంలో, ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఈ పోటీలు
నిర్వహిస్తున్నారు. పోటీలలో పాల్గొనడానికి 25 పురుష జట్లు, 22 మహిళా జట్లు
వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు
జితేంద్రరెడ్డి అధ్యక్షతన ప్రారంబోత్సవ సభను ఆర్డీటీ స్టేడియంలో
నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి,
ఎమ్మెల్సీ గేయానంద్, ఆల్ఇండియా సాఫ్ట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు
పి.ఎన్.పిసి. జేసీ అనితారామచంద్రన్, మాంచోఫెర్రర్ జ్యోతి ప్రజ్వలన చేసి
కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సాఫ్ట్బాల్ అసోసియేషన్ జిల్లా,
రాష్ట్ర, జాతీయస్థాయి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల
నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చుఫాస్టు నిర్వహించారు. సభ అధ్యక్షులు
జితేంద్రరెడ్డి వినతిమేరకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి 33వ జాతీయస్థాయి
సీనియర్ సాఫ్ట్బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి,
శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆదరణకు కొదువలేదు
కరువు జిల్లా అయిన అనంతలో ఆదరణకు కొదువలేదు. జాతీయస్థాయి చాంపియన్ షిప్
ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది.
సాఫ్ట్బాల్ అకాడమికి కృషి - మాంచోఫెర్రర్
వివిధ క్రీడలతోపాటు సాఫ్ట్బాల్ను కూడా అభివృద్ధి చేసేందుకు కృషి
చేస్తామన్నారు. సాఫ్ట్బాల్ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
ఫోటోలు
హోరాహోరీగా మ్యాచ్లు..
అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ సీనియర్ ఛాంపియన్
షిప్పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మొత్తం ఐదు మైదానాలలో ఈ మ్యాచ్లను
నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.పురుషుల విభాగంలో...
కర్ణాటక-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 4-1 స్కోరుతో
గెలుపొందింది. కేరళ-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో కేరళ జట్టు 14-0
పాయింట్లతో విజయం పొందింది. ఛత్తీస్ఘడ్-బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో
ఛత్తీస్ఘడ్ మ్యాచ్ 11-1 స్కోరుతో విజయం చేజిక్కించుకుంది.
మహిళల విభాగంలో...
జమ్మూకాశ్మీర్-మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో జమ్మూకాశ్మీర్ 10-0
స్కోరుతో గెలుపొందింది. ఛత్తీస్ఘడ్-ఒడిసా మధ్య జరిగిన మ్యాచ్లో 8-8తో
డ్రాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్-హిమాచల్ప్రదేశ్ మధ్య పోటీలో
హిమాచల్ప్రదేశ్ 6-0 స్కోరుతో గెలుపొందింది. మేఘాలయ-తమిళనాడు మధ్య మ్యా
చ్లో మేఘాలయ జట్టు 10-0 స్కోరుతో విజయం దక్కించుకున్నారు
తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ గుర్తింపు
రిటైర్మెంట్ ఆలోచన లేదు.... వివిఎస్ లక్ష్మణ్
ఆస్టేలియా టూర్లో పేలవ ఫామ్ తో సతమతమౌతూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న
హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ ఎట్టకేలకు నోరు
విప్పాడు. తన రిటైర్మెంట్ పై వస్తున్న విమర్శలకు, ఊహాగానాలకు ఫుల్స్టాప్
పెట్టాడు. నాలుగో టెస్టు కోసం బుధవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ అనంతరం ఓ
భారత విలేఖరితో తన రిటైర్మెంట్ ఇప్పట్లో ఉండదని చెప్పినట్లు ది ఏజ్
పత్రిక ప్రచురించింది. ఆసీస్ పై మూడు టెస్టుల్లో కేవలం 17 సగటుతో
102పరుగులు చేసిన లక్ష్మణ్, ఆసీస్ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి
విషయం తెలిసిందే.నాలుగు టెస్టుల ఆస్టేలియా సిరిస్లో వివిఎస్
లక్ష్మణ్ రెండు సార్లు డకౌట్ అయ్యాడు. ఒకే ఒక్క అర్థసెంచరీ చేశాడు. దీంతో
అతడిని టెస్టు క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలంటూ మాజీలు ఒత్తిడి చేయడం
జరిగింది. దీంతో మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్ పర్యటనలో
వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే
మొత్తం ఏడుగురు బ్యాట్స్మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్మెన్ అందరూ
బాధ్యత వహించాలి. ప్రస్తుతం ఆస్టేలియాలో జరగుతున్న నాలుగు టెస్టు సిరిస్లో ఇప్పటి వరకు మూడు
టెస్టులాడిన వివిఎస్ లక్ష్మణ్ 17 సగటుతో కేవలం 102 పరుగులు సాధించి
విమర్శకులకు తన రిటైర్మెంట్ గురించి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది.
మూడు టెస్టుల్లో పరాజయాన్ని మూట గట్టుకోని సిరిస్ని కోల్పోయిన టీమిండియా
విమర్శకుల మాటలకు సమాధానాన్ని చెప్పలేక పోయినప్పటికీ, సీనియర్
బ్యాట్స్మన్ వివిఎస్ లక్ష్మణ్ను తప్పించాల్సిందేనని భారత్లో మాజీ
క్రికెటర్లు, సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నా, టీమిండియా సభ్యులు ఆయనకు
బాసటగా నిలిచారు.మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్ పర్యటనలో
వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే
మొత్తం ఏడుగురు బ్యాట్స్మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్మెన్ అందరూ
బాధ్యత వహించాలి. కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి
వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది.
ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన
మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్
చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ
చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా
తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే
కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి
ఉంటుందని అన్నాడు. దానికి వీవీఎస్ కూడా ఇప్పట్లోనే తన రిటైర్మెంట్
ఉండదంటూ సూచనలు పంపించాడు. ఈనెల 24నుంచి అడిలైడ్లో జరుగనున్న నాలుగో
టెస్టులో ఎలా అయినా రాణించాలని వీవీఎస్ తపిస్తున్నాడు.
సుస్థిర పాలన అందివ్వగలిగింది తెలుగుదేశమే...చంద్రబాబు నాయుడు
Subscribe to:
Posts (Atom)