Thursday, 19 January 2012

వారసులొస్తున్నారు!



దివంగత తెలుగుదేశం పార్టీ నాయకుడు పరిటాల రవి పెద్ద కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. అనంతపురంలోని తన నివాసంలో ఆయన రాప్తాడు, అనంతపురం శాసనసభా నియోజకవర్గాలకు చెందిన పరిటాల అభిమానులతో, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ నెల 24వ తేదీన జరిగే పరిటాల రవి వర్ధంతి కార్యక్రమంపై ఆయన వారితో చర్చించారు. ఇక నుంచి పరిటాల రవి ట్రస్టు నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను ముందు ఉంటానని చెప్పారు. రాజకీయం పెద్దలు చూసుకుంటారని, రాజకీయం గురించి మాట్లాడే వయస్సు తనకు లేదని శ్రీరామ్ అన్నప్పటికీ భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే ఆయన క్రియాశీలకంగా ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు. 2014 ఎన్నికల నాటికి ఆయన రాజకీయాల్లోకి రావచ్చునని చెబుతున్నారు. అందుకు తగిన ప్రాతిపదిక ఏర్పడుతున్నట్లు చెబుతున్నారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ యువోత్సాహంలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఓ వైపు రాష్ట్ర రాజకీయాల్లోకి హీరో బాలకృష్ణ, అనంతపురం జిల్లాలో స్వర్గీయ పరిటాల రవీంద్ర తనయుడు పరిటాల శ్రీరాం, చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు వారసులు తెరపైకి రావడంతో తెలుగుదేశం పార్టీలో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతోంది. తాను రాజకీయాల్లోకి వస్తున్నానని ఇటీవల కృష్ణా జిల్లా పర్యటనలో బాలయ్య ప్రకటించడం టిడిపిని ఉత్సాహంలో ముంచడమే కాకుండా, రాష్ట్రంలో ఒక్కసారిగా బాలయ్య చర్చనీయాంశమయ్యారు. ఆయన ఎక్కడి నుండి పోటీ చేస్తారు, పార్టీలో ఏం బాధ్యతలు నిర్వహిస్తారనే అంశంపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఆయన రాజకీయ ఆరంగేట్ర ప్రకటనతో టిడిపిలో 1983 నాటి ఉత్తేజం కనిపిస్తోందనే వారూ ఉన్నారు. దీంతో 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే ధీమా టిడిపి వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఆ పార్టీ అధినేత చంద్రబాబు పలుమార్లు యువత రాజకీయాల్లోకి రావాలని, మేం ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నారు. పరిటాల తర్వాత అనంతపురం జిల్లాలో టిడిపి నిస్తేజంగా మారిందనే చెప్పవచ్చు. ఆ జిల్లాలో టిడిపికి పూర్వ వైభవం తీసుకు రావడానికి రాప్తాడు ఎమ్మెల్యే, పరిటాల సతీమణి సునీత ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అందులో భాగంగానే ఆమె తన తనయుడు పరిటాల శ్రీరాంను పరిచయం చేసినట్లుగా కనిపిస్తోంది. 2014 ఎన్నికల్లో శ్రీరాంకు ఎన్నికల్లో పోటీ చేసే వయసు ఉండదు. అయితే యువతను టిడిపి వైపు లాగేందుకే అధిష్టానం సూచనల మేరకు శ్రీరాంను తీసుకు వచ్చినట్లుగా కనిపిస్తోంది. పరిటాల తర్వాత దాదాపు నిరుత్సాహంతో ఉన్న పార్టీ క్యాడర్ సేవా కార్యక్రమాల పేరుతో శ్రీరాం రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. శ్రీరాం రాకతో జిల్లా కార్యకర్తల్లో నూతనోత్సాహం రావడంతో పాటు యువత నుండి కూడా మద్దతు బాగానే లభిస్తోంది. వచ్చే ఎన్నికల్లో శ్రీరాం పోటీ చేయకున్నప్పటికీ జిల్లాలో ప్రచారం చేసే అవకాశముందని పలువురు అభిప్రాయపడుతున్నారు.విజయవాడ టిడిపి నేత వల్లభనేని వంశీ కూడా శ్రీరాం రాక పట్ల హర్షం వ్యక్తం చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇటీవల చంద్రబాబు తన స్వగ్రామంలో పర్యటించినప్పుడు నారా వారసులు నారా లోకేష్, నారా రోహిత్ ఫోటోలు ఫ్లెక్సీల్లో ప్రముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఓ వైపు యువతను ఆకర్షించడానికి ఇలాంటి వారు రంగంలోకి దిగుతుండగానే, చంద్రబాబు రైతు పోరు బాట తదితర యాత్రల రుతో ప్రజల్లోకి వెళుతూ పార్టీ బలోపేతానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఐతే బాలయ్య ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండగా, పరిటాల శ్రీరాం వంటి యువకుల ప్రభావం జిల్లా వ్యాప్తంగా ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.

ఫామ్‌లో ఉన్నది క్రికెట్ దేవుడొక్కడే...డేవిడ్ వార్నర్


టెస్టు సిరీస్ ఆడుతున్న భారత్ బ్యాట్స్‌మెన్‌ల్లో ఫామ్‌లో ఉన్నది సచిన్ ఒక్కడేనని ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. సిరీస్‌లో సచిన్ మినహా భారత బ్యాట్స్‌మెన్ విఫలమవుతున్నారని వార్నర్ చెప్పాడు. కాగా అడిలైడ్ టెస్టులో భారత ఆటగాళ్లు దూకుడుగా ఆడవచ్చని భావిస్తున్నట్టు తెలిపాడు. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌లోగా నెంబర్‌వన్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకోవడమే తమ లక్ష్యమని చెప్పాడు.25 సంవత్సరాల వయసు కలిగిన డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ టీమిండియాలో చాలా మంది బ్యాట్స్ మెన్ ఉన్నప్పటికీ, నా మైండ్‌లో మాత్రం పరుగులు చేసే బ్యాట్స్‌మెన్‌గా కేవలం ఒక్క సచిన్ మాత్రమే కనిపిస్తున్నాడని అన్నాడు. టీమ్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ ప్రపంచ శ్రేణి ఆటగాళ్లుగా సంబోధించాడు. ఈ టెస్టు సిరిస్ లో వారు చేసిన స్కోరుని గనుక చూసినట్లేతే కేవలం అతి తక్కువ. అడిలైడ్‌లో జరగబోయే నాల్గవ టెస్టులో ఆసిస్ ఆటగాళ్లు కొత్త చరిత్రను తిరగరాయనున్నారని అన్నాడు.ఈ సిరిస్‌లో సచిన్ టెండూల్కర్ ఆఫ్ సెంచరీ చేసినప్పటికీ, తన వందో సెంచరీని చేయడంలో విఫలమయ్యాడని అన్నాడు. ఇప్పటికే టీమిండియా 0-3తో పరాజయాన్ని మూటగట్టుకుందని తెలిపాడు. టీమిండియా ఒత్తిడితో ఉండడం వల్లనే విదేశీ గడ్డపై ఏడు మ్యాచ్‌లు వరుసగా ఓడిపోయిందని తెలిపాడు. నాల్గవ టెస్టులో కూడా టీమండియాని ఓడించి, వైట్ వాష్ చేసే దిశగా ఆసిస్ ఆలోచిస్తుందని అన్నాడు. పెర్త్‌లో జరిగిన మూడో టెస్టులో ఇన్నింగ్స్ 37 పరుగుల విజయం సాధించిన తర్వాత ఆసిస్ కెప్టెన్ మైఖెల్ క్లార్క్ మాట్లాడుతూ ప్రపంచంలో రెండవ స్దానంలో ఉన్న టీమిండియాని ఓడించిన సందర్బంలో ఎంజాయ్ చేయండని టీమ్ సభ్యులకు తెలిపిన విషయం తెలిసిందే.

అనంతపురం జిల్లాలో జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలు



అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్ షిప్‌పోటీలు ప్రారంభం అయ్యాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాఫ్ట్‌బాల్ క్రీడాకారులు అనంతకు మొదటి సారి వచ్చారు. ఈనెల 23వ తేదీ వరకు అనంతలో సంజీవరెడ్డి స్టేడియంలో, ఆర్డీటీ క్రీడా గ్రామంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. పోటీలలో పాల్గొనడానికి 25 పురుష జట్లు, 22 మహిళా జట్లు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జితేంద్రరెడ్డి అధ్యక్షతన ప్రారంబోత్సవ సభను ఆర్డీటీ స్టేడియంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్సీ గేయానంద్, ఆల్ఇండియా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పి.ఎన్.పిసి. జేసీ అనితారామచంద్రన్, మాంచోఫెర్రర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తర్వాత సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులు మార్చుఫాస్టు నిర్వహించారు. సభ అధ్యక్షులు జితేంద్రరెడ్డి వినతిమేరకు ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి 33వ జాతీయస్థాయి సీనియర్ సాఫ్ట్‌బాల్ చాంపియన్ షిప్ పోటీలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించి, శాంతి కపోతాలను ఎగురవేశారు. ఆదరణకు కొదువలేదు కరువు జిల్లా అయిన అనంతలో ఆదరణకు కొదువలేదు. జాతీయస్థాయి చాంపియన్ షిప్ ఇక్కడ జరగడం ఆనందంగా ఉంది. సాఫ్ట్‌బాల్ అకాడమికి కృషి - మాంచోఫెర్రర్ వివిధ క్రీడలతోపాటు సాఫ్ట్‌బాల్‌ను కూడా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. సాఫ్ట్‌బాల్ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. ఫోటోలు హోరాహోరీగా మ్యాచ్‌లు.. అనంతలో మొదటి సారి 33వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ సీనియర్ ఛాంపియన్ షిప్‌పోటీలు పోటాపోటీగా జరుగుతున్నాయి. మొత్తం ఐదు మైదానాలలో ఈ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు. మొదటి రోజు మ్యాచ్ వివరాలు ఇలా ఉన్నాయి.పురుషుల విభాగంలో... కర్ణాటక-ఢిల్లీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 4-1 స్కోరుతో గెలుపొందింది. కేరళ-ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన పోటీలో కేరళ జట్టు 14-0 పాయింట్లతో విజయం పొందింది. ఛత్తీస్‌ఘడ్-బీహార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్ మ్యాచ్ 11-1 స్కోరుతో విజయం చేజిక్కించుకుంది. మహిళల విభాగంలో... జమ్మూకాశ్మీర్-మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ 10-0 స్కోరుతో గెలుపొందింది. ఛత్తీస్‌ఘడ్-ఒడిసా మధ్య జరిగిన మ్యాచ్‌లో 8-8తో డ్రాగా ముగిసింది. ఆంధ్రప్రదేశ్-హిమాచల్‌ప్రదేశ్ మధ్య పోటీలో హిమాచల్‌ప్రదేశ్ 6-0 స్కోరుతో గెలుపొందింది. మేఘాలయ-తమిళనాడు మధ్య మ్యా చ్‌లో మేఘాలయ జట్టు 10-0 స్కోరుతో విజయం దక్కించుకున్నారు








తిరుపతి రైల్వే స్టేషన్ అంతర్జాతీయ గుర్తింపు


తిరుపతి రైల్వే స్టేషన్‌ను మరో ఐదేళ్లలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నట్టు ఎంపి డాక్టర్ చింతామోహన్ తెలిపారు. 125 సంవత్సరాల క్రితం తిరుపతి రైల్వే స్టేషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. అప్పట్లో 2 రైళ్లు వచ్చేవని, 5వేల మంది ప్రయాణికులు తిరుపతి వచ్చేవారన్నారు. అయితే నేడు 75 రైళ్లు తిరుపతికి ప్రతిరోజు వస్తుండగా, సరాసరి లక్ష మంది ప్రయాణిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఈ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌గా విస్తరింపజేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందుకు సంబంధించి 300 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేయనున్నట్టు తెలిపారు. ప్రస్తుత రైల్వే స్టేషన్‌ను అలాగే ఉంచి తిరుపతి వెస్టు రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే వెస్టు రైల్వే స్టేషన్‌లో రైల్వేకి సంబంధించి 50 ఎకరాల భూమి ఉందన్నారు. మరో 20 ఎకరాలు ఇచ్చేందుకు టిటిడి సిద్ధంగా ఉందన్నారు. మరో ఐదేళ్లలో అంతర్జాతీయ రైల్వే స్టేషన్ రూపుదిద్దుకోనున్నదన్నారు.

రిటైర్‌మెంట్ ఆలోచన లేదు.... వివిఎస్ లక్ష్మణ్



ఆస్టేలియా టూర్‌లో పేలవ ఫామ్‌ తో సతమతమౌతూ తీవ్రవిమర్శలు ఎదుర్కొంటున్న హైదరాబాదీ స్టైలిష్‌ బ్యాట్స్‌మన్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ఎట్టకేలకు నోరు విప్పాడు. తన రిటైర్మెంట్‌ పై వస్తున్న విమర్శలకు, ఊహాగానాలకు ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. నాలుగో టెస్టు కోసం బుధవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌ అనంతరం ఓ భారత విలేఖరితో తన రిటైర్మెంట్‌ ఇప్పట్లో ఉండదని చెప్పినట్లు ది ఏజ్‌ పత్రిక ప్రచురించింది. ఆసీస్‌ పై మూడు టెస్టుల్లో కేవలం 17 సగటుతో 102పరుగులు చేసిన లక్ష్మణ్‌, ఆసీస్‌ బౌలర్లపై ఆధిపత్యాన్ని ప్రదర్శించి విషయం తెలిసిందే.నాలుగు టెస్టుల ఆస్టేలియా సిరిస్‌లో వివిఎస్ లక్ష్మణ్ రెండు సార్లు డకౌట్‌ అయ్యాడు. ఒకే ఒక్క అర్థసెంచరీ చేశాడు. దీంతో అతడిని టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవ్వాలంటూ మాజీలు ఒత్తిడి చేయడం జరిగింది. దీంతో మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. ప్రస్తుతం ఆస్టేలియాలో జరగుతున్న నాలుగు టెస్టు సిరిస్‌లో ఇప్పటి వరకు మూడు టెస్టులాడిన వివిఎస్ లక్ష్మణ్ 17 సగటుతో కేవలం 102 పరుగులు సాధించి విమర్శకులకు తన రిటైర్‌మెంట్ గురించి మాట్లాడే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. మూడు టెస్టుల్లో పరాజయాన్ని మూట గట్టుకోని సిరిస్‌ని కోల్పోయిన టీమిండియా విమర్శకుల మాటలకు సమాధానాన్ని చెప్పలేక పోయినప్పటికీ, సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ వివిఎస్‌ లక్ష్మణ్‌ను తప్పించాల్సిందేనని భారత్‌లో మాజీ క్రికెటర్లు, సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నా, టీమిండియా సభ్యులు ఆయనకు బాసటగా నిలిచారు.మీడియాతో మాట్లాడిన గౌతమ్ గంభీర్ ఆసీస్‌ పర్యటనలో వైఫల్యానికి ఒక్కరినే ఎందుకు బాధ్యుడ్ని చేస్తారు? అలా బాధ్యుల్ని చేస్తే మొత్తం ఏడుగురు బ్యాట్స్‌మన్లను చేయాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ‘ఇక్కడ మేం సమష్టిగా విఫలమయ్యాం. దీనికి టాప్ ఏడుగురు బ్యాట్స్‌మెన్ అందరూ బాధ్యత వహించాలి. కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు కానీ లక్ష్మణ్ ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అతడు భారత క్రికెట్ దిగ్గజం. చాలా ఏళ్ల నుంచి సేవ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి గురించి ఇతరులెవరు నిర్ణయించడానికి.. ఏదైనా తన చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ విమర్శించదలుచుకుంటే లక్ష్మణ్ ఒక్కడినే కాదు.. ఓటమికి కారణమైన మొత్తం బ్యాటింగ్ విభాగాన్ని తప్పుపట్టాల్సి ఉంటుందని అన్నాడు. దానికి వీవీఎస్‌ కూడా ఇప్పట్లోనే తన రిటైర్మెంట్‌ ఉండదంటూ సూచనలు పంపించాడు. ఈనెల 24నుంచి అడిలైడ్‌లో జరుగనున్న నాలుగో టెస్టులో ఎలా అయినా రాణించాలని వీవీఎస్‌ తపిస్తున్నాడు.

సుస్థిర పాలన అందివ్వగలిగింది తెలుగుదేశమే...చంద్రబాబు నాయుడు


రాష్ట్రంలో వ్యవసాయం లాభసాటిగా మారేవరకు రైతు సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తానని, రైతులు, పేదల కోసం తమ ప్రాణాలైనా ఇస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, ప్రధాన పంటలు సాగుచేస్తున్న రైతులు పెట్టుబడులు కూడా కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలో ఆయన గురువారం 'రైతు పోరుబాట' నిర్వహించారు. మధ్యాహ్నం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకంలో వరసిద్ధి వినాయకుని దర్శించుకున్న అనంతరం రెండు గంటలకు అగరంపల్లె నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అగరంపల్లె కూడలిలో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఎరువులు, క్రిమిసంహారక మందులు, డీజిల్, కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వం పదేపదే ఎరువుల ధరలు పెంచుతూ పోవడంతో డీఏపీ బస్తా ధర రూ.400 నుంచి రూ. 1200కు పెరిగిపోయిందని, బ్లాక్ మార్కెట్‌లో వీటిని మరింత అధిక ధరలకు విక్రయిస్తున్నారని విమర్శించారు. ఈ పరిస్థితిని చక్కదిద్ది రైతులకు గిట్టుబాటు ధరలు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. చంద్రబాబు కాణిపాకం నుండి తన రైతు పోరు బాట యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బొత్స రాష్ట్రంలో లిక్కర్ డాన్‌గా మారారని ఆరోపించారు. కుటుంబ సభ్యుల ద్వారా ముఖ్యమంత్రి డబ్బు దండుకుంటున్నారని విమర్శించారు. పాలన పక్కన పెట్టి కాంగ్రెసు నేతలు పదవుల కోసం ఢిల్లీ చుట్టూతిరుగుతున్నారన్నారు. చిరంజీవిది కూడా అదే పరిస్థితి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. మద్యం మాఫియా విచ్చలవిడిగా రాజ్యమేలుతోందన్నారు. చెత్త నేతలు అధికారం కోసం పాట్లు పడటం శోచనీయమన్నారు. రైతు పోరు బాట ప్రభుత్వానికి చెంప పెట్టు అన్నారు.తెలుగుదేశం పార్టీయే రాష్ట్రంలో సుస్థిర పాలన ఇస్తుందన్నారు. పార్టీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కాంగ్రెసు ప్రభుత్వం పాలనను, రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే రైతులకు న్యాయం చేస్తామన్నారు. కాగా ఈ నెల 20వ తేది నుండి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. భారీ వర్షాల వల్ల జిల్లాలో దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి ఆయన కందుకూరు నియోజకవర్గానికి వెళ్లనున్నారు