Saturday, 17 December 2011

వెంకటేష్ సినిమాలో.. మహేష్ బాబు తమ్ముడి పాత్రలో!



విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే మల్టీ స్టారర్ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో వెంకీ అన్నయ్య పాత్రలో, మహేష్ బాబు తమ్ముడి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన ఇప్పటికే సమంత ఖరారైంది. అయితే వెంకీకి మాత్రం ఇంకా హీరోయిన్ దొరక లేదు. త్రిషను ఎంపిక చేద్దామకున్నప్పటికీ మహేష్ వదిన పాత్ర చేయాల్సి వస్తుందని ఒప్పుకోలేదు. భూమికను బుక్ చేద్దామన్నా వీలు కాలే. కాల్సీట్లు లేవంటూ అనుష్క కూడా నో చెప్పింది. అయితే ఎట్టకేలకు వెంకీ భార్య పాత్రలో నటించే హీరోయిన్ దొరికినట్లు తెలుస్తోంది. బెజవాడ చిత్రంలో నాగచైతన్య సరసన నటించిన అమలపాల్ ఈ సినిమాలో వెంకీ భార్య పాత్రకు ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కొత్త బంగారు లోకం ఫేం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు.

కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే రుసుం వసూలు!

కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే గ్రామ కార్యదర్శి, మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ తదుపరి తహశీల్దార్ సంతకాలు కావాలి. వీరిలో ఎవరు లేకున్నా వీటి కోసం ఆగాల్సిందే. దీంతో పాటు వారి స్థాయిని బట్టి అక్కడి ప్రాంతాల పరిస్థితులను బట్టి ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. ఇక రిజిస్ట్రేషన్ శాఖకు వెళితే ఇక్కడా ఇదే తంతు. రోజులకు రోజులు వేచి ఉండడంతో పాటు దళారుల బెడద ఉండనే ఉంది. వీటన్నింటికీ త్వరలోనే చరమగీతం పాడనుంది. దాదాపుగా 12 రకాల ధృవీకరణ పత్రాలు 15 నిమిషాల వ్యవధిలోనే నామమాత్రపు రుసం చెల్లించి తీసుకునే వెసులుబాటు రానుంది. ఇందుకుగానూ యూజర్ ఛార్జీల పేరుతో రూ. 30 వరకూ నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకూ పట్టణాలకే పరిమితమైన కంప్యూటరీకరణ ఇక పల్లెలకూ విస్తరించనుంది. ముఖ్యంగా అన్ని పంచాయతీలనూ కంప్యూటరీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత కింద జిల్లాలోని 27 మండలాల పరిధిలో 34 గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ ప్రాంరంభమైంది. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీలను కంప్యూటరీకరించున్నారు. పంచాయతీకి సంబంధించిన ఆస్థి పన్ను, నిధుల వ్యయం తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్‌లైన్‌లో ఉంచనున్నారు. మీ సేవ పేరుతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను కంప్యూటరీకరించనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీల సేవలన్నింటినీ కంప్యూటరీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆస్థిపన్ను, నిధుల వ్యయం, జనన మరణ ద్రువీకరణ పత్రాలు తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్‌లైన్ చేయనున్నారు.

సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న!

క్రికెట్ అభిమానులూ ఆనందంతో ఊగిపోండి! భారత్ క్రికెట్ ముద్దుబిడ్డ సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న సాకారమయ్యే రోజు మరెంతో దూరం లేదు! దేశ అత్యున్నత పౌర పురస్కారం పరిధిని విస్తరిస్తూ ఇక క్రీడాకారులకూ ఈ అవార్డును అందించాలని కేంద్రం నిర ్ణయించింది. అందుకోసం అర్హత నిబంధనలనూ సవరించింది. ఇకనుంచి 'మానవ ప్రమేయం ఉన్న ఏ రంగం'లోనైనా అత్యున్నత ప్రతిభను గుర్తిస్తూ భారతరత్న ఇవ్వనున్నట్టు కేంద్ర క్రీడల శాఖ మంత్రి అజయ్ మాకెన్ వెల్లడించారు. మాకెన్ తాజా ప్రకటనతో రికార్డుల రారాజు సచిన్‌తో పాటు హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్‌కు భారతరత్న ఇచ్చేందుకూ మార్గం సుగమం అయినటే ్ట. మాస్టర్ 2008లో దేశంలోనే ద్వితీయ అత్యుత్తమ పురస్కారం అయిన పద్మ విభూషణ్ అందుకున్నాడు.కాగా, 1955లో రూపొందించిన నియమ నిబంధనల ప్రకారం, కొన్ని ప్రత్యేక రంగాలకు చెందిన వ్యక్తులకు మాత్రమే 'భారతరత్న' ఇచ్చేవారు. అంటే కళలు, సాహిత్యం, సైన్స్, ప్రజా సేవకు సంబంధించి అత్యున్నత నైపుణ్యశీలురకు ఈ అరుదైన గౌరవం దక్కేది. తాజా సవరణలతో ఇక నుంచి అన్ని రంగాలూ అవార్డు పరిధిలోకి వస్తాయి. కాగా, క్రీడారంగాన్ని ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు పరిగణనలోకి తెచ్చేందుకు మంత్రి మాకెన్ తీవ్రంగా కృషి చేశారు. మాకెన్ ఇదే విషయమై హోం మంత్రిత్వ శాఖకు ఓ లేఖ రాయడంతో, ప్రధానమంత్రి కార్యాలయం నోటిఫికేషన్ ద్వారా నిబంధనల సవరణకు గత నెలలో శ్రీకారం చుట్టింది. ఇక ఈసారి భారతరత్న ఎవర్ని వరించనుందని మాకెన్‌ను ప్రశ్నించగా, 'హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్, రన్ మెషీన్ సచిన్‌లు ప్రధాన పోటీదారుల'ని పేర్కొన్నారు. అంతకుముందు ఓసారి మాకెన్, 'ఏ క్రీడాకారుడికైనా భారతరత్న లభిస్తే ఆ రోజు భారత క్రీడారంగానికి సుదినమ'ని ట్విట్టర్‌లో పేర్కొనడం విశేషం.