Saturday, 17 December 2011
వెంకటేష్ సినిమాలో.. మహేష్ బాబు తమ్ముడి పాత్రలో!
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే రుసుం వసూలు!
కుల, ఆదాయ, నివాస ధృవీకరణ పత్రాలు కావాలంటే గ్రామ కార్యదర్శి, మండల
రెవెన్యూ ఇన్స్పెక్టర్ తదుపరి తహశీల్దార్ సంతకాలు కావాలి. వీరిలో ఎవరు
లేకున్నా వీటి కోసం ఆగాల్సిందే. దీంతో పాటు వారి స్థాయిని బట్టి అక్కడి
ప్రాంతాల పరిస్థితులను బట్టి ఆమ్యామ్యాలు ఇచ్చుకోవాల్సిందే. ఇక
రిజిస్ట్రేషన్ శాఖకు వెళితే ఇక్కడా ఇదే తంతు. రోజులకు రోజులు వేచి ఉండడంతో
పాటు దళారుల బెడద ఉండనే ఉంది. వీటన్నింటికీ త్వరలోనే చరమగీతం పాడనుంది.
దాదాపుగా 12 రకాల ధృవీకరణ పత్రాలు 15 నిమిషాల వ్యవధిలోనే నామమాత్రపు రుసం
చెల్లించి తీసుకునే వెసులుబాటు రానుంది. ఇందుకుగానూ యూజర్ ఛార్జీల పేరుతో
రూ. 30 వరకూ నామమాత్రపు రుసుము వసూలు చేస్తారు. ఇలా ఇప్పటి వరకూ పట్టణాలకే
పరిమితమైన కంప్యూటరీకరణ ఇక పల్లెలకూ విస్తరించనుంది. ముఖ్యంగా అన్ని
పంచాయతీలనూ కంప్యూటరీకరించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి విడత
కింద జిల్లాలోని 27 మండలాల పరిధిలో 34 గ్రామ పంచాయతీల కంప్యూటరీకరణ
ప్రాంరంభమైంది. రాబోయే రోజుల్లో అన్ని పంచాయతీలను కంప్యూటరీకరించున్నారు.
పంచాయతీకి సంబంధించిన ఆస్థి పన్ను, నిధుల వ్యయం తదితర అంశాలన్నింటినీ
కంప్యూటరీకరించి ఆన్లైన్లో ఉంచనున్నారు. మీ సేవ పేరుతో ఇప్పటికే రాష్ట్ర
ప్రభుత్వం రెవెన్యూ, రిజిస్ట్రేషన్ సేవలను కంప్యూటరీకరించనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే గ్రామ పంచాయతీల సేవలన్నింటినీ కంప్యూటరీకరించే
కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆస్థిపన్ను, నిధుల వ్యయం, జనన మరణ
ద్రువీకరణ పత్రాలు తదితర అంశాలన్నింటినీ కంప్యూటరీకరించి ఆన్లైన్
చేయనున్నారు.
సచిన్ టెండూల్కర్కు భారతరత్న!
Subscribe to:
Posts (Atom)