Wednesday, 23 November 2011

సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి సత్యసాయిబాబా జయంతి వేడుకలకు సిద్దమైంది. బాబా శివైక్యం పొందిన తరువాత మొదటి సారి జరుగుతున్న వేడుకలకు సత్యసాయి ట్రస్టు చర్యలు చేపట్టింది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి భక్తులు చేరుకున్నారు. మరోవైపు సత్యసాయిడీమ్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సం ఇవాళ జరుగనుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ట్రస్టు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. బాబా భౌతికంగా దూరమైన తరువాత నిర్వహించే మొదటి జన్మదిన వేడుక ఇది. ప్రతిసారి సాయిపుట్టిన రోజున బాబాను దర్శించుకొని భక్తులు పులకించిపోయేవారు. బాబా ప్రకటించే సేవాకార్యక్రమాలకోసం ఉత్కంఠంగా ఎదురు చూసేవారు. ఈసందర్భంగా ఆయన ప్రత్యేక రథంలో ఊరేగి అందరిని దీవించే వారు. భక్తులు బాబా పాదాలను తాకి పరవశించిపోయేవారు. ఈ సారి బాబా భౌతికంగా లేకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు. బాబా పుట్టిన రోజు వేడుకలను చూసి తరచేందుకు దేశ, విదేశాలనుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఆయన తమతో లేకపోయిన సాయి దివ్యసమాధిని దర్శించుకునేందుకే ఇక్కడికి వచ్చామంటున్నారు. సత్యసాయిబాబా డీమ్డ్ యూనివర్సిటీ 30వ స్నాతకోత్సవం వేడుక ఇవాళ జరగనుంది. ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరంలో చాన్స్‌లర్ జస్టిస్ భగవతి అధ్యక్షతన ఈ వేడుకలు జరుగనున్నాయి. ముఖ్యఅతిధిగా బెంగుళూరుకు చెందిన పరిశోధనా శాఖ డైరెక్టర్ బలరాం పాల్గొంటారు. ప్రతిభకనబరిచిన విద్యార్ధులకు బంగారు పతకాలను బహూకరిస్తారు.

No comments:

Post a Comment