నిరుద్యోగ యువతకు ప్రధాన మంత్రి ఉపాధి కల్పన ఒక వరం లాంటిదని రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల డైరక్టర్ మోహన్రావు పేర్కొన్నారు. కలెక్టరేట్ సభా భవనంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పనపై బ్యాంకు అధికారుల తో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఎంఆర్వై పథకంలో భాగంగా పరిశ్రమ స్థాపనలో దేశంలో మన రాష్ట్రం రెండో స్థానంలో ఉందన్నా రు. రూ.110 కోట్లు సబ్సిడీ వినియోగించుకోవాల్సి ఉండగా మన రాష్ట్రం 73 కోట్లు సబ్సిడీ వినియోగించుకుందన్నారు. రాష్ట్రం పరిశ్రమల ఏర్పాటులో మొద టి స్థానానికి రావాలంటే బ్యాంకు అధికారులు తమ వంతు సహకారం అందిం చాలన్నారు.నిరుద్యోగ యువతకు పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు బ్యాంకు అధికారులు పెండింగ్ లేకుండా క్లియర్ చేయాలని సూచించారు. రిజ ర్వు బ్యాంకు 10లక్షలు చిన్న పరిశ్రమలకు ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బ్యాం కులు రుణాలు ఇవ్వాలని 25లక్షలు క్రెడిట్ ప్లాన్ ద్వారా రుణాలు ఇచ్చేందుకు ఆన్లైన్ ద్వారా బ్యాంకులు మంజూరు చేస్తారన్నారు. బ్యాంకులు మంజూరు చేసిన రుణాలను మొదటి కంతు చెల్లించిన వెంటనే సబ్సిడీ వస్తుందని తెలి పారు. 2011కి 297 కోట్లు మార్జిన్ మనీ కింద 12936 ప్రాజెక్టులు మంజూరు చేశామన్నారు.యువతకు వివిధ వృత్తుల్లో శిక్షణ అందిస్తే వారిని బ్యాంకులు రుణాలు సబ్సిడీపై అందించాలన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అవగాహన కల్పించాలన్నారు
No comments:
Post a Comment