పోలీస్ కానిస్టేబుల్ సెలెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు క్రిమీలేయర్ సర్టిఫికెట్ల కోసం అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకు నేవారు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు జత చేస్తే సరిపోతుంది. కానీ ఈ పర్యాయం ప్రభుత్వం నోటిఫి కేషన్ జారీ చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు అభ్యర్థులు క్రిమిలేయర్ సర్టిఫికేట్లు జత చేయాలని ఆదేశించింది. దీంతో అ భ్యర్థులు తహసీల్దార్ కార్యాలయానికు క్యూ కట్టారు. మీ సేవ ద్వారా ఆ దాయం,కుల ధ్రువీకరణ పత్రాలు ఇస్తున్నారే కానీ క్రిమిలేయర్ అంశం లేదు. సర్టిఫికేట్ మంజూరు చేయాలం టే రెవెన్యూ అధికారులు పెద్ద తతంగమే పూర్తి చేయాల్సి వుంది. దీని కోసం ఓ ఫైలును తయారు చేసి వీ ఆర్వోలు, ఆర్ఐలు స్టేట్మెంట్ రికార్డు చేయాల్సి వుంది. దీనితో పాటు అ భ్యర్థుల తల్లిదండ్రుల స్టేట్మెంట్లు రికార్డు చేయాల్సి వుంది. ఆదాయ పరిమితి సంవత్సరానికి రూ.4.5 లక్షలు లోపు వున్న వారికే ఓబీసీ సర్టిఫికేట్ మంజూరు చేయాలన్నది ప్రభుత్వ నిర్ధేశం. ఈ ప్రక్రియ పూర్తి చేసి సర్టిఫికేట్ చేతికందే సరికి వారం రోజులు పడుతోంది. స్థానిక తహసీల్దార్ అమరేం ద్రబాబుతో అభ్యర్థులు తమ సమస్యను విన్నవించారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ వీఆర్వోలు, ఆర్ఐలు విచారించి సైడ్ ఇన్షియల్ వేస్తే క్రిమిలేయర్ సర్టిఫికేట్ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆర్ఐలు నవీన్, శాస్త్రిలకు సూచనలిచ్చారు
No comments:
Post a Comment