Tuesday, 18 October 2011

ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని రాయలసీమ రేంజ్ డీఐజీ చారుసిన్హా అన్నారు

రాయలసీమలో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందని రాయలసీమ రేంజ్ డీఐజీ చారుసిన్హా అన్నారు. సోమవారం పట్టణంలోని సీఐ కార్యాలయాన్ని ఆమెతో పాటు ఎస్పీ షహనావాజ్ ఖాసీం, అడిషనల్ ఎస్పీ శివయ్య సందర్శించారు. ఈ సందర్భంగా డీఐజీ విలేకరులతో మాట్లాడుతూ.. సీమలో పోలీసుల చర్యతో ఫ్యాక్షన్ తగ్గుముఖం పట్టిందన్నారు. గ్రామాల్లో అక్కడక్కడా చిన్నచిన్న సమస్యలతో వివాదాలు జరుగుతున్నాయని, వాటిపై సకాలంలో చర్యలు తీసుకుని రాజీమార్గం ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

మావోయిస్టుల ప్రభావం కూడా తగ్గిందని, సూడో నక్సల్స్‌ను ఉక్కుపాదంతో అణచివేసినట్లు తెలిపారు. దొంగతనాలు, దోపిడీల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశించినట్లు చెప్పారు. ప్రొహిబిషన్ ఎస్‌ఐలు సమర్థవంతంగా పని చేస్తున్నారని, త్వరలో అన్ని స్టేషన్లకు ఎస్‌ఐల నియామకం జరుగుతుందన్నారు. కానిస్టేబుళ్ల కొరత లేకుండా దశల వారీగా నియామకాలు చేపడతామన్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు, స్టేషన్‌లోని సమస్యల గురించి డీఎస్పీ కోలార్‌కృష్ణ, సీఐ రామకృష్ణలను అడిగి తెలుసుకున్నారు

No comments:

Post a Comment