Tuesday, 18 October 2011

గురుకులాలకు నాంది పలికిన ఘనత నందమూరిదే

రాష్ట్రంలో దారిద్య్రం, పేదరికంతో వెనుకబడిన కులాల వారి సంక్షేమం కోసం గురుకులాల వ్యవస్థకు నాంది పలికిన ఘనత నందమూరి తారక రామారావుదేనని ఆర్డీటి విద్యాశాఖ డైరెక్టర్ తిప్పేస్వామి పేర్కొన్నారు. సోమవారం స్థానిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల కాళసముద్రంలో రాయలసీమ స్థాయి జోనల్ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్బంగా తిప్పేస్వామి మాట్లాడుతూ రామారావ్ అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం గురుకుల పాఠశాల వ్యవస్థను ప్రవేశపెట్టి లక్షలాది మందికి క్రమశిక్షణతో కూడిన ఉన్నత విద్యను అందించడానికి కృషి చేశారన్నారు. ఆయన కృషి ఫలితమే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మందికి ఉపాధి, విద్యావకాశాలు పెరిగాయన్నారు. గెలుపు ఓటములు అనేవి పక్కన పెట్టి క్రీడా స్పూర్తితో వ్యవహరించి ముందుకెళ్లాలన్నారు. ప్రిన్సిపల్ గిరిజా కుమారి అద్యక్షతన జరిగిన సభలో ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ సంస్థ అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత రమేష్, కణేకల్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీదేవి, సీనియర్ అధ్యాపకులు శ్రీనివాస్ చౌదరి, ఆదినారాయణ, పిడిలు జనార్ధన్‌రెడ్డి, పాల్గొన్నారు. రాయలసీమ స్థాయి గురుకుల జోనల్ క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌బిహెచ్ మేనేజర్ వాణిశ్రీ, బ్లూమూన్ విద్యా సంస్థల అధినేత శివశంకర్, మైరాడా ప్రాజెక్టు అధినేత వైఎస్ రమేష్, కణేకల్ ప్రిన్సిపాల్ శంకర్‌రెడ్డి, పట్నం ఎస్సై గంగాధర్‌రావ్, న్యాయవాది విజయ్‌కుమార్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. నాలుగవ జోని విభాగం కింద ప్రారంభమైన పోటీలకు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతజిల్లాలకు చెందిన 16 సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలు, కళాశాలకు చెందిన 400 మంది క్రీడాకారులు హాజరయ్యారు

No comments:

Post a Comment