Tuesday, 18 October 2011

29వ తేదీన జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు తెలిపారు

డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్, టెక్నాలజి(ఏపీ), భారత శాస్త్ర సాంకేతిక పరిశోధనా మండలి వారి సంయుక్త ఆధ్వర్యంలో 29వ తేదీన జిల్లా బాలల సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నట్లు బాలల ఎన్‌సీఎస్‌సీ చైర్మన్, జిల్లా విద్యాశాఖాధికారి డి. వెంకటసుబ్బయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎ.క్యాంపులోని మాంటిస్సోరి హైస్కూల్‌లో ఉదయం 8.30 నుంచి కార్యక్రమం ఉంటుందన్నారు.

‘భూ వనరులను అభివృద్ధి కోసం వినియోగించు-భవిష్యత్తు కొరకు ఆదా చేయి’లోని వివిధ అంశాలైన ‘మనకు తెలిసిన భూమి-దాని పనులు, నేల నాణ్యత, నేలపై మానవ కార్యకలాపాలు, నేల సుస్థిర వినియోగం’ తదితర అంశాలపై 10 నుంచి 17 సంవత్సరాల వయస్సు కల్గిన విద్యార్థులు(బాల శాస్త్రవేత్తలు) బృందంగా ప్రాజెక్టు తయారు చేసి కార్యక్రమంలో ప్రదర్శించాలన్నారు.

జిల్లాలో ని అన్ని (ప్రభుత్వ, జెడ్పీ, ఎయిడెడ్, మున్సిపల్, గుర్తింపు పొందిన ప్రైవేటు) పాఠశాలలకు సంబంధించి గతంలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే ప్రాజెక్టును తయారు చేయించి కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలని హెచ్‌ఎంలను కోరారు. పూర్తి చేసిన దరఖాస్తులను ఈ నెల 24లోపు సంబంధిత డివిజన్ కో ఆర్డినేటర్లకు అందజేయాలన్నా రు. dcncsckurnool@gmail.com వెబ్‌సైట్‌లో కూడా వివరాలు పంపవచ్చన్నారు

No comments:

Post a Comment