Tuesday, 18 October 2011

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు

జిల్లాలో 30 వర్క్‌సైట్ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) అధికారులు సన్నాహా లు చేస్తున్నారు. ఎయిడ్ ఎట్ యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి ఈ స్కూళ్లను ప్రారంభించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ స్వచ్ఛంద సంస్థ ఇటీవల జిల్లాలో సర్వే నిర్వహించి 599 మంది పిల్లలు పలు చోట్ల పని చేస్తున్నట్లు గుర్తించింది. గ్రానైట్ పరిశ్రమల్లో, ఇటుకబట్టీల్లో, స్టోన్ క్రషింగ్ యూనిట్లలో ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, బీహార్ తదితర ప్రాం తాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలు కూడా పనిచేస్తున్నట్లు గుర్తించింది. పరిశ్రమల్లో సుమా రు 3,400 మంది పిల్లలు పనిచేస్తున్నట్లు స్వ చ్ఛంద సంస్థ అంచనా వేసినా, ఇప్పటి వరకు 599మంది పిల్లలను గుర్తించారు.

ఎక్కడెక్కడ ఎంతమంది...
మండలాల వారీగా కుప్పంలో 93 మంది పిల్లలు, ఆర్‌సీపురంలో 40మంది, తిరుపతి రూ రల్‌లో 65మంది, బీఎన్‌కండ్రిగలో 33మంది, వరదయ్యపాళెంలో 20మంది, వి.కోటలో వందమంది, తిరుచానూరులో 22 మంది, బంగారుపాళెంలో 20మంది, బెరైడ్డిపల్లెలో 20మంది, పీలేరులో 20 మంది పలు పరిశ్రమల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. అలాగే పులిచెర్ల మండలంలో 20మంది, నిమ్మనపల్లెలో 20మంది, మదనపల్లెలో 41మంది, బీ.కొత్తకోటలో 22మంది, సీటీఎంలో 20మంది, కురబలకోటలో 20మంది, కలికిరి మండలంలో 20 మంది పిల్లలు పలు చోట్ల పనిచేస్తున్నట్లు ఇప్పటి వరకు గుర్తించారు. వీరిలో ప్రతి 20 మందికి ఒక పాఠశాలను ఏ ర్పాటు చేసి ఒక విద్యావాలంటీర్‌ను నియమిం చనున్నారు. మొత్తం తొమ్మిది నెలల పాటు పిల్లలకు వారి మాతృభాషలో విద్యను బోధించనున్నారు

No comments:

Post a Comment