సిడ్నీలో ధోనీసేనకు చేదు అనుభవం
భారత్, ఆస్ట్రేలియాల గత సిడ్నీ టెస్టు భజ్జీ, సైమండ్స్ గొడవతో అత్యంత
వివాదాస్పదమైతే... తాజాగా మ్యాచ్ ఆరంభానికి ముందు మైదానం వెలుపల
టీమిండియా క్రికెటర్లకు చేదు అనుభవం ఎదురైంది. నూతన సంవత్సర వేడుకల
సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధాని జులియా గిలార్డ్ ఆహ్వానం మేరకు
తేనీటివిందుకు వెళ్లిన ధోనీసేన ఆమె అధికార నివాసం ముందు పడిగాపులుపడాల్సి
వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు ఆరంభం కావాల్సిన కార్యక్రమం పది నిమిషాలు
ఆలస్యమైంది. అయితే, 15 నిమిషాలు ముందుగానే వెళ్లిన భారత క్రికెటర్లను
ప్రధాని సిబ్బంది పట్టించుకోలేదు. దీంతో గిలార్డ్ ఇంటి ముందు కొంతసేపు
మండుటెండలోనే ఎదురుచూసిన ధోనీ బృందం ఎండకు తాళలేక గేటు బయట పార్క్ చేసిన
టీమ్ బస్లోకి వెళ్లారు. ఆ తర్వాత ఆటగాళ్లను ప్రధాని నివాసంలోకి
అనుమతించారు.
No comments:
Post a Comment